Tuesday, June 14, 2011

హైదరాబాదుల కరెంటుంటే ఆదిలాబాదుల లైటు వెలుగుతదా?

మన సమైక్యవాదం జేసే సీమాంధ్ర సోదరులు మాట మాట్లాడితే హైదరాబాదును హైదరాబాదును మేమే డెవలప్ జేసినం, హైదరాబాదును మాత్రం వదిలేది లేదు పిచ్చి వాదనలు చేస్తుంటరు, అదేదో హైదరాబాదు వాళ్ళ తాత జాగీరైనట్టు.

దీని మీద మనం హైదరాబాదు పై అత్యాశ అనే పేరు తోని ఒక టపా రాయడం జరిగింది. దాంట్ల హైదరాబాదు ముందు నుండి పెద్ద నగరమే నని, కొత్తగా పనిగట్టుకుని డెవలప్ జేసిందేమీ లేదని, ఆంద్రాల కరెంట్ తెల్వక ముందే హైదరాబాదుల పవర్ ప్లాంటు పెట్టిన్రని రాయడం జరిగింది.

ఇది జూసి విశాలాంధ్ర మహాసభ అని ఒక బ్లాగు పెట్టుకొని ప్రతి దినం తెలంగాణా జనాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న ఒక పెద్దమనిషి కింది కామెంటు పెట్టిండు.

Chaitanya said...

"ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. "

KCR చెప్పినదాని గురించి కాపీ కొట్టారా ఏమిటి? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. నిజాం మీరు డప్పు కొట్టినంత విధంగా ఏమి చేసినా అది బ్రిటిష్ దేశస్థుల సాంకేతిక సహాయాన్ని తీసుకునే కదా? మరి అటువంటిది వారి పాలనా లో ఉన్న ప్రెసిడెన్సి లో జనాలకు కరెంటు తెలియదా? మీరు చెప్పిన దాని నుండి ఎంత కరెంటు ఉత్పత్తి అయ్యేది ఎన్ని ఇండ్లకు సరఫరా జరిగేది (నిజాం భవనాలు మినహాయించి)?

From state electricity board's administrative report under rule no 59 APSEB supply rules 1958

Electrified cities/towns and villages as on 31-3-1956

Mahbubnagar 0
Medak 1
Nizamabad 0
Adilabad 0
Karimnagar 2
Warangal 0
Nalgonda 1
Hyderabad 2
Khammam 4
Srikakulam 37
Visakhapatnam 45
East Godavari 107
West Godavari 73
Krishna 77
Guntur 33
Nellore 26
Chittor 63
Kadapa 16
Anatapur 39
Kurnool 29


April 18, 2011 8:06 PM

నేను వ్రాసినదానికి, ఈయన జెప్పుతున్న దానికి ఏమన్నా పొంతన కనిపిస్తుందా. నేను మాట్లాడింది హైదరాబాదుల మొట్ట మొదటి పవర్ ప్లాంటు పెట్టిన్రని. అది తప్పైతే నిరూపించాలే. నేను రాసిన దానికి ఆధారం ఇక్కడ ఉన్నది. మరి సదరు బ్లాగరు బ్రిటిష్ వాడే ముందు పెట్టిండనే థర్మల్ ప్లాంటు ఎక్కడ ఉన్నదో తన బ్లాగులనే చెప్తే బాగుండేది. అంతే గని ఈ పెద్దమనిషి ఆ విషయాన్ని కన్వీనియెంట్ గ వదిలేసి 1956 ల ఎన్ని ఊర్లల్ల కరెంటు ఉన్నదన్న సంగతి మాట్లాడుతడు. పైనించి హైదరాబాదు మొత్తం ఒక యూనిట్ గ తీసుకుంటడట. హైదరాబాదు విధ్యుద్దీకరణ ఎన్ని ఊర్లకు సమానం అనుకోవాలె?

ఈ బ్లాగరు వ్రాసిన దాంట్ల రెండు విషయాలు కనపడుతున్నై. ఒకటి, తెలంగాణాల ఏదైనా తమకంటే మొదట జరిగిందంటే సహించ లేక పోవడం. రెండు, తమ దగ్గర దామాషాలో ఎక్కువ ఊర్లు అప్పటికే electrify అయినై కాబట్టి ఇప్పుడు గూడ అట్లనే ఉండాలే అనుడు. వీరి ప్రతి వాదనలో ఇదే కనపడుతది. అప్పుడు తెలంగాణాకి, ఆంధ్రాకి ముప్పై రెట్లు తేడా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అనుడు.

ఈ దామాషాల కపట నాటకం ఎట్లా ఉంటదంటే, స్వాతంత్ర్యం రాకముందు బ్రిటన్ కి ౧౦౦౦ విమానాలుంటే, మన దేశానికి ఒకటి గూడ లేదు. అంటె ఇప్పుడు గూడ మన దేశానికి అదే దామాషాల విమానాలు ఉండాలెనని వీరి ఉద్దేశమా?

ఒకప్పుడు తెలంగాణాల అభివృద్ధి జరుగలేదు, నిజమే, కాదని ఎవరన్నరు? నిజాం నవాబు ప్రజలను పీడించి కేవలం హైదరాబాదు నగరాన్నే అభివృద్ధి చేసిండని మేం మొదటినుంచి మొత్తుకుంటనే ఉన్నాం. కాని హైదరాబాదు మాత్రం అప్పుడు నిజాం అభివృద్ధి చేసిండు అతని స్వార్థం కోసం. ఇప్పుడు సమైక్య పాలకులు చేస్తున్నది కూడా వాళ్ళ వ్యాపారాల స్వార్థం కోసం మాత్రమె. హైదరాబాదుల ఉన్న బడుగు జీవికి అప్పుడూ ఒరిగింది లేదు, ఇప్పుడూ ఒరిగింది లేదు.

కలిసేటప్పుడు సమానంగా అభివృద్ధి చెందుతం అనుకున్నం. దామాషా పద్ధతిల అభివృద్ధి చేస్తమని ముందే చెప్పి వుంటే అప్పుడే మేల్కునే వాళ్ళం. తెలంగాణలో, ఆంధ్రలో అసమతుల్యత ఉంది కాబట్టే షరతులతోటి కూడిన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ షరతులు వమ్మైనై కాబట్టే ఇప్పుడు విడిపోతమంటున్నాం.

సదరు బ్లాగరు వ్రాసిన మరికొన్ని వ్యాఖ్యలు.

>>>రైతులకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ సరఫరా ద్వారా ఎక్కువ లాభబడుతున్నది తెలంగాణా ప్రాంతమేనని అందరికి తెలుసు.31-3-2010 నాటికి వ్యవసాయ కనెక్షన్లు 27.34 లక్షలకు చేరుకొన్నాయి.వీటిలో 17 లక్షల వరకు తెలంగాణలో ఉన్నాయి.

మొత్తం ప్రాజెక్టులు కట్టుకొని కాలువల కింద నీళ్ళు పారిచ్చుకుంట వుంటే ఇంక కనెక్షన్ల తోటి పనేముంది? అక్కడ ఉచిత నీటి సౌకర్యం ఉన్నప్పుడు, ఇక్కడ ఉచిత కరెంటు సౌకర్యం ఉంటె తప్పేంది? అసలు కరెంతోక్కటి ఉచితమైనా, బోర్లు వేసుడు, బోర్లు ఏందీ పోవుడు, మోటార్లు కాలి పోవుడు ఇట్లా లక్ష నరకాలుంటయి బోరు వ్యవసాయం జేసే రైతుకి. ఇక్కడ కట్ట వలసిన ప్రాజెక్టులు తిమ్మీద కట్టితే ఇన్ని మోటార్లు, ఇంట కరెంటు అవససరం ఏముంది?

>>>తెలంగాణా ప్రాంత డిస్కంలకు ట్రాన్స్కో విద్యుత్తును తక్కువ ధరకు అమ్ముతుంది. అయినా తెలంగాణా జిల్లాలలో అక్రమ వాడకం ఎక్కువ కాగా, బిల్లింగ్, మీటర్డ్ అమ్మకాలు తక్కువ. ఉదాహరణకు 2006 సంవత్సరంలో Current Theft cases in districts లో తెలంగాణా జిల్లాలే ముందు ఉన్నాయి.

ఎంత దుర్మార్గమైన వాదనో చూడున్రి. తెలంగాణా వాళ్ళు కరెంటు దోపిడీ చేస్తరట! ఆంధ్రా వాళ్ళు మాత్రం న్యాయంగా బిల్లు కడుతరట! వ్యవసాయానికి కాలిన కరెంటుకి మీటర్లే లేనప్పుడు మీటర్ల మీద అమ్మకం ఎట్లా ఉంటది? ఉచిత కరెంటు ఇచ్చినపుడు దాని మీద వసూళ్లు ఎట్లా ఉంటయి?

>>>పారిశ్రామికంగా 1961లో కోస్తాలో 58.5% విద్యుత్ వినియోగం అవుతూ ఉంటే తెలంగాణలో అది కేవలం 28.1%. నేడు అది తెలంగాణాలో 58.77 % ఉండగా కోస్తాలో 29.35 కి పడిపోయింది.రాయలసీమలో 15.6 నుండి 11.86 కి తగ్గింది.1961 నాటి భారత గణాంక వివరాల ప్రకారం చూస్తే కేవలం కృష్ణా జిల్లా వినియోగం ఆనాటి హైదరాబాద్ జిల్లా (రంగారెడ్డి, హైదరాబాద్) మొత్తం వినియోగం కంటే 45 % ఎక్కువ.

ఈ లెక్కలు ఎంతవరకు సరైనవో నాకు తెలవదు. సరైనవే అనుకుందాం. కాని ఈ వాడకంల హైదరాబాదు నగరంల ఎంత, మిగతా తెలంగాణాల ఎంత అని గూడ చెప్పితే బాగుండేది. కచ్చితంగా ఈ వాడకం హైదరాబాదుల తప్ప ఇంకో చోట ఉండదు, పరిశ్రమలు అక్కడ దప్ప ఇంకెక్కడున్నయి తెలంగాణాల? మరి తెలంగాణా ల ఉన్న పరిశ్రమలు ఎక్కువ సీమాంధ్రులవే గద! అట్లా అని మీరే చెప్పుకుంటారు. మరి ఆ కరెంటు వాడేది ఎవరు? పోనీ ఆ పరిశ్రమల్ల ఉద్యోగాలు చేసేది ఎవరు?

ఒక్కటి మాత్రం నిజం. అప్పటి నిజామైనా, ఇప్పటి సీమాంధ్ర పాలకులైనా ఎంతో కొంత అభివృద్ధి చేసింది హైదరాబాదు మాత్రమే. అదీ వారి వారి అవసరాల మేరకో, స్వార్థాలకోసమో తప్ప ఇంకోటి గాదు. కనీసం అప్పటి నిజాము ప్రజలకు ఉపయోగ పడే కళాశాలలు, దావఖానాలు, నీటి వసతులు కట్టిచ్చిండు. ఇప్పటి వలస పాలకులు హైటెక్ సిటీ, జూబిలీ హిల్స్ తప్ప ఇంకోటి అభివృద్ధి చేసిన పాపాన పోలే. కానీ హైదరాబాదు సంపదను మాత్రం బాగానే కొల్లగొట్టిన్రు.

No comments:

Post a Comment