Tuesday, June 28, 2011

మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఏంజేస్తున్నరు?

మాట మాట్లాడితే మన సమెక్కుడు వాదులు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఏమ్జేస్తున్నరు అని అడుగు తుంటరు. కొంత మంది ఇంకా ముందుకు పోయి మీ ప్రజా ప్రతినిధులు ఏమ్పీలాడ్స్ నిధులు ఏంజేస్తున్నరు అని కూడా అడుగుతరు.

లక్షా ఇరవై కోట్ల బడ్జెటు తో నడిచే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణా పనులు కావల్నంటే ఏమ్పీలాడ్స్, ఎమ్మెల్యే లాడ్స్ మాత్రమె దిక్కన్న మాట! అంతేగని ప్రభుత్వం నుంచి పైసా రాలదని వీళ్ళు చెప్పకనే చెప్పుతున్నరు. ఈ ఆంద్రప్రదేశ్  రాష్ట్రం ఉన్నంత వరకు ఈ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమిష్టి బాధ్యత. అంతేగని కుర్చీమీద నేను కూర్చుంట, పెత్తనం నెంజేస్త, పైసలు నేను మింగుత, నీ అభివృద్ధి నువ్వు జేసుకో అన్నంక ఇంక సమైక్య రాష్ట్రం ఎందుకు?

మా ప్రాంతంల అభివృద్ధి జరుగుతలేదు మొర్రో అనంగనే మీ ప్రాంతం నాయకులు ఏంజేస్తున్నరు అని అడుగుతరు. మీ ప్రాంతం నాయకులు సన్నాసులు అని అంటరు. నిజమే, మా ప్రాంతం నాయకులు సన్నాసులే, కాదనం. ఎందుకంటే వాళ్ళు మీతోని కొట్లాడి గెలువలేరు, మిమ్ముల కాదని నిధులు కేటాయింప జేసుకోనుడు వాళ్ళ తోని అయ్యే పని గాదు. వాళ్ళను బలోపేతం జెయ్యడానికే మాకు ప్రత్యేక రాష్ట్రం గావాలె.

మా ప్రాంతం నాయకులు సన్నాసులే. అందుకని మా ప్రాంతంల సమస్యలు అట్లనే మూలుగుతున్నయ్. మరి మా సమస్యలు చెప్పంగనే, మీరు మాగ్గూడ సమస్యలున్నయ్ అని ఎందుకు జెప్తరు? అంటె మీ నాయకులు గూడ సన్నాసులే నా? అందరూ సన్నాసులే అయినపుడు విడిపోయి ఎవని బతుకు వాడు బతుకుదాం. కనీసం రాష్ట్రం చిన్నగ ఉంటె ఈ సన్నాసుల పనితీరు కొంత మెరుగ్గ ఉంటది. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రి నడుప లేక పొతే కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటె నయమే కదా?


2 comments:

  1. sreekanth anna, MP lads tone panulu cheyyalani evaru cheppaledu. rendu prantallonu MP lu MLA lu peddaga podichindi emi ledu. kakapote seemandhralo leaders to pani lekunda evari pani varu chesukuntunnaru. meeru leaders ni guddiga follow ayipotu time kharabu chesukontundru. ante.

    ReplyDelete
  2. http://lightbehindshadow.blogspot.com/search/label/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%95%E0%B1%80%E0%B0%AF%E0%B0%82

    ReplyDelete