Friday, July 17, 2015

ఇదీ బాబు నిర్వాకం!

సర్కిల్ లో ఉన్నది బోయపాటి శ్రీను 

మొన్న ఎమ్మెల్యేల కుట్రలో "మనవాళ్ళు బ్రీఫుడు మీ" అంటూ అడ్డంగా దొరికిన చంద్రబాబు మరోసారి పుష్కరాల సందర్భంగా ఫోటోతో సహా దొరికి పోయాడు.

చంద్రబాబు ప్రచార కండూతి అందరికీ తెలిసిందే! అయితే అది ఈసారి మరిన్ని వెర్రితలలు వేసి  27 మంది చావుకు కారణమైంది .

పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుపుతానని ముందుగానే ఊహించేసుకుని, అలా జరిపించి నట్టు ప్రపంచ మీడియాకు తన రాజసాన్ని తెలియజెప్పే ఒక ఘోప్ప వీడియో ఉండక పొతే బాగోదని మీడియా సలహా దారులవారు అమూల్యమైన సలహా ఇచ్చారుట! రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, తొడగొట్టు సినిమాలతో బావమరిదికి హిట్ల మీద హిట్లు ఇస్తున్న బోయపాటి శ్రీను అన్న మనిషిని దర్శకుడిగా నియోగిమ్సుకుని దాదాపు నాలుగ్గంటల పాటు నిర్విరామంగా బాబుగారి పూజా కార్యక్రమ విశేషాలను చిత్రీకరించారట! ఆ చిత్రీకరణ కూడా వీఐపీ ఘాట్ లో అయితే రంజుగా ఉండదని, ప్రజలంతా చుట్టూ నిలబడి (బారికేడ్ల అవతలే అనుకొండి) చూస్తుంటే పెదరాయుడి లెవెల్లో పుష్కర ఘాట్ లో షూట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట!

ఇదంతా రూమరేమో అనుకోవడానికి కూడా వీల్లేకుండా ఫోటోతో సహా దొరికి పోయాడు పెద్దసారు!

Wednesday, July 15, 2015

పుష్కరాలు, నాయకుల పూజలు

ప్రజల మధ్య సగర్వంగా పూజలు నిర్వహించిన నాయకుడు ఒకరు. 



***

ప్రజలను బారికేడ్లతో అదిమిపట్టి మూడున్నర గంటలు ప్రత్యేక పూజలు చేసిన నాయకుడు ఇంకొకరు. 




***


ఒక నాయకుడు జనంతో పాటు వెళ్ళి సాధారణంగా పూజ ముగించుకుని వచ్చాడు.

ఇంకో నాయకుడు ఆర్భాటంగా కొన్ని వేల చదరపు గజాల స్థలాన్ని తనకోసం బ్లాక్ చేయించుకుని ప్రజల రద్దీ పెరిగేందుకు పరోక్ష కారకుడయ్యాడు. 

ఫలితం ... 

ఒకరికి కీర్తి !
మరొకరికి అపకీర్తి !! 

27 మంది దుర్మరణం !!!

***

చంద్రబాబు నాయుడు పక్కనే VIP ఘాట్ ప్రత్యేకంగా వున్నా కూడా అక్కడికి వెళ్ళలేదు. 
గంటకు కొన్ని వేల మంది ప్రజలు ఉపయోగించుకోవాల్సిన పుష్కర ఘాట్‌ని తన సొంతానికి బ్లాక్ చేయించాడు.  
తన పూజ అయ్యేంత వరకూ లక్షల జనాన్ని బారికేడ్‌లతో బంధించాడు. 
మూడున్నర గంటల పాటు పూజా పునస్కారాలలో మునిగితేలి, అమూల్యమైన ప్రజా-గంటలను వృధా చేశాడు. 

దాని పరిణామమే తొక్కిసలాట, 27 మంది మరణం.  

ఆ 27 మందిది మరణం కాదు హత్య. 

దానికి బాధ్యుడు, ప్రధమ ముద్దాయి చంద్రబాబు నాయుడు మాత్రమే.