Wednesday, July 15, 2015

పుష్కరాలు, నాయకుల పూజలు

ప్రజల మధ్య సగర్వంగా పూజలు నిర్వహించిన నాయకుడు ఒకరు. 



***

ప్రజలను బారికేడ్లతో అదిమిపట్టి మూడున్నర గంటలు ప్రత్యేక పూజలు చేసిన నాయకుడు ఇంకొకరు. 




***


ఒక నాయకుడు జనంతో పాటు వెళ్ళి సాధారణంగా పూజ ముగించుకుని వచ్చాడు.

ఇంకో నాయకుడు ఆర్భాటంగా కొన్ని వేల చదరపు గజాల స్థలాన్ని తనకోసం బ్లాక్ చేయించుకుని ప్రజల రద్దీ పెరిగేందుకు పరోక్ష కారకుడయ్యాడు. 

ఫలితం ... 

ఒకరికి కీర్తి !
మరొకరికి అపకీర్తి !! 

27 మంది దుర్మరణం !!!

***

చంద్రబాబు నాయుడు పక్కనే VIP ఘాట్ ప్రత్యేకంగా వున్నా కూడా అక్కడికి వెళ్ళలేదు. 
గంటకు కొన్ని వేల మంది ప్రజలు ఉపయోగించుకోవాల్సిన పుష్కర ఘాట్‌ని తన సొంతానికి బ్లాక్ చేయించాడు.  
తన పూజ అయ్యేంత వరకూ లక్షల జనాన్ని బారికేడ్‌లతో బంధించాడు. 
మూడున్నర గంటల పాటు పూజా పునస్కారాలలో మునిగితేలి, అమూల్యమైన ప్రజా-గంటలను వృధా చేశాడు. 

దాని పరిణామమే తొక్కిసలాట, 27 మంది మరణం.  

ఆ 27 మందిది మరణం కాదు హత్య. 

దానికి బాధ్యుడు, ప్రధమ ముద్దాయి చంద్రబాబు నాయుడు మాత్రమే. 


6 comments:

  1. అదంతా కాదులెండి. తెలంగాణలో పుష్కరాలకి నీళ్లూ లేవు, జనమూ లేరు. రాజమండ్రిలో అవే కాస్త అతి అయ్యాయి. ఒక విషాదంలో ప్రాంతీయ జబ్బలు అనవసరం. అలా చేస్తే మనకీ, రాజకీయ నాయకులకీ తేడా ఏముంటుంది?

    ReplyDelete
    Replies
    1. @Marripoodi Mahojas

      ఇక్కడ జబ్బలు చరచడం ఏదీ లేదండీ. ఫోటోల్లోనే స్పస్టంగా కనిపిస్టుంటే...

      మంది ఎక్కువా తక్కువా అన్నది ముఖ్యం కాదు, నాయకుడు ఎలా జనంతో మమేకమయ్యాడన్నదే ముఖ్యం. ప్రాంతీయ పొరలతో మీరు అది గుర్తించడం నిరాకరిస్తే చెప్పగలిగిందేం లేదు!

      ఒక నాయకుడు జనంతో పాటు వెళ్ళి సాధారణంగా పూజ ముగించుకుని వచ్చాడు.

      ఇంకో నాయకుడు VIP ఘాట్ ప్రత్యేకంగా వున్నా కూడా అక్కడికి వెళ్ళకుండా, గంటకు కొన్ని వేల మంది చొప్పున ఉపయోగించుకోవాల్సిన ఘాట్‌ని తన సొంతానికి వాడుకుంటూ, లక్షల జనాన్ని బారికేడ్‌లతో బంధించి, మూడున్నర గంటల పాటు పూజా పునస్కారాలలో మునిగితేలి, అమూల్యమైన ప్రజా-గంటలను వృధా చేయడం వాస్తవం కాదా? దాని పరిణామమే తొక్కిసలాట, 27 మంది మరణం కాదా? దానికి బాధ్యుడు చంద్రబాబు కాదా?

      Delete
  2. Godavari is long in Telangana compared to in Andhra.

    ReplyDelete
  3. బాబు చేసింది తప్పే.

    ReplyDelete
  4. రాజమండ్రిలో జరిగిన అసలు కథ ఇది !
    లేటెస్ట్ అప్‌డేట్స్‌Jul 15, 2015
    ఆంద్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రచార పిచ్చి గురించి ..ఆయన వీరుడు ..శూరుడు అని ఎత్తుకుని మోసే ఆయన అనుకూల మీడియా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రాష్ట్రంలో అడ్డగోలుగా అడగకున్న ప్రచారం చేసి పెట్టే మీడియా ఉంది. కానీ బాబు జాతీయ నాయకుడు ..ఆయనది జాతీయ పార్టీ అలాంటప్పుడు ఆయన ఏది చేసినా జాతీయ స్థాయిలో ప్రచారం కావాలి కదా. అందుకే బాబు తన సలహాదారుల సూచనల మేరకు జాతీయ మీడియాతో ఏకంగా ఓ ఒప్పందమే కుదుర్చుకున్నాడట. ఈ మేరకు ఓ జాతీయ ఛానల్ రాజమండ్రిలో చంద్రబాబు పుష్కరస్నానం చేసి పుష్కరాలు ప్రారంభించే దృశ్యాలను ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చిందట. ఆ మీడియాతో మరికొంతమందికి ఏకంగా ప్రభుత్వమే రాజమండ్రిలో దాదాపు 50 గదులు బుక్ చేసి ఇచ్చారట.
    ఇక చివరినిమిషంలో చంద్రబాబు నాయుడు పుష్కర స్నానానికి వచ్చే సమయంలో వీవీఐపీ ఘాట్ లో మనుషులు ఉండరని, అక్కడ ఎత్తు లేనందు వల్ల దృశ్యాలు చిత్రీకరించినా అంత మంచిగా రావనడంతో చంద్రబాబు ఒక్కసారి రూటు మార్చి సామాన్యులుండే ఘాట్ కు వచ్చాడట. దీనిని జిల్లా ఎస్పీతో పాటు ఆయన భద్రతా సిబ్బంది, అధికారులు వద్దని వారించినా ఆయన ఒప్పుకోలేదట. అంతే కాదు దృశ్యాలలో ఎక్కువమంది ప్రజలు కనిపించేందుకు వీలుగా ఎక్కువ మంది జనాన్ని అక్కడ పోగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాడట చంద్రబాబు.
    భారీ భద్రత మధ్య ఉండే చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా అక్కడ ముందే దానికి సంబంధించి అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు. అయితే చంద్రబాబు పుష్కరఘాట్ ఒకటి చెప్పి ..ఒక చోటకు పోవడానికి వారు ఒప్పుకోలేదట. ఇప్పుడు నెపం ఎవరిమీదనో ఒకరి మీద నెట్టి చర్యలు తీసుకుందామని చంద్రబాబు అనుకున్నా తీరా ఇంటలిజెన్స్ రిపోర్టు తెప్పించుకుని చూస్తే అందులో తన తప్పిదాలె కనిపిస్తుండడంతో ఏం చేయాలో పాలు పోక కిక్కురుమనడం లేదట. బాబు పబ్లిసిటీ పిచ్చికి ఇంతమంది అమాయకులు బలయ్యారన్న మాట.

    ReplyDelete
  5. nice blog.http://trendingandhra.com/latest-news-on-kcr/..
    trendingandhra

    ReplyDelete