Wednesday, October 19, 2011

సమైక్యవాదం ద్వంద్వప్రవృత్తి


  1. ఏ లెక్కలైనా తీయండి. సీమాంధ్ర కంటే తెలంగాణాయే అభివృద్ధి చెందిందని రుజువు చేస్తాం.
  2. మీ తెలంగాణా నాయకులు చేతగానివారు, దద్దమ్మలు, పనికిరాని వారు. మా నాయకులు సమర్థులు. ఒకవేళ వారు పొరపాట్లు చేసినా మేం కాలరుచ్చుకుని అడుగుతాం. మీరు అలా చేయరు. మరి మీ ప్రాంతపు అభివృద్ధి వెనుక పడితే అది మా తప్పా?

అవును, లెక్కలు వేసేదీ వారే, లెక్కలు తీసేదీ వారే. అవసరమైన వాటిని మాయం చేసి లేవనేదీ వారే. అటువంటప్పుడు అవి వారికి గాక ఇంకెవరికి అనుకూలంగా వుంటాయి? తెలంగాణా అభివృద్ధి చెందినట్టైతే మరి తెలంగాణా (వి)నాయకులు దద్దమ్మలెలాగయ్యారో? అంతగా కాలరుచ్చుకుని అడిగే వారైతే మరి వారి ప్రాంతాలు  ఎందుకు వెనకబడ్డాయో? దీన్ని బట్టే తెలియడం లేదూ వారు చెప్పే కధల్లో పస యెంతో?

  1. తెలంగాణాలో ఏదో కొద్దిమంది రాజకీయ నిరుద్యోగులు తప్ప తెలంగాణాను ఎవ్వరూ కోరుకోవడం లేదు.
  2. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర అంతటా తీవ్రతరం చేస్తాం.

సమైక్యవాదుల చెవులకు మొత్తం తెలంగాణా అరిచి గగ్గోలు పెట్టినా వినపడదు మరి! వారి మాటే నిజం అయితే మరి సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్రం మొత్తం జరగాలి కదా? మరి రాష్ట్రం మొత్తం అంటే తెలంగాణాలో కూడా జరగాలి కదా?

సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్రం మొత్తంగా జరక్కపోయినా ఫరవాలేదన్న మాట! ఒక్క సీమాంధ్ర వాసులుకలిసుండాలని చెప్తే కలిసి ఉండాలన్న మాట! మరి తెలంగాణా ప్రజలు కూడా సమైక్యాంధ్ర కోరుతున్నట్టైతే ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా మంత్రం ఎందుకు జపిస్తున్నాయో? మరి సమైక్యవాడులామని చెప్పుకునే వాళ్ళు వారి ఉద్యమాలని కాకపోయినా కనీసం మిథ్యమాలని కూడా ఇక్కడ జరపలేక పోతున్నారెందుకో?


16 comments:

  1. ఈ రోజు మా పట్టణంలో సీమాంధ్ర నాయకులు పిలుపునిచ్చిన బంద్ విఫలమైంది. మా అమ్మగారు ఇప్పుడు బ్యాంక్‌లోనే పని చేస్తున్నారు. కానీ మీరు ఒక పక్కా సమైక్యవాద చానెల్ ఆన్ చేసి చూడండి. శ్రీకాకుళంలో బంద్ సంపూర్ణం అనే వార్తలొస్తాయి.

    ReplyDelete
  2. అప్పటికి మొన్న సోమవారం తెలంగాణా బంద్ సఫలమైనట్లు. నిన్న పేపర్లో చూసాను. కోఠీలో బిజీగా ఉన్న రోడ్డు. ఈ రెండు ఉద్యమాలు పనికిరానివి. రాజకీయనాయకుల సృష్ఠి. ప్రజలకోసం పనిచెయ్యకుండా స్వలాభం కోసం, ప్రజలను మభ్య పెడుతూ సాగుతున్నాయి. ప్రజౌ ఈ రెండు ఉద్యమాలు తిరస్కరించినప్పుడె మరల మన తెలుగు ప్రాంతం సాధారణ స్థితి లోకి వస్తుంది.

    ReplyDelete
  3. edokati levayya. asalu rashtrame adhogati palu. andulo malli telangana emundi seema emundi kosta emundi kalinga emundi. edi abhivruddhi chendindi. ekkada evadi jeevitalu bagunnayi ganaka.

    - krishna

    ReplyDelete
  4. తెలంగాణా లో బందు జరిగినా అంతే పెవీణూ...బ్యాంకులు , సినెమా హాల్స్ , మందు దుకాణాలు మూతపడవు...ప్రజలకి ఇబ్బంది కల్గించే ఏ బందూ పూర్తిగా సఫలం కాదు...

    ReplyDelete
  5. @Anonymous Oct 19, 2011 04:47 PM

    చాలా గొప్ప లాజిక్ కనిపెట్టారు. ఈ మాత్రం మన కాంగ్రెస్ బుర్రలకి ఎందుకు తట్టలేదో!

    మిమ్మల్ని కామెంటు పెట్టాడం, పెట్టకపోవడం రెండూ చేయొద్దంటే ఏం చేస్తారు?

    ReplyDelete
  6. Great news for Tadepalli & the rest of the Peddapuram batch.

    What a heroic struggle by the andhera jokers LOL!

    అధిక ధరలకు మద్యం అమ్ముతున్నరంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసాడు.దీనిని విచారించిన హై కోర్ట్ ప్రతీ విక్రయానికి రసీదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఇదే గనుక జరిగితే మద్యం సిండికేట్ లు కృత్రిమంగా పెంచిన ధరలు దిగి వస్తాయి.ఈ రసీదులు ద్వారా వినియోగదారుడు సదరు షాప్ మీద కేసు పెట్టడానికి అవకాశం వుంటుంది.

    ReplyDelete
  7. తెలంగాణాలో ఈ రోజు జరిగిన "సకల సారా వ్యాపారుల"సమ్మె+బందు లో తెలంగాణా లో కొన్ని చోట్ల సారా కొట్లు తెరిచారని ప్రజలు చాలా శాంతియుతంగా మందు సీసాలని పగలగొట్టి,షట్టర్లు మూసివేసిన దృశ్యాలు టివీలలో చూసామే. హౌ !!!

    ReplyDelete
  8. సమైక్యవాదులకి దమ్ముంటే హైదరాబాద్‌లో కాకుండా వరంగల్‌లో ఒక్కడి చేతైనా జై సమైక్యాంధ్ర అనిపించాలి. ఆ దమ్ము ఒక్క సమైక్యవాదికైనా ఉండదు. తెలంగాణా ఏర్పాటుకి ఏకాభిప్రాయం కావాలట, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏకాభిప్రాయం అవసరం లేదట. ఇది సమైక్యవాదుల ద్వంద్వ నీతి.

    ReplyDelete
  9. @praveen
    ఒక పక్క తెలంగాణా కావలంతావ్, ఇంకో పక్క మా పట్టణం అని ఆంధ్ర లో ఉన్న ఊరు గురుంచి మాట్లాడతావ్.. చంద్ర బాబు లాగా ఏమిటీ confusion.. ఎందుకైనా మంచిదని అక్కడో కాలు ఇక్కడో కాలు వేసి ఉంచావా?

    ReplyDelete
  10. తెలంగాణా, ఆంధ్రా విడిపోతేనే రెండింటికీ లాభమని ప్రవీణ్ గారి అభిప్రాయం.

    ReplyDelete
  11. @praveensarma

    ఒక్కడు ఇద్దరు ఏమి ఖర్మండి? నిన్నటికి నిన్న నిజామబాదు జిల్లా బాన్సువాడ లో 35000 మంది ముద్ర పూర్వకంగా జై సమైక్యాంధ్ర అని నినదిస్తే ఢిల్లీ వరకు చెవులున్న అందరికి వినపడింది. మీకు అ మాట వరంగల్లు లో వినాలని ఉంటే అక్కడ ఉప ఎన్నికలు రానియ్యండి. ఇవేమీ జరిగేవి కాదు అంటారా.. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి వరంగల్ నుండే మీరు కోరుకునే నినాదం మీకు చెవులార వినిపిస్తా... (ఇది రాసింది మిమ్మల్ని రేచకోట్టాలని కాదు.. రెచ్చకొట్టి సాదించేది ఏమి లేదని గుర్తుచెయ్యడానికి )

    ReplyDelete
  12. @Anonymous Oct 20, 2011 02:33 PM

    పొరపాటు వాదన. అక్కడెవరూ జై సమైక్యాంధ్ర అని నినదించలేదు. ఒకరు "జై తెలంగాణా" అంటే ఇంకొకరు "తెలంగాణా తెచ్చేదీ ఇచ్చేదీ మేమే" అని నినదించారు. అలాగే వుంటాయి సమైక్యాంధ్ర వాదుల ద్వంద్వ ప్రమాణాలు. ఎలక్షన్ ముందు ఇదే సమైక్యవాదులను (లగడపాటితో సహా) ఎవరైనా వచ్చి "సమైక్యాంధ్ర" నినాదంతో పోటీ చేయమని సవాలు చేస్తే ఒక్కడూ రాలేదు మరి!

    ReplyDelete
  13. అక్కడ తే ర స కి వోటు వెయ్యని వాళ్ళని సేటిలర్లు అని, సమైక్యవాదులని, తెలంగాణా ద్రోహులు అని అన్నది నేను కాదు మహాప్రభో! అక్కడ గెలిచీన అభ్యర్ధి తో సహా మిగితా వారంతా అలాగే అన్నారు అని, వాళ్ళ ఇళ్ళకు వెళ్లి, వాళ్ళ వోటు హక్కుని అవహేళన చేసి , తెరిమిగోడతామని అల్లరి చేసినట్టు అన్ని ప్రచార సాధనలలోను వచ్చింది.. మీకు తెలియదా ఏ సంగతి?

    "ఎలక్షన్ ముందు ఇదే సమైక్యవాదులను (లగడపాటితో సహా) ఎవరైనా వచ్చి "సమైక్యాంధ్ర" నినాదంతో పోటీ చేయమని సవాలు చేస్తే ఒక్కడూ రాలేదు మరి!" మరి ఇదే సవాలు సమైక్యవాదుల తెలంగాణా వాళ్ళకి విసిరితే... సీమంధ్ర లో తెలంగాణా స్లోగన్ తో పోటి చేసి గెలవమని అడిగితే? అక్కడ గాని ఇక్కడ గాని ఇది జరిగే పనేనా?

    ReplyDelete
  14. @Anonymous Oct 20, 2011 03:37 PM

    >>> తెలంగాణా వాళ్ళకి విసిరితే... సీమంధ్ర లో తెలంగాణా స్లోగన్ తో పోటి చేసి గెలవమని అడిగితే?

    తెలంగాణా ప్రజలు తెలంగాణా కోరడానికి సీమాంధ్ర ప్రజల ఇష్టాయిష్టాలతో పనిలేదు. తెలంగాణా ప్రజలు కోరుకుంటే చాలు. అది ముందు తెలుసుకోండి.

    ReplyDelete
  15. బాన్స్‌వాడ నియోజక వర్గంలో లంబాడా కులానికి చెందిన వోటర్లు ఇరవై వేల మంది ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి లంబాడా కుల సంఘం నాయకుణ్ణి కొనేశాడని ఎన్నికలకి ముందే వార్తలొచ్చాయి. అలాగే ఆ నియోజక వర్గంలో ముస్లింలు పదిహేను వేల మంది ఉన్నారు. ముస్లింలు ఎలాగూ కాంగ్రెస్‌కి సపోర్టే. ఆంధ్రా సెటిలర్లు ఆ నియోజక వర్గంలో పన్నెండు వేల మంది మాత్రమే ఉన్నారు. అయినా కాంగ్రెస్ కుల రాజకీయాలు నడపడంలో బాగా అనుభవం ఉన్న పార్టీ కదా.

    ReplyDelete
  16. AnonymousOct 20, 2011 03:37 PM

    అక్కడ తే ర స కి వోటు వెయ్యని వాళ్ళని సేటిలర్లు అని, సమైక్యవాదులని, తెలంగాణా ద్రోహులు అని అన్నది నేను కాదు మహాప్రభో! అక్కడ గెలిచీన అభ్యర్ధి తో సహా మిగితా వారంతా అలాగే అన్నారు అని, వాళ్ళ ఇళ్ళకు వెళ్లి, వాళ్ళ వోటు హక్కుని అవహేళన చేసి , తెరిమిగోడతామని అల్లరి చేసినట్టు అన్ని ప్రచార సాధనలలోను వచ్చింది.. మీకు తెలియదా ఏ సంగతి?

    srikanth gaaru deeniki mee samadanam ledemi emi mata padipoyinda

    ReplyDelete