Saturday, July 23, 2011

సమైక్యత మార్కు దాడులు



- పెనగంచిప్రోలులో ఆలయం వద్ద దారుణం
- గర్భవతి కడుపుపై కాళ్లతో తన్నిన కర్కశులు
- ఒకరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్రగాయాలు
- వాహనంపై జై తెలంగాణ అని ఉండటమే నేరం

యథా నేత.. తథా ప్రజ! ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ ఓ సీమాంధ్ర నేత చేసిన ప్రకటనను.. అప్పుడే ఆచరణలో చూపుతున్నారు! గుడికి వచ్చారన్న భావన లేకుండా తెలంగాణకు చెందిన దళితులపై శివాలెత్తారు. కృష్ణా జిల్లాలోని పెనగంచిప్రోలులో ఉన్న తిరుపతమ్మ దేవాలయానికి వచ్చిన వారిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. మూడు నెలల గర్భిణీని కిందపడేసి కడుపుపై కాళ్లతో తన్నారు! వారు ప్రయాణించిన వాహనంపై ‘జై తెలంగాణ’ అని ఉండటం చూసి.. మీకు తెలంగాణ కావాల్రా.. అంటూ తరిమితరిమి కర్రలు రాడ్లతో తలలు పగులగొట్టారు. ఈ ఘటనలో గర్భిణీ సహా పలువురు తెలంగాణ దళితులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో దళితుడికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్న నేతలు.. ఈ దళితులపై దాడికి ఏం సమాధానం చెబుతారు? వైషమ్యాలు పెరిగేంత స్థితికి పరిస్థితిని నెట్టేస్తూ ఏసీ గదుల్లో చర్చలు జరుపుతున్న ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారు?

మీకు తెలంగాణ కావాల్రా...? ఇక్కడికి వచ్చి మా మాటలు వినరారా...? మేమేంటో మీకు తెలియదురా...! అంటూ ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ... పరుగులు తీస్తున్నా వదలకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మూడు నెలల గర్భవతిని కిందపడేసి తన్నారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయిద్దామని కృష్ణా జిల్లా పెనగంచిపోలులోని తిరుపతమ్మ దేవాలయానికి వెళ్లిన తెలంగాణ ప్రాంత దళితులపై జరిగిన దాడి ఇది! వారు ప్రయాణించిన డీసీఎం వాహనానికి ‘జై తెలంగాణ’ అని ఉండటమే నేరమైంది. మానవత్వాన్ని మరచిన ఆంధ్రోళ్లు.. వారి తలలు పగులగొట్టారు. ఢిల్లీలో దళితుడికి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెడతున్న సీమాంధ్ర పాలకులు దీనికి ఏం సమాధానం చెబుతారో! తమపై జరిగిన దాడి గురించి బాధిత దళితులు టీ న్యూస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం దళిత కుటుంబానికి చెందిన గాదె సతీష్ కూతురు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు, మొక్కు సమర్పించేందుకు పెనగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవాలయానికి బంధుమిత్రులు దాదాపు 40 మంది శుక్రవారం వెళ్లారు. ఆలయం వద్ద చిన్నారికి తలవెంట్రుకలు తీసిన తరువాత భోజనాలు చేసేందుకు సత్రాల వద్ద పట్టాలు పర్చుతున్నారు. ఈ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఆ పట్టా తమదేనంటూ దళితులతో గొడవకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వారి లారీపై ‘జై తెలంగాణ’ అని ఉండటాన్ని గమనించి.. ‘తెలంగాణ నుంచివచ్చి.. మా దగ్గర అధిపత్యం చేస్తార్రా.. కొడుకుల్లారా’ అంటూ కర్రలు, రాళ్ళతో మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో భయపడిన దళితకుటుంబం.. పరుగులు తీసినా.. వెంటపడి మరీ ‘మీకు తెలంగాణ కావాల్రా..’ అంటూ చితకబాదారు.

పెన్‌పాహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నెమ్మాది వెంకన్న ఆయన తల్లి వెంకటమ్మ, మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన నల్లా నరేశ్, నల్లా అరుణలు గాయపడ్డారు. మూడు నెలల గర్భవతి అయిన అరుణను కింద పడేసి కడుపుపై తన్నడంతో తీవ్ర రక్తవూసావం అయ్యింది. వీరిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పవూతికి తరలించారు. ఆస్పత్రిలో ఉన్న బాధితులతో ‘టీన్యూస్’ ప్రతినిధి మాట్లాడారు. సతీశ్ తల్లి పార్వతమ్మ మాట్లాడుతూ... ‘‘అయ్యా నా మనవడు వెంకన్నను, నరేశ్‌ను, అతని పెళ్లాం అరుణను గర్భవతి అని కూడా చూడకుండా కడుపులో తన్నారయ్యా. ఈ ఆంధ్రోళ్లు నా బిడ్డల తలలు పగలగొట్టారయ్యా. అరుణ గర్భంలోని పిండానికి ఏమయిందోనయ్యా’’అంటూ కన్నీరుమున్నీరయ్యారు. వీరి వద్ద ఉన్న 20 వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, బంగారు గొలుసును దాడికి పాల్పడిన ఆంధ్రోళ్లు లాక్కున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసినట్లు పెనగంచిప్రోలు ఎస్‌ఐ నాగేంద్రకుమార్ ‘టీన్యూస్ ప్రతినిధి’కి తెలిపారు. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన ఎస్.నాగరాజు, బి.శ్రీను, కుమ్మరి సత్యనారాయణ, మేడ సాంబయ్యలను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు.నట్లుగా ఆయన తెలిపారు.

Curtesy: Namsthe Telangaana

యుద్ధంలో చనిపోయిన సైనికుడి శవాన్ని సైతం బంధువులకు అప్పగించడం నీతి. అలాంటిది శవాన్ని బంధువులకు కూడా అందకుండా స్మశానానికి పంపించమని ఉత్తరం రాసిన చెత్త వెధవను చెంప మీద కొట్టడం దళితుల మీద అత్యాచారంగా చిత్రించి గుండెలు బాదుకుంటున్న మంద కృష్ణ, గద్దర్, కొందరు సీమాంధ్ర సమైక్యవాదులు దీన్ని ఏమటారో మరి! 

11 comments:

  1. నాకు తెలిసి ఆంధ్రా ఏరియాలో ఏరియా ప్రాతిపదికన ఈనాటికీ ఎవరినీ ద్వేషించరు. నేను చెప్పేది మీరు నమ్మాల్సిన పనిలేదు. అక్కడికి తెలంగాణవాదం వినిపించడం కోసం వెళ్ళిన మేధావుల్ని అడగండి. వాళ్ళని ఆంధ్రావాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో ! ఈ రిపోర్టు వాస్తవం కాదు. మీరు కూదా నమ్మకండి. ఇందులో చాలా మసాలా ఉంది.

    నమస్తే తెలంగాణ పత్రికలోంచి తీసుకోబడ్డ వార్త ఇది. దీన్ని ఇతర పత్రికలు రిపోర్టు చేయలేదు. చేసినవి కూడా ఇలా ప్రాంతాల ప్రాతిపదికన చేయలేదు. నమస్తే తెలంగాణ కి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి ? అది ప్రాంత్ాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా, అందుకోసమే కంకణం కట్టుకుని పనిచేస్తున్న పచ్చి బయాస్డ్ ప్రచురణ. వాళ్ళు వ్యక్తిగత గొడవలన్నీ ప్రాంతాల మధ్య గొడవలుగా మార్చి రాస్తున్నారు.

    ReplyDelete
  2. >>>నాకు తెలిసి ఆంధ్రా ఏరియాలో ఏరియా ప్రాతిపదికన ఈనాటికీ ఎవరినీ ద్వేషించరు

    మీరు మీ email id ని గనుక ఇస్తే మీ కామెంటు కన్నా మూడు నిమిషాల ముందు నా spam లో చేరిన ఒక ఆంధ్రుని కామెంటు పంపించ గలను. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలా ద్వేషిస్తున్నరో.

    >>>దీన్ని ఇతర పత్రికలు రిపోర్టు చేయలేదు.

    అది మామూలేగా? మీకు అంత అనుమానంగా వుంటే ఆవూరు వెళ్ళి చూడండి. కేసు కూడా బుక్కైంది. అక్కడ కేసు పెట్టింది ఆంధ్రా పోలీసులేగా? వాళ్ళను కూడా నమ్మరా? కనీసం దెబ్బలు తిన్న మనుషులను చూస్తే నమ్ముతారా?

    >>>వాళ్ళు వ్యక్తిగత గొడవలన్నీ ప్రాంతాల మధ్య గొడవలుగా మార్చి రాస్తున్నారు.

    అని మీకు తెలుసా?

    ReplyDelete
  3. నేను ప్రత్యెక తెలంగాణా ని సమర్థిస్తున్నాను.....కాని నాకు ఈ నమస్తే తెలంగాణా మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఒక రెండు వారాల క్రితం...ఇలాంటి వార్తే వచ్చింది...విజయవాడ స్టేషన్ లో రాత్రి ఒక యువతిని ...హైదరాబాద్ నుంచి వచ్చినందుకు అక్కడి వాళ్ళంతా కలిసి ...జై సమైఖ్య ఆంధ్రా అంటూ సామూహిక అత్యాచారం జరిపారని ....రెండు వర్గాల మధ్యా ఇంకా గొడవలు పెంచడానికే ఇలాంటివి వస్తున్నాయని నా అనుమానం ...

    ReplyDelete
  4. sanju గారు

    ఆ వార్త నిజమే, అయితే మీరన్నట్టు విజయవాడ కాదు, వైజాగ్. మీరు counter check చేసుకోవాలంటే ఇక్కడ చూడండి.

    http://www.deccanherald.com/content/171115/migrant-woman-gang-raped-vizag.html

    ReplyDelete
  5. where is the regional factor in that news? it is namasthe telangana masala to add regional color.

    ReplyDelete
  6. pai link lo naakaite rape chestunnollu jai samaikyandhra annarani kanapalla....sreekanth lantollake avi kanapadatay vinapadatay anukuntanu.....konni rojulaki Telangana lo vaana padda/padaka poina seemandhrula kutre ane tattunnaru....
    Johaar dobbi poina mee burralaki...
    naa lal salam

    ReplyDelete
  7. oho! seemandhra pettupadidarlu karnataka ki chendina paperni kooda seemandhra pakshapaati gaa maarchesaare! Ekkada kcr&co pvt ltd patrika allina kathalu meerichhina link lo kanipinchavemiti? ituvanti dagulbaaji patrikalu mana desham lo J&K lo unnayi telusu. Shame on those who are trying to divide people with venomous propaganda. The title itself says it all.

    ReplyDelete
  8. thamaru spam lo nundi choopinchanakkharledu sir... vedhavalu anni chotla unnaaru, vaallani choopinchi mi andhra vallu alam ma thelangana vaallu ani cheppukovadam antha burrathakkuva pani inkokati ledu!!

    Sharma msk

    ReplyDelete
  9. @Chaitanya,

    That link is given when some one is doubted about the authentication of news itself.

    The victims themselves stated before the television cameras regarding samaikyandhra element. If you really want to know, you can very much meet them and get yourself ensured.

    >>>people with venomous propaganda

    Everyone knows how you people spit venom in your blog and site on the name of Samaikyandhra. Even seemaandhra people are vexed up the way you spit venom. No wonder poeple like you resort to the incidents like Vijag and Penuganchiprolu.

    ReplyDelete
  10. @శ్రీకాంతాచారి:
    "The victims themselves stated before the television cameras regarding samaikyandhra element. If you really want to know, you can very much meet them and get yourself ensured"

    Mr. Chaitanya (and his ilk) are not interested in facts. They are only interested in "samaikyandhra".

    ReplyDelete
  11. Asalu matter idi

    http://epaper.sakshi.com/epaperimages/2372011/2372011-SH-KRS-4/D28297516.JPG

    Mana Namaste Telanganalo matram vakrikarincharu.As usual savala mida pelalu erukone rakam.

    ReplyDelete