Thursday, August 8, 2013

అసత్యపూరిత సమై'ఖ్య' మిథ్యమాలు

 
ఈ ఉద్యమంలో మొదటి, అతి పెద్ద అబద్ధం పొట్టి శ్రీరాములు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ సమై'ఖ్యాం'ధ్ర గురించి ఆలోచించి ఉండడు. ఆయన కోరింది మద్రాసు నుండి ప్రత్యేకాంధ్ర. నిర్లజ్జగా అది విస్మరిస్తూ ఆయన ఫోటో పెట్టుకుని మిధ్యమాలు చేస్తుంటారు ఈ అబద్ధాల కోరులు.

ఒకప్పుడు అపస్మారకంలో వుంది ఆయన చస్తుంటే కూడా, పట్టించు కోలేదు, వైద్య సహాయం అందించ కుండా ఆయన చావుకు కారకులయ్యారు. ఇప్పుడు ఆయన ఆశయాలను వక్రీకరిస్తూ ఆయన ఆత్మ హననానికి కూడా పాల్పడుతున్నారు.

పైపెచ్చు ఆయన కోరుకున్న సమైక్య 'ఆంధ్ర' రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఒప్పుకోకుండా ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణా, గ్రేటర్ రాయలసీమ అనుకుంటూ కాట్లాడ కుంటారు. 
వీరి నాయకుల్లో ఎవడు మాట్లాడినా మొదటి వాక్యంతో సమై'ఖ్యాం'ధ్ర ముగిసి పొతుంది. ఆ వెంటనే హైదరాబాదుపై హక్కు సాధించు కుంటాం అనే ఆధిపత్య ధోరణి కనపడుతుంది. హైదరాబాదు వస్తే సమైక్యత అవసరం లేదన్న మాట! వారి సమై'ఖ్య'త అర్థం అదేనేమో!

అంటే అప్పటివరకూ వీరు చెప్పే తెలుగు జాతి, అన్నదమ్ములు వగైరా ఊకదంపుడు అంతా అబద్ధాలని తెలంగాణా వారికి ఎప్పటినుండో తెలుసు,కాని ఇప్పుడు ఆంధ్రా సోదరులకు కూడా అర్థమవుతున్నాయి.

సగటు ఆంద్ర పౌరుడు రాష్ట్రం విడిపోతే దగ్గరలో సొంత రాజధాని కావాలని అనుకుంటాడు. కాని ఈ సమెక్కుడు వాదులు మాత్రం రాష్త్రం విడిపోయినా, కలకాలం హైదరాబాదు రాజధానిగా కావాలను కుంటారట. అంటే రాజధాని కోసం రాష్ట్రం దాటి 200 కి మీ ప్రయాణిస్తారన్న మాట ప్రతి రోజూ!
వీరికి పక్కనున్న తెలంగాణా వారి బాధలు పట్టవు. అర్థ శతాబ్దంగా వీరు ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అని ఒక సెకను మాత్రం కూడా ఆలొచించరు. కాని రాష్ట్రం విడిపోతుంది అనగానే వీరికి బోడోలాండ్ గుర్తుకు వస్తుంది. గూర్ఖాలాండ్ గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే కలిసి పోయిన జర్మనీ గుర్తుకు వస్తుంది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాలని వాదించే వీరికి గోర్ఖాలు, బోడోలు వారి సొంత భాషలు కలిగి ఉన్నారని తెలియదా?

జర్మనీ దేశాలుగా కలిసినా, ఆ దేశంలో జర్మను భాష మాట్లాడే పదుల కొద్దీ రాష్ట్రాలున్నాయని తెలియదా? వారికి అన్నీ తెలుసు, అయినా అసత్యాలు మాట్లాడడంలో అందెవేసిన చేతులు వారు. 

ఒక వైపు రాష్ట్ర రాజధానినుండి నలభై శాతం రెవిన్యూ వస్తోంది అని వారే ఒప్పుకుంటారు.  నిజాం కాలం నుండి కూడా రాష్ట్ర రాజదానిదే ఆదాయంలో సింహభాగం.  ఆ కాలంలోనే దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. ఇప్పుడు కూడా దానిలో మార్పేమీ లేదు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కూడా హైదరాబాదు మిగులు ఆంధ్రాలో వినియోగించారు తప్ప, హైదరాబాదును వారు అభివృద్ధి చేసినదేమీ లేదు. కాని హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని బుకాయిస్తారు. 

వీరు హైదరాబాదుకు చేసిందేమీ లేదు, జలగలు రక్తం పీల్చినట్టు తెలంగాణా ఆదాయం పీల్చి సీమాంధ్ర ప్రాజెక్టులు నిర్మించుకోవడం తప్ప.  
తెలంగాణా వాదులు మొదటి నుండి నీళ్ళు, ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చారు. కాని సమైక్యవాదులు ఆ వాదనను ఏనాడూ ఒప్పుకున్నా పాపాన పోలేదు.

నీళ్ళ విషయంలో తెలంగాణా వాదులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వచ్చినప్పుడల్లా  'నీరు పల్లమెరుగు కదా? మేం పల్లంలో ఉన్నాం కదా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి వీలు కాకపొతే మేమేం చేయాలి?' అంటూ అమాయకంగా ప్రశ్నించే వారు. తెలంగాణా ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపించ గానే వీరి రాగం మారిపోయింది.

తెలంగాణా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులకు తెలంగాణా వారు అడ్డు కట్టలు వేస్తారట! ఒక్క చుక్క నీరు కూడా కిందకు దిగకుండా చేస్తారట! ఇంతకీ వీరి మాటల్లో ఏది నిజం? నిన్నటి వరకూ చెప్తున్నట్టు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టడం వీల్లేదన్న మాటలా? లేక పోతే ఆంధ్రాకు చుక్క నీరు వదలకుండా ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాలో వాడుకొనే వీలున్నదా?   

వీరు ఇన్నాళ్ళుగా అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నదే నిజం అనుకున్నా, ఏ రాష్ట్రం కూడా తనకు కేటాయించిన జలాలు మాత్రమే వినియోగించుకో గలుగు తుంది. అది నిర్ణయించే టందుకు ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో కలిసి నదుల పంపకం వుంది. మన పైవారు ఎవరూ నీటికి బిరడా బిగించు కొలేదే?

సమెక్కుడు వాదులూ, ఇలాంటి అబద్ధాల మిధ్యమాలతో మీరు ఆంధ్రా ప్రజలని నమ్మించ గలరేమో కాని, ప్రపంచాన్ని నమ్మించ లేరు. 

4 comments:

  1. అట్లా చెప్పండి కరెక్ట్ గా చెప్పేరు.

    సమైక్యం అంతా బూటకం జై తెలంగాణా

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వాడు దొంగ,
      వాడు తెలివి తక్కువ వాడు,
      వాడికి సంకృతి లేదు,
      హైదరాబాదు వచ్చేదాకా ఉద్యమం ఆపం
      జై సమై'ఖ్యాం'ద్ర

      Thanks for the comment, Jilebi garu.

      Delete
  2. "మన పైవారు ఎవరూ నీటికి బిరడా బిగించు కొలేదే?"

    Remember the Babhali drama? It turned out just around 2 TMC!

    ReplyDelete
    Replies
    1. Yes Jai, that drama was wantedly played by Yellow Babu to divert T people from clean sweep of Krishna and Godavari by SA people.

      Delete