Saturday, April 16, 2011

తెలుగుమాత

అయ్యా సమైక్యవాది గారూ,

మాకు తెలిసింది తెలంగాణామాత, భారత మాత, ధరిత్రీ మాత. ఈ మాతలు మాకు చాలు. తెలుగు వారు ప్రపంచంలో పద్నాలుక్కోట్ల మంది ఉన్నారు. ఏ దేశంలో ఉన్నవారు, ఏ రాష్ట్రంలో నివసించే వారు ఆయా మాతల్నే పూజిస్తారు. తెలుగును అభిమానిస్తారు. అంటే కానీ మాది తెలుగుమాత, ఈదేశ మాతతో మాకు సంబంధం లేదని చెప్పరు. ఇంగ్లీషుకు మాత లేదు, హిందీకి మాత లేదు, భాష పేరిట మాతను నిలబెట్టి జనాన్ని మోసం చేయడం మీకే చెల్లింది.

తెలుగు తెలుగు అంటూ భాషా దురభిమానం పెంచి, దాన్ని సామ్రాజ్యవాదంగా మార్చారు. మీ సామ్రాజ్య వాదపు కుట్రలు బట్ట బయలై ఇప్పుడు ప్రజల ముందు నగ్నంగా నిలబడున్నారు. ఇంకా మేం దేవతా వస్త్రాలు కట్టుకున్నాం చూడండీ అంటే నమ్మడానికి జనం మీ అంత తెలివి తక్కువవారు కాదు.

తమరికి తెలియదేమూ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ బీహారు కంటే దరిద్రంగా ఉంది. మీరు ఇంకా ఇక్కడ ఉంది డెవలప్పు చేయవలసిన అవసరం లేదు. తమరు ఎంత తొందరగా విడిపోతే ఇద్దరికీ అంత మంచిది. 

తెలంగాణా దాటి ఇరవై వేల కిలోమీటర్లు వెళ్ళినా, ముప్పైవేల కిలో మీటర్లు వెళ్ళినా అక్కడి ప్రభుత్వానికి లోబడి ఉద్యోగాలు చేసుకుంటారు గాని, మీలాగా తిన్నింటి వాసాలు లెక్క బెట్టరు. ఆ ఘనత మాత్రం మీకే సొంతం. 

2 comments:

  1. వీల్ల లెక్కన కెనడాకు, అమెరికాకు, బ్రిటన్‌కు ఒక్కటే తల్లి ఉండాలేమో. తెలివితక్కువ మేళాలు, పెద్ద మేధావుల్లాగా వచ్చి చెప్పడానికి బయల్దేరారు.

    ReplyDelete
  2. అమర్, thanks,

    వీళ్ళ లెక్కన AP లోని ముస్లిములు ఉర్దూ తల్లిని పూజించాలి. అలాగే మర్వాడీలు మార్వాడీ తల్లిని, మరాఠాలు మరాఠా మాతను, ఇట్లా ఏ భాష వారు ఆ భాషా మాతని పూజించాలి, ఈ ప్రాంతాన్ని కాదు. :)

    ReplyDelete