Wednesday, February 15, 2012

కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం



తెలుగు మాట్లాడే వారంతా
ఒకే రాష్ట్రంలో ఉండాలి
దీనికన్నా ముందు వారంతా
ఒకే దేశంలో వుండాలి
ప్రపంచ తెలుగు జాతి పౌరులారా
పొలోమని రాష్ట్రానికి తరలిరండి
తెలుగు జాతి గౌరవం నిలబెడదాం
తెలుగు జాతి ఒక్కటే నని చాటుదాం
మనకు ఒక్కటే దేశం
మనకు ఒక్కటే రాష్ట్రం
మనకు ఒక్కటే జిల్లా
మనకు ఒక్కటే మండలం
మనకు ఒక్కటే గ్రామం
అన్నీ ఒక్కటే వుండాలి
ఒకటికన్నా ఎక్కువగా వుంటే
మనకు అరిష్టం
ఒకటికన్నా ఎక్కువుంటే
సమగ్రతకే నష్టం
కాదని ఎవడన్నా అన్నాడో
వాణ్ణి వెలేద్దాం
వేర్పాటువాదిగా ముద్దరేద్దాం
వీలైతే తాలిబాన్ అందాం
అయినా కూడా వాణ్ణి పంపించొద్దు
వాడికి ఊళ్లోనే కోదండం వేద్దాం
కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం


9 comments:

  1. Excellent .. you wrote exactly what samaykandhra guy think.

    ReplyDelete
  2. అవును అన్న నివ్వు చెప్పింది నిజం
    మనం ఒక రాష్ట్రము గ ఉన్నదుకే మన మధ్య సమగ్రత కుదురుటలేదు
    ఒక జిల్లా నో మండలమో అయితే తెలుగు జాతి, తెలుగు తల్లి కూడా సంతోషిస్తారు.
    మన విశాంధ్ర మిత్రులకి ఈ ఐడియా ఎందుకు రాలే చెప్మా?

    ReplyDelete
    Replies
    1. తమ వాదనలో ఎంత దొల్ల వుందో వారికి తెలుసు. అందుకే విషయాన్ని అక్కడిదాకా తీసుకు రారు. దాన్ని బయట పెట్టే ప్రయత్నమే ఇది.

      Delete
  3. Mitramaaa... merokkaru chaalu Andhra Pradesh ni 36 mukkalu cheyadaaniki....

    ReplyDelete
    Replies
    1. ముప్పయ్యారు అవసరం లేదు, రెండో మూడో చాలు. మీలో వున్న లోపం అదే, మూడు ముక్కల గురించి మాట్లాడలేరు కాని ముప్పయ్యారు గురించి మాట్లాడడానికి బయలు దేరుతారు.

      Delete
    2. Anyway, thanks for commenting.

      Delete
  4. meerokkaru chaalu Andhra Pradesh ni 36 mukkalu cheyadaaniki

    ReplyDelete
  5. @raka merokkaru chaaalu telangaani inka mosam chesi dochukodaaniki. entha thinaa neeku ajeerthi rogamu ravtledha. inka pandikokkula enni rojulu maa meedha padi thintaavu mithrama.

    ReplyDelete