Friday, November 22, 2013

ధన్యవాదాలు

గుండె ఘోష రెండు లక్షల హిట్లు సాధించిన సందర్భంగా ఆదరించిన ప్రతి ఒక్కరికి తెలంగాణా ఉద్యమాభివందనలు.

చరిత్రను కూడా వదలని దుర్మార్గులు

11/22/2013 8:11:26 AM (నమస్తే తెలంగాణా)
తెలంగాణ మ్యూజియంలో దొంగలు పడ్డారు

- బ్రిటీషోళ్లను తలదన్నుతున్న సీమాంధ్ర దోపిడీ
- సంపదనేకాదు.. చరిత్ర అవశేషాలను దోచేశారు
- తెలంగాణలో దొరికిన అపురూప శిల్ప ప్రతిమలు
- అమరావతి మ్యూజియంలో కనువిందు
- విజయవాడలో తేలిన ఖమ్మం జిల్లా బుద్ధ విగ్రహాలు
- తరలిపోయిన యుద్ధసామక్షిగికి అంతేలేదు
- నిజాం వేయించిన అజంతా చిత్రాలూ అక్కడే
- సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న బౌద్ధుల ‘కాలచక్ర’


తెలంగాణ మ్యూజియంలో దొంగలు పడ్డారు! ఒకనాడీ దేశాన్ని పాలించిన బ్రిటీషోళ్లు మన దగ్గర నుంచి కోహినూరు వజ్రం, నెమలి సింహాసనం సహా అనేకానేక చారిత్రక విశిష్టతలు కలిగిన సంపదను దోచుకుపోయి.. తమ అలమరాల్లో భద్రం చేసుకున్నట్లు! సరిగ్గా అదే పద్ధతి! కాకపోతే ఇప్పుడు దొంగలు మారారు! తెలంగాణలో మట్టి నుంచి తవ్వి తీసిన అపురూపమైన.. అచ్చెరువొందించే అనేకానేక శిల్ప ప్రతిమలను.. భారీ ఫిరంగులను.. కత్తులు, కటార్లు మొదలైన యుద్ధ సామాగ్రిని.. పురాతన కాలం నాటి అవశేషాలను.. గుర్తులను.. గమ్మత్తులను గుట్టుగా ఏం ఖర్మ.. బాహాటంగా తరలించుకుపోయారు! ఇప్పుడవన్నీ సీమాంధ్రలోని మ్యూజియాల్లో చేరి.. ఆయా ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి! వాటి అసలు హక్కుదారైన తెలంగాణ మాత్రం ఖాళీ మ్యూజియాలతో సరిపెట్టుకుంటున్నది! ఇదేదో ఇప్పుడు కొత్తగా జరిగిన.. జరుగుతున్న దోపిడీ కాదు! ఏకంగా ఆరు దశాబ్దాలుగా తెలంగాణ చరిత్ర.. వలసపాలకుల దోపిడీకి గురవుతున్నది!

AP-Arca

హైదరాబాద్, ఖమ్మం, నవంబర్ 21 (టీ మీడియా) :పిడికెడు మట్టిని పెకలిస్తే..చరిత్ర పరిమళం వెదజల్లే నేల తెలంగాణ! భూమిని తవ్వితే ప్రతి పొరకూ ఒక చారిత్రక ప్రాధాన్యాన్ని చాటి చెప్పే గడ్డ! ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన ఎన్నో ఐతిహాసిక అవశేషాలను సీమాంధ్ర పాలకులు నిస్సిగ్గుగా తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. చరిత్ర, మ్యూజియం, పురావస్తుశాఖలకు బాధ్యత వహించిన మంత్రుల్లో ఆనాటి భాట్టం శ్రీరామమూర్తి నుంచి ప్రస్తుత వట్టి వసంతకుమార్ వరకు, ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నీలం సంజీవరెడ్డి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డివరకు పురావస్తుశాఖను సీమాంధ్ర ప్రయోజనాలకోసం ఉపయోగించుకున్నారన్న యథార్థ సత్యాలను ఆర్కియాలజీ శాఖ రూపొందించిన నివేదికలు ఘోషిస్తున్నాయి.

నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం వంటి తెలంగాణ జిల్లాలలో లభించిన శిల్పాలు, యుద్ధసామాగ్రి, మర ఫిరంగులు, కత్తులు, బల్లేలు, నిజాం కాలం నాటి యుద్ధసామాగ్రి, నాటి తాళపత్ర గ్రంథాలు, కాకతీయుల శిల్ప కళావైభవానికి చిహ్నమై నిలిచిన శిల్ప కళాతోరణాలు, సాలభంజికలు, అపురూపమైన శిల్పప్రతిమలు, పంచలోహ విగ్రహాలు చాలా వరకూ ఇప్పుడు ఈ ప్రాంతంలో లేవు.

nature 

బ్రిటిష్ పాలకులు లండన్ మ్యూజియంలో అమరావతి బ్లాక్ ఏర్పాటు చేసుకున్నట్లు, గుంటూరు జిల్లా అమరావతిలో కాలచక్ర పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజియంలో కొలువుదీరాయి. 2006లో టిబెటన్ల మతపరమైన క్రతువు ‘కాలచక్ర’ను 2006 జనవరిలో గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన సమయంలో తెలంగాణ చారిత్రక సంపద దోపిడీ మరింత ఊపందుకుంది. టిబెటన్ల మతగురువైన దలైలామాను సంతృప్తిపర్చేందుకు కాలచక్ర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అమరావతిలోనే రూ.30 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో తెలంగాణ నుంచి అనేక బుద్ధ విగ్రహాలను, బౌద్ధ ప్రాంతాల్లో తవ్వితీసిన అవశేషాలను పెద్దమొత్తంలో అమరావతి తరలించేశారు. ప్రధానంగా వాటితో ఏర్పాటు చేసినదే కాలచక్ర మ్యూజియమని తెలంగాణ చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకోసం నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియం, పానగల్లు, మహబూబ్‌నగర్, కరీంనగర్ మ్యూజియంల నుంచి బుద్ధ విగ్రహాలను, బుద్ధుడి భౌతిక అవశేషాలను అమరావతి తరలించారు. దక్కన్ ఆర్కియాలజీ ఎండ్ కల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ రచయితల వేదిక, ఇన్‌టాక్ వంటి సంస్థలు తెలంగాణ చరిత్రను వెంటనే హైదరాబాద్ స్టేట్ మ్యూజియంకు తీసుకురావాలని దశాబ్దాలుగా విజ్ఞాపనలు చేస్తున్నప్పటికీ, ఉద్యమిస్తున్నప్పటికీ సర్కారు పట్టించుకున్న దాఖలాలు లేనేలేవు.

తెలంగాణ భూగర్భంలో అద్భుత చరిత్ర అవశేషలు
తెలంగాణలో 1932 నుంచి 1942 వరకు, 1961 నుంచి 1974 వరకు, 1981 నుంచి 1992 వరకు పురావస్తు తవ్వకాలు జరిగాయి. వీటిలో మహోన్నతమైన, అరుదైన, అద్భుతమైన చరిత్ర అవశేషాలు లభించాయి. ప్రధానంగా నల్లగొండ జిల్లా వర్ధమానుకోటలో 1941లో జరిపిన తవ్వకాలలో క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన పాలనా కాలంనాటి ఐదు అడుగుల బుద్ధ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని చూసి 1942లో శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్ చరిత్రకారులు మహదానందాన్ని, సంభ్రమాశ్చర్యాన్ని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నాళ్లు ఈ అపురూప విగ్రహాన్ని స్టేట్ మ్యూజియంలో భద్రపరిచారు. కానీ.. ఆ తర్వాత దానిని గుంటూరు జిల్లాలో నిర్మించిన నందికొండ మ్యూజియానికి మార్చేశారు.

stone1

చరిత్ర పుట్ట.. వర్థమానుకోట వర్ధమానుకోటలో ఇంకా తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉన్నదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. శాతవాహనుల కాలంలో వర్థమానుకోట అద్భుతమైన వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లినదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ తవ్విన కొద్దీ చరిత్ర లభిస్తుందని చెబుతున్నారు. చిత్రమేమిటంటే ఇప్పటివరకు మళ్లీ ఇక్కడ తవ్వకాలు జరిపిన దాఖలాలు లేవు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలను క్రీ.శ. 1వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకు రెండు వేల సంవత్సరాల వరకు ఏలిన శాతవాహనులు, ఇక్షాకులు, విష్ణుకుండినులు, బృహత్‌పలాయనులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు పరిపాలించిన కాలాల నాటి చరిత్ర ప్రాముఖ్యాన్ని తెలియచేసే విశేషాలన్నీ సీమాంధ్ర మ్యూజియాలకు ఎత్తుకెళ్లారు.

నిజాం వేయించిన చిత్రాలూ దక్కలేదు
నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు సయ్యద్ అహ్మద్, జలాలుద్దీన్ అనే ఇద్దరు ప్రపంచ ప్రసిద్ధ చిత్రలేఖన నిపుణులు అజంతా గుహలకు వెళ్లి, ఆ గుహల్లోని చారిత్రక కుడ్య చిత్రాలకు నమూనాలు అంతే సొగసుతో, వాస్తవికతతో చిత్రించారు. వాటిని నిజాం నవాబుకు అందజేశారు. అప్పట్లో అజంతాకు వెళ్లడానికి దారులు లేకపోవడంతో నిజాం అక్కడి వరకు రోడ్డు కూడా వేయించాడు. ఈ చిత్ర లేఖన నిపుణులు అహర్నిశలు శ్రమించి అజంతా గుహలలోని పెయింటింగ్స్‌తో పోటీపడగల.. కోట్ల రూపాయలతోనూ వెల కట్టలేని 150 నమూనా చిత్రాలను రూపొందించారు. బుద్ధుడి జాతక కథలకు, బుద్ధుడి జన్మవృత్తాంతాలకు సంబంధించిన ఈ చిత్రాలన్నింటినీ సీమాంధ్ర ప్రాంతంలోని అమరావతి, విశాఖ, గుంటూరు, విజయవాడల్లోని మ్యూజియాలకు తరలించారు. స్టేట్ మ్యూజియంకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాగరాగిణి పెయింటింగ్‌ను తరలించుకుపోయారు. హిందుస్థానీ రాగాలకు చిత్రమాలికలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్తరువులు ప్రపంచ చిత్రలేఖన సంపదలోనే అపురూపమైనవని కాపురాజయ్య వంటి మహనీయులు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.

stone2

సాలభంజికల అపహరణ
1981 నుండి 1992 వరకు పాలకొండ (వరంగల్), ఫణిగిరి (నల్లగొండ), ధూళికట్ట (కరీంనగర్), కీసరగుట్ట (రంగారెడ్డి), కోటిలింగాల (కరీంనగర్), నేలకొండపల్లి (ఖమ్మం), మహబూబాబాద్ (వరంగల్), బూసరెడ్డిపల్లి, రేకులపాడు (ఆదిలాబాద్)తోపాటు.. జాకారం, రామానుజపురం, గణపవరం త్రికూట దేవాలయాలు, కటాక్షపురం ఆలయాలు, బస్తాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండపర్తి, బైరాన్‌పల్లి, అయినవోలు (మల్లికార్జున దేవాలయం) తదితర వరంగల్ జిల్లాల దేవాలయాలలో, పానగల్లు, రామన్నగూడెం, పిల్లలమర్రి నల్లగొండ దేవాలయాల సమీపంలో లభించిన అపురూపమైన చరిత్ర సంపదను, వరంగల్‌కోటలో, రామప్ప దేవాలయ సమీపంలో లభించిన సాలభంజికలను, శివుడి, కేశవుడు, సూర్యుడు కలిసి ఉండే గొప్ప దేవప్రతిమలను విజయవాడ మ్యూజియంకు ఎత్తుకెళ్లారు. రామప్ప దేవాలయంలో లభించిన నీటిలో తేలియాడే ఇటుకలను కూడా పట్టుకెళ్లారు. వీటితో పాటు ఆయా తవ్వకాలలో శివ వైష్ణవ దేవాలయాకు చెందిన ద్వారపాలక విగ్రహాలు, శిల్పాలు, బంగారు, వెండి నాణేలు వారి మ్యూజియాల్లోనే ఉన్నాయి. రామలింగేశ్వరస్వామి, రుద్రేశ్వరస్వామి విగ్రహాలను దొంగిలించుకుపోయారు. నాగర్జునసాగర్ నిర్మాణంలో పూర్వపు మిర్యాగలగూడ, దేవరకొండ తాలూకాలోని 40 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి.

ప్రాజెక్టు తవ్వకాల సందర్భంగా సదరు గ్రామాల కింద అపురూపమైన సంపద వెలుగు చూసింది. ఈ సంపదతోనే గుంటూరు జిల్లాలో నందికొండ మ్యూజియం ఏర్పాటు చేశారు. నందికొండవద్ద, ఏలేశ్వరం వద్ద ముంపునకు గురైన నల్లగొండకు చెందిన గ్రామాలలో లభించిన అపురూప చరిత్ర సంపదతో నల్లగొండ జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిజాల రంగారావు, కాంచనపల్లి పెద్ద వెంకటరామారావు ఆనాటి సీఎం నీలం సంజీవరెడ్డిని అభ్యర్థించారు కూడా. ఈ అభ్యర్థనను ఆయన ఖాతరు చేయకుండా గుంటూరులో మ్యూజియం నిర్మించారు. ఇదే వరుసలో హైదరాబాద్, పానగల్లు, ఫణిగిరి, నల్లగొండ మ్యూజియంలకు చెందిన బుద్ధుడి అవశేషాలను, నాగార్జునసాగర్-గుంటూరు మధ్యన బుద్ధవనం పేరుతో నిర్మిస్తున్న భవనాలలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

stone5

1.10. 2003 నుండి 2012 ఏప్రిల్ వరకు పరిపాలించిన పురావస్తుశాఖ అధికారులు సీమాంధ్ర ప్రాంతానికి ఈ సంపద మొత్తం తరలిపోతున్నప్పటికీ ప్రేక్షక ప్రాత వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్రమేమిటంటే ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి ఇనగాల పెద్దిరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గీతారెడ్డి వంటి నాయకులు పురావస్తుశాఖలకు బాధ్యులుగా వ్యవహరించారు. ఏ ప్రాంతంలో లభించిన చరిత్ర సంపదతో ఆ ప్రాంతంలోనే మ్యూజియంలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఆయా ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర పురావస్తుశాఖ ప్రాథమిక నిబంధనలను, రాజ్యాంగ సూత్రాలను, సహజన్యాయ సూత్రాలను ఉల్లఘించి తెలంగాణ చరిత్ర సంపదలతో సీమాంధ్ర ప్రాంతంలో మ్యూజియంలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లా ఆలేరు సమీపంలోని కొలనుపాకలో 12 వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్యుల శిల్ప సంపద లభించింది. ఈ శిల్పాలన్నింటితో అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టరుకు చేసిన నివేదికలను బుట్టదాఖలయ్యాయి. సందట్లో సడేమియా మాదిరిగా వాటిని స్టేట్ మ్యూజియంకు తరలిస్తున్నామని చెప్పి హైదరాబాద్ వరకు తీసుకువచ్చి ఇక్కడి నుండి విశాఖ పట్టణం మ్యూజియానికి చేర్చారు.

stone3

ఖమ్మం నుంచి తరలిపోయిన ఆరు పాలరాతి బుద్ధ విగ్రహాలు
గతంలో బౌద్ధ క్షేత్రంగా వర్థిల్లింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతం. ఇక్కడి బైరాగిగుట్టలోని బౌద్ధస్తూపం దక్షిణ భారతదేశంలో అతిపెద్దది. ఒకప్పుడు బౌద్ధవిగ్రహాల తయారీ కేంద్రం నేలకొండపల్లిలో నిర్వహించినట్లు సమాచారం. పాండవులు, కౌరవులు బైరాగిగుట్ట సమీపంలో యుద్ధాలు చేశారని, కీచక గుండం ఉందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అపారమైన పురావస్తు సంపద బయటపడింది. బైరాగిగుట్ట సమీపంలో గల వాగులో ఓ జాలరికి రూ. 2కోట్ల విలువ చేసే కంచు బుద్ధవిగ్రహం దొరికింది. దానిని ప్రస్తుతం సాలార్జంగ్ మ్యూజియంలో ఉంచారు. బౌద్ధస్తూపం తవ్వకాలలో ఆరు పాలరాతి బుద్ధవిగ్రహాలు లభించాయని, వాటిని విజయవాడ మ్యూజియంకు తరలించారని నేలకొండపల్లికి చెందిన ఫారెస్ట్ రిటైర్డ్ ఉద్యోగి రాజపుత్ర విఠల్‌రాసింగ్ తెలిపారు.

ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే చారిత్రక ఆధారాలు పుష్కలంగా లభ్యమవడమే కాకుండా, విలువైన సంపద కూడా దొరుకుతుందని భావించి, రహస్యంగా తవ్వకాలు చేపట్టే ప్రయత్నాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ ప్రాంతంతో పాటు ఇల్లెందు సమీపంలోని గుండాలలో సైతం మానవ శిలాజాలు బయల్పడ్డాయి. జిల్లా కేంద్రంలో ఇలాంటి పురాతన వస్తువుల ప్రదర్శనకు ఎలాంటి మ్యూజియం లేకపోవడంతో వీటిని వేరే ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గుండాల ప్రాంతంలో బయల్పడిన ఆదిమానవుని శిలాజాల్లో కొన్నింటిని ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌ఆర్ బీజీఎన్‌ఆర్ కళాశాలలోనే భద్రపరిచారు. వీటిపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతాయని ప్రకటించినా, ఇప్పటి వరకు వాటి ఊసేలేదు. అయితే వాటిని తరలించే ప్రయత్నాలు దొంగచాటుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, పాల్వంచ, మధిర ప్రాంతాల్లో సైతం ఇలాంటి పురావస్తు సంపద ఉన్న ప్రాంతాలపై సీమాంధ్రులు కన్నువేసి వాటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే తరలించినవాటిని తిరిగి తెప్పించేందుకు ప్రయత్నాలు చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు.

ఇది తాజా ఉదంతం...:
వారం రోజుల క్రితం వరకు ఆర్కియాలోజీ డైరక్టర్‌గా వ్యవహరించిన పుల్లారావును నిజామామాద్ మ్యూజియంలోని విగ్రహాలను వెంటనే నిజామాబాద్‌లోని హరిత హోటల్‌కు తరలించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖన్ ఆదేశించినట్లు తెలిసింది. ఆయన లిఖిత పూర్వకంగా జీవో జారీ చేసినట్లయితే ఆదేశాలను పాటిస్తానని తెలియ చేయడంతో ఆగ్రహించిన చందనాఖన్ ఆయనను వెళ్లిపొమ్మని హూంకరించారని సమాచారం. నిజామాబాద్‌లోని హరిత హోటల్‌కు తరలించిన తర్వాత ఆ విగ్రహాలకు ఎక్కడికి పోతాయని పుల్లారావు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ తెలంగాణ వాదుల ప్రశ్నలే. ఈ క్రమంలోనే 1956 నుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు తవ్వకాలు జరిపారు? ఎక్కడెక్కడ జరిపారు? ఏ విధమైన చరిత్ర సంపద లభించింది? ఈ సంపద ఎక్కడ ఉన్నది? తదితర విషయాలన్నింటితో శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.

విలువైన విగ్రహాలు తరలించారు....
ఎంతో చారిత్రత్మాక సందప కలిగిన నేలకొండపల్లికి చెందిన బౌద్ధవిగ్రహాలు విజయవాడ తరలించారు. బైరాగిగుట్ట వద్ద ఎంతో విలువైన బంగారు విగ్రహాలు ఉన్నట్లు సమాచారం. మైనింగ్ చేస్తుంటే నేను కొంతమంది బైరాగిగుట్ట క్వారీస్ నిలిపివేశాం. చారిత్రక స్తూపం కాపాడాలి, తెలంగాణ నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని ఏర్పాటుకి కేంద్రంగా అభివృద్ధి చేసి చారిత్రక సంపదని కల్పించాలి.

రాజపుత్ర విఠల్ రాసింగ్, (నేలకొండపల్లి రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి)

రాయల తెలంగాణా కావాలెనట!

జేసి దివాకర్ రెడ్డి కొత్త రాగం అందుకున్నడు. రాయల తెలంగాణా కావాలెనట! అంటే రాజసీమ లోని కర్నూలు, అనంత పురం జిల్లాలు కూడా తెలంగాణాల కలుపాలె అని ఆయన భావం.

ఈ మాట అనేటందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. రాయల తెలంగాణా పెరుతోని హైదరాబాదులోని కబ్జా భూములు, అక్రమ వ్యాపారాలు, సక్రమ వ్యాపారాలు కాపాడుకునే టందుకు ఇదొక ఉపాయం కావొచ్చు. కాని అక్కడి ప్రజల్లో వున్న భావన కూడా కొంత వరకు ప్రతిఫలిస్తుండవచ్చు.

కర్నూలు, అనంతపురం జిల్లాలు నీటికోసం పూర్తిగా కృష్ణా, తుంగభద్ర జలాల మీద ఆధార పడ్డాయి. అనంతపురం దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతం. తెలంగాణాల కలిస్తే వారి భవిష్యత్తుకు, మిగులు జలాల పేరుతొ పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పుడు తరలిస్తున్న నీటి వాటాకు ధోకా ఉండదనేది వారి భావన కావచ్చు.

ఏదేమైనప్పటికి ఈ రకమైన వాదన చేసే సమయం ఎప్పుడో దాటిపోయి విభజన అంకం చివరి దశకు చేరుకున్నది. ఇప్పుడు ఇటువంటి వాదనలు చేసుడంటే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపుల్లలు వేసుడుగానే తెలంగాణా ప్రజలు భావిస్తరు. గతంలో వారు ఇటువంటి అడ్డుపుల్లలు ఎన్నో వేసి వున్నరు కాబట్టి అట్లా అనుకునేటందుకే ఎక్కువ అవకాశం వుంది.

తెలంగాణా ప్రజలు మొదటినుండి తమ పదిజిల్లాల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటునే కొరుతున్నరు. అంతకు మించి వారికి ఒక్క ఊరు కూడా ఎక్కువ అవసరం లేదు. గత అనుభవాల వలన, కొత్తగా వచ్చిన ఈ  రాయల తెలంగాణా డిమాండును వారు మరో రకం కుట్రగా మాత్రమె చూస్తరు తప్ప, తమపై ప్రేమతో వచ్చి సదరు జిల్లాల వారు కలుస్తున్నరని భావించే అవకాశం లేదు.

ఆ రెండు జిల్లాల వారు కూడా ఇప్పటివరకు సీమాంధ్రలో భాగంగానే భావిస్తు వస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా వారు జరిపిన సమైక్యాంధ్ర పేరుతొ జరిపిన ఉద్యమమే అందుకు సాక్ష్యం. ఇప్పటి వరకు తెలంగాణా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, రేపు తెలంగాణా ప్రజలతో మమేకం అవుతారని అనుకోలేం.

నిజంగా ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణాల కలుస్తందుకు అభిలషిస్తున్న వారు అయితే, వారు మొదటి నుండి తెలంగాణా ఉద్యమం లో పాల్గొన వలసింది. లాఠీ దెబ్బలు తిని ఉద్యమాలు చేయక పోయినా కనీస నైతిక మద్దతు అన్నా ఇచ్చి ఉండ వలసింది. అదేమీ చేయకుండా పైపెచ్చు సమైక్య వాదనతో, తెలంగాణా ఏర్పాటు వ్యతిరేకులతో అంట కాగి, ఇప్పుడు విభజన తప్పదన్న పరిస్థితుల్లో, 'మేం కూడా మీతో కలుస్తాం' అని వస్తే తెలంగాణా ప్రజలు సంతోషిస్తరని అనుకోలేం.

ఏదేమైనప్పటికీ ఇటువంటి వాదనలు చేసే సమయం ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు ఉన్న కొద్ది సమయంలో పది జిల్లాల తెలంగాణా ఏర్పాటు తప్ప తప్ప మరో విపర్యం లేదు.  

Monday, November 18, 2013

ఏం కతరా బై!

గాళ్ళ కత ఏందో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

యాభై మూడుల వాళ్ళు పోతం పోతం అంటే ఎల్లి పొండ్రి అని సాగనంపిన్రు తమిళ తంబిలు. ఉండున్రి మాతోనే అని ఒక్క మాటన్న అనలేదు!

యాభై ఆర్ల కలుస్తం కలుస్తం అంటే ఒద్దు మొర్రో అన్నరు తెలంగానోల్లు. అయినా కేంద్రాన్ని, హైదరాబాదు రాష్ట్రంల వున్న మరాటా, కన్నడులను అడ్డం పెట్టుకొని పైరవీలు చేసి కలిసి పోయిన్రు.

కలిసిన తెల్లారి నుండి ఒక్కటే గోల, మీరొద్దు బై మీరొద్దు బై అనుకుంట ...

అప్పటికన్నా మంచిగుంటే బాగుండే, కాని ఆ ఎవ్వారాలు చూసినంక కేంద్రమే విభజన చెయ్యాల్నని నిర్ణయించే!

ఇగసూడు ...

భద్రాచలం వాళ్ళు, మునగాల వాళ్ళు మేం వాల్లతోని కలవం మొర్రో అని ఒక్కతీర్గ మొత్తుకుంటున్నరు!

కనీసం కర్నూలోల్లు, అనంతపురపోల్లు కూడ వాల్లొద్దు, మీరే ముద్దు అన వట్టిన్రు!

మనుషులన్న తర్వాత నలుగురు కలిసె తట్టుండాలె... సూస్తే పారి పోయేటట్టు గాదు!

ఒకడు రాజ్యాంగం మార్వాలె నంటడు. ఒకడు ఆర్టికల్ 3 మార్వాలె నంటడు. ఇంకోడు నక్సలైట్లంటడు. మరోడు దేశ సమగ్రత అంటడు. గిట్ల ఆకుకు పోకకు అందని మాటలు మాట్లాడుతరు కాబట్టే ఎవ్వడు దగ్గరికి రాడు.

 చెప్పే అబద్ధాలు ఇనలేక జనం నవ్వుతున్నా సిగ్గు రాదు!

నీళ్ళు వృధాగా సముద్రంల కలుస్తయంటరు... అదే నోటితోని నీళ్ళు లేక కరువొస్త దంటరు.

తెలంగాణాను అభివృద్ధి చేసిన మంటరు... బొగ్గు మీదైతే ప్రాజెక్టులు మాదగ్గరున్నై, మీకు 50% కూడా కరెంటు రాదంటరు!!

ఒక్క ఉద్యోగం గూడ అన్యాయంగా తీసుకోలే దంటరు, విభజన వల్ల లక్ష మంది రోడ్డున పడుత రంటరు!!!

అయ్యా మీ అబద్ధాలు మీవోల్లే ఇప్పుడు నమ్ముదు బంద్  చేసిన్రు, ఇంకా మమ్ములనేం నమ్మించ చూస్తరు? ఇప్పుడన్నా జరంత నేల  మీద నడువున్రి... కనీసం మీవోల్లన్న నమ్ముతరు!


Sunday, November 3, 2013

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి బాంబు వెలిగించండి!