Saturday, March 31, 2012

సమన్యాయం



తమిళ తంబితో
కలిసుండడం
చేతకాక

సమన్యాయం
స్వపరిపాలన అంటూ
నినాదాలు చేశావ్

తట్టా బుట్టా సర్దుకుని
కర్నూలుకొచ్చి
కుంపటి పెట్టావ్

కుంపటి వున్నా కూడా
ఇల్లూ లేదు
వాకిలీ లేదు

కనపడింది
ఇల్లూ వాకిలీ చల్లగా వున్న
తెలంగాణా

ఇంకేం!
పరిగెత్తుకోచ్చావ్
దేబిరించావ్
అవుననే దాకా వదల్లేదు

మందబలం చూసావ్

అందాలా లెక్కావ్
వాసాలు లెక్కించి
మోసాలు చేసావ్

మా వాటా
మేమడిగి
మా పాలాన
మేం చూసుకుంటాం
అంటే

సమైక్యత
అంటూ
సొల్లు చెప్తున్నావ్

నాడు మద్రాసుతో
విడిపోయినప్పుడు
ఏమైంది
నీ
సమైక్యత?

Saturday, March 24, 2012

భావోద్వేగాలకు బాధ్యులెవరు?



మన రాష్ట్రం తో వచ్చిన గొడవేమిటంటే, రాజధాని తక్కువ జన సంఖ్యా కలిగిన  ప్రాంతమైన తెలంగాణలో వుండడం. అధిక శాతం జనం కలిగిన  ప్రాంతమైన ఆంధ్రాకి రాజధాని లేక పోవడం.

అధిక జనాభా వాళ్ళ వచ్చిన బ్రూట్ మెజారిటీతో గత యాభై నాలుగేళ్ళుగా ఆంధ్రా వారు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చారు. తమకు కలిగిన మెజారిటీని దుర్వినియోగం చేస్తూ, మైనారిటీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించ వలసిన బాధ్యత మరచారు. తద్వారా అభివృద్ధిలో తారతమ్యాలు పెరిగాయి. పర్యవసానంగా ప్రాంతీయ భావోద్వేగాలు పెచ్చరిల్లాయి.

ఈ పర్యవసానాలన్నింటికి ఆంధ్రా ప్రాంతంలో నివసించే సాధారణ పౌరుడు ఎంతవరకు బాధ్యుడు? అన్న ప్రశ్న సహజంగానే మనసులోకి వస్తుంది. నిజానికి ఈ పర్యవసానాలకూ, ఆంధ్రా ప్రాంతంలోని సాధారణ ప్రజలకూ ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణా ప్రజల్లానే వారు కూడా అమాయకులు.

మరి బాధ్యులెవరు?

గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రం పై ఏక చత్రాదిపత్యం వహిస్తున్న ఆంధ్రా ప్రాంతం నాయకులు. వీరు నాయకులుగా సమతూకం పాటించ వలసిన అవసరాన్ని విస్మరించారు.

బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాల(?) వల్ల మెకాలే చదువులు వంట బట్టించుకొని ఆఫీసర్ గిరీ వెలగ బెడుతూ, తద్వారా వచ్చిన అధికారాలతో తమకు తామే ఐన్ స్టీన్ లలా ఫీలవుతూ అత్యుత్సాహంతో తమ సంస్కృతి మాత్రమే సంస్కృతి అనీ, తమది మాత్రమే చరిత్ర అనీ చెప్ప జూశారు. ఆ క్రమంలో తెలంగాణా ప్రాంత చరిత్ర సంస్కృతులను కాల రాయడానికి ఏమాత్రం సంకోచించ లేదు.


ఆయకట్టు భూముల వల్ల వచ్చిన అదనపు డబ్బులతో తెలంగాణా ప్రాంతంలోని భూములు కొని వ్యాపారాలు ప్రారంభించారు. వీటిలోని ఉద్యోగాలను మాత్రం తమ ప్రాంతంలోని చుట్టాలకు పక్కాలకు మాత్రమే కట్టబెట్టి ఈ ప్రాంతంలో ప్రచ్చన్న నిరుద్యోగం పెరగడానికి దోహద పడ్డారు.

అలాగే సినిమా వ్యాపారాలు పెట్టి తమ గోదావరి యాస తప్ప మిగతా అన్ని యాసలనూ తూలనాడారు. ముఖ్యంగా తెలంగాణా యాసను రౌడీలకు, కమేడియన్లకు అంటగడుతూ, తెలంగాణా ప్రజలు తమ యాస పట్ల తామే ద్వేషం పెంచుకునేలా ప్రవర్తించారు.

ఇలా చెప్పుకు వెళ్తే అంతుండదు.

ప్రజల మనసులను ఇంతగా గాయపరచిన తర్వాత, కేసీయారో, కేసీయార్ కాకపోతే మరో కిషన్ రెడ్డి, ఇలా ఏవరో ఒకరు తమ ప్రయోజనాల మేరకే అయినప్పటికీ, సమస్యను తప్ప పైకి తీసుకు వస్తారు. ఎవరు సమస్యను పైకి తెచ్చారన్నది కాదు, అసలు సమస్యకు కారకులెవరో వారిదే అసలు బాధ్యత.        

తెలంగాణా కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్ళు



ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కాగానే తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కొత్త పాత మొదలు పెట్టారు. ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్తూ వీరు ప్రజల్ని గత అరవై సంవత్సరాలుగా మోసాలకు గురి చేస్తూనే వున్నారు. అంతకు ముందు నిజాంలతో కుమ్మక్కై ప్రజల్ని కాల్చుకు తిన్నది కూడా ఈజాతి వారే నన్నది తెలంగాణా ప్రజలు ఎప్పటికీ మరిచిపో కూడదు.

కిరణ్ ఎందుకు రాజీనామా చేయాలి? సీమాంధ్ర వాడు కాబట్టి సీమాంధ్ర పక్షపాతం చూపితే చూప వచ్చు. కానీ మరి తెలంగాణా నాయకులై వుంది వీళ్ళేం చేశారు? సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్నప్పుడు రాజీనామాలు చేసి ప్రజల్లోకి ఎందుకు రాలేదు.

ఆలోచించి చూస్తే వీరి గోల ఎందుకో అర్థం కాక మానదు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగు దేశం పూర్తిగా చిత్తినా నేపథ్యంలో తెలంగాణా వాదుల సెగ వీరి వైపు మల్లడం ఖాయం. వీరిని ఇప్పటికైనా రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని JAC వారు ఇప్పటికే ప్రకటించారు. ఇక ముందు మరింత వత్తిడి తెచ్చే అవకాశం వుంది. ఇప్పుడు వీరు చేసేదాల్లా వీరి చేతగాని తనాన్ని కప్పి పుచ్చు కునేందుకు చేసే తాటాకు చప్పుళ్ళు మాత్రమే.

 

Friday, March 23, 2012

ఎవరు చంద్రగుప్తులు?



బాబు
కిరణ్
చిరు
బొత్స
జగన్
కావూరి
లగడపాటి
రాఘవులు
రాయపాటి

తెలంగాణా
పాలిటి
నవనందులు

ఎవరు
వీరిని
గెలిచే
చంద్రగుప్తులు?

  

Friday, March 16, 2012

విశాఖకి 'ప్రత్యేక' రైల్వే జోన్ కావాలి



విశాఖకి 'ప్రత్యేక' రైల్వే జోన్ కావాలి
గుంటూరుకి 'ప్రత్యేక' హైకోర్టు బెంచీ కావాలి
సీమకి 'ప్రత్యేక' బోర్డు కావాలి

ఇవన్నీ ఎందుకు?
అధికార వికేంద్రీకరణకు
పరిపాలానను సులభతరం చేయడానికి
ప్రజలను భాగస్వాములు చేయడానికి
వివక్షను తగ్గించడానికి
ప్రజాస్వామ్యం పెంపొందించడానికి

ఇన్ని ప్రత్యేకాలు కావాలని
మీరే అంటున్నప్పుడు
అవే ఉద్దేశాలతో
అంతకన్నా గొప్ప కారణాలతో
మేం
ప్రత్యేకరాష్ట్రం కావాలంటే
అంత ఉలుకెందుకు?

Tuesday, March 13, 2012

నేను తెలంగాణాకు వ్యతిరేకం కాదు - చంద్రబాబు


వందలాది పోరలు
తెలంగాణా రందితోటి
వొళ్ళు కాల్చుకోని
ఉరేసుకొని చస్తుంటే
నీకు తెలంగాణావాదం కనపడదు

ఉద్యోగులు వ్యాపారులు
బడిపిల్లలు బడుగు జనులు
జీతాలను పణంబెట్టి
సకలజనులు సమ్మె జేసినా
నీకు తెలంగాణా వాదం వినపడదు

నిన్నటికి నిన్న
అసెంబ్లీలో తెలంగాణా
తీర్మానం పెట్టాలని
తోటి ఎమ్మెల్యేలు వాకవుట్లు చేస్తే
నీకు తెలంగాణా వాదమే లేనట్టనిపిస్తది

ఉప ఎన్నికలు వచ్చి
తెలంగాణా సీట్లకోసం
వోట్లు కావాలని గుర్తొచ్చి
మీటింగుల్లో దేబిరించేటప్పుడు మాత్రం
నువ్వు తెలంగాణాకు వ్యతెరేకం కాదా?

ఈ ఒక్క కారణం చాలదా సారూ
నిన్ను తెలంగాణా
పొలిమేర చివరిదాకా
తన్ని తరిమేసేటందుకు?
నీ పార్టీ అడ్రసు హరాం జేసేటందుకు?