Monday, January 30, 2012

తెలంగాణా ఏర్పడితే ...


తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కావడానికి వీల్లేదు.

ఎందుకు?

తెలంగాణా ఇస్తే ఇస్లామిక్ ఛాందసవాదం పెరుగుతుంది.

అలాగా? మరి BJP ఎందుకు సపోర్టు చేస్తుంది? ఒవైసీ ఎందుకు వ్యతిరేకిస్తుండు?

ఏమో నాకేం తెలుసు? BJP కి అది ఇష్టమేమో? ఒవైసీకి ఇష్టం లేదేమో!

!!??! 

అంతే కాదు. కమ్యూనిస్టు అరాచక వాదం కూడా పెరుగుతుంది.

అలాగా? మరి మీరే మొన్న కమ్యూనిష్టులు KCR ను తిడుతుంటే వంత పాడారుగా?

అవును KCR ను తిడితే వంత పాడుతాం. జై తెలంగాణా అంటే తిడుతాం.

తెలంగాణా ఏర్పడితే మీకొచ్చే నష్టమేమిటి?

మాకేం నష్టం లేదు. మేం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాం. కాక పోతే చిన్న రాష్ట్రాలు దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం.

తెలంగాణా చిన్న రాష్ట్రమేమీ కాదే? ఒక వేళ కేంద్రం ఇవ్వక తప్పదంటే ఏం చేస్తారు?

హైదరాబాదుని మాత్రం ప్రత్యేక రాష్ట్రం చేయాలని పోరాడుతాం. లేదా మా చెంచాల చేత పోరాటం చేయిస్తాం.

హైదరాబాదు మరీ చిన్న రాష్ట్రం కదా? అప్పుడు దేశ సమగ్రతకి విఘాతం కలగదా? టెర్రరిస్టులు ఊడి పడరా?

!?%#@*?!
  
   



Sunday, January 29, 2012

పాపం పిచ్చి దివాకర్!


ఈ జేసీకి సీయం కుర్చీ కాదు కదా కనీసం మంత్రి పదవి కూడా రాక పోవడంతో బుర్ర పని చేయడం మానేసినట్టుంది. లేకపోతే హెంతమాట? తెలంగాణాకి ఐదింట రెండేళ్ళు సీయం పదవి ఇవ్వాలంటాడా? 

యాభై ఐదేళ్ళ రాష్ట్రంలో పట్టుమని సంవత్సరం కూడా తెలంగాణా మనిషిని సీయంగా వుండనివ్వని వాళ్ళు తడవకు రెండేళ్ళు అవకాశం ఇస్తారా? ఈ రెండేళ్ళూ, కాంట్రాక్టులూ, వసూళ్ళూ, నిధుల మళ్లింపులూ  ఏం గావాల? అస్సలు కుదరని పని కదా?   

అదంతా అటుంచితే తానే సీయంనని కలలు కనే చెంద్రబాబు పనేం గావాల? కలలో నైనా ఆయన కుర్చీపై ఇంకొకరిని... అందునా బామ్మర్దో, మరదలో, అల్లుడో, కొడుకో కాకుండా ఎవడో తెలంగాణా మడిసిని అస్సలు ఊహించే పనేనా? ముందూ వెనుకా ఆలోచించే మాట్లాడుతున్నావా దివాకర్ రెడ్డీ?

ఇక పోతే నిరంతర ఓదార్పులతో దండ యాత్రలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో సీయం కుర్చీ అంటే అది పిత్రార్జితంతో సమానం. ఆయన పిత్రార్జితాన్ని వేరొకరితో పంచుకోమంటావా పిచ్చి దివాకర్! పాపం 


Saturday, January 28, 2012

ఒక మిత్రుడితో సంభాషణ


"గుడ్ మార్నింగ్ అండీ!"

"గుడ్ మార్నింగ్. బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నారు?"

"అవునండీ కూకట్ పల్లినుండి బస్సుల్లో వేల్లాడుకుంటూ వచ్చేసరికి ప్రాణం ఉసూరు మంటుంది."

"అవునా? అక్కడ సొంతిల్లుందా?"

"లేదండీ, రెంటుకే"

"మరి ఇక్కడే హిమాయత్ నగర్లో చూసుకోవచ్చుగా?"

"కాదండీ, అక్కడ రెంటు కొంచం రీజనబుల్ గా ఉంటుందని..."

"ఎంతిస్తున్నారు?"

"ఎనిమిది వేలండీ, డబుల్ బెడ్రూం ఫ్లాట్"

"ఇక్కడ కూడా అంతకన్నా ఎక్కువేమీ కాదే! ప్రయత్నించారా?"

"లేదండీ, మేం అక్కడే వుంటాం. అక్కడైతే మా వాళ్ళంతా వుంటారు."

"అంటే మీ అమ్మా, నాన్నా వాళ్ళు కూడా వున్నారా?"

"వాళ్లిక్కడ లేరండీ, ఊళ్లోనే వుంటారు."

"మరి బంధువులున్నారా?"

"బంధువులంటే బంధువులు కారండీ, తెలిసినాళ్ళున్నారు."

"మీ ఊరి వాళ్ళా?"

"అబ్బే కాదండీ, పరిచయస్తులు."

"ముందునుంచీ పరిచయమా?"

"లేదండీ, ఇక్కడికొచ్చాకే పరిచయం."

"ఇక్కడకి షిఫ్టైతే ఇక్కడ కూడా పొరుగువాళ్ళు పరిచయ మౌతారుగా?"

"లేదండీ, మేం అక్కడే వుంటాం. అక్కడే మాకు బాగుంటది".

"మరి రోజూ, రావడం పోవడం ఇబ్బందని మీరే అంటున్నారుగా?"

"ఫరవా లేదండీ. సర్దుకుంటాను. మాకక్కడే నచ్చిందండీ."
  
"అలాగా!!!"

మావోయిస్టు మాటలకు సమైక్యవాదుల చప్పుళ్ళు


కేసీయారు తెలంగాణా వాదాన్ని అమ్ముకుంటున్నాడని ఎవరో నక్సలైటు నాయకుడు ప్రకటన ఇచ్చాడట. అంతే, కొన్ని సమైక్యవాద నక్కలు ఊళ పెట్టడం మొదలు పెట్టాయి.

కేసీయారు నిస్వార్థంగా తెలంగాణాకోసం పోరాడుతున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారనుకొంటే అది వీరి అవివేకం తప్ప మరోటి కాదు. కేసీయారైనా, బీజేపీ ఐనా మరో పార్టీ అయినా వారి స్వార్థ లాభాల కోసమే సమర్థిస్తున్నాయి తప్ప మరోటి కాదు. అలాగే వ్యతిరేకించే పార్టీలకూ అలాంటి స్వార్థ లాభాలే వున్నాయి. 

అసలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒక్కడైనా స్వార్థం లేని నాయకుడు అందలం ఎక్కాడా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. స్వార్థానికి ఏ నాయకుడూ అతీతుడు కాదన్నది పచ్చి నిజం. కాబట్టి ఈ స్వార్థపర నాయకుల్లోంచే ఎవరినో ఒకరిని ఎన్నుకొని బలపరచాల్సిన అవసరం ప్రజలకు వుంది.

మరి తెలంగాణా ప్రజలు ఎవరిని సపోర్టు చేయాలి? తెలంగాణా వనరులను ఆంధ్రాకు కట్టబెట్టే నాయకులకా? లేదా తెలంగాణా కోసం పోరాడే నాయకులకా? ఆ విషయంలో తెలంగాణా ప్రజలు స్పష్టంగానే వున్నారు. ఆంధ్రా నాయకుల కుట్రలన్నీ బట్ట బయలైన తర్వాత, తమ నాయకులెవరో, వ్యతిరేకులేవరో ప్రజలకు స్పష్టంగా తెలిసింది.

ఇక పొతే తెలంగాణా వాదాన్ని కేసీయార్ అమ్ముకున్నాడా లేదా అనేది ప్రశ్న. ఇపుడు తెలంగాణలో ఆయన తిరుగులేని నాయకుడు. అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటాడు? ముష్టి పోలవరం కాంట్రాక్టు కోసం అమ్ముకునే వాడైతే, అలాంటివి 'చేతి'లోని పనే గాబట్టి ఎప్పుడో ఇచ్చి చిరంజీవి లాగా దుకాణం మూయించే వారు కాంగ్రెస్ వారు! అంతే గానీ ఓ ప్రాజెక్టు కోసమో, ఇంకో పదవి కోసమో తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీకి డిపాజిట్లు కూడా రాణి పరిస్థితి తెచ్చుకునేంత తెలివి తక్కువ వారా కాంగ్రేసు వారు? 

కాంగ్రేసు వారు తెలివి తక్కువ వారే అనుకుందాం. తెలంగాణాలో తనకున్న బలం గురించి, దానివల్ల దీర్ఘ కాలిక భవిష్యత్తులో తనకూ, తన పార్టీకి ఒనగూడే ప్రయోజనాలు తెలియని వాడేం కాదు చంద్రశేఖర్ రావు. అంత చీప్ గా అమ్ముడుపోయే రకం అసలే కాదు.

ఇక పోతే, చంద్రశేఖర రావు అమ్ముడు పోదామన్నా, కాంగ్రెస్ ఆయన్ని కొందామన్నా అది జరిగే పనీ కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం ఒక్క కేసీయార్ చేతిలోనో, ఇంకొక్క కోదండరాం చేతిలోనో లేదు. తెలంగాణా జేయేసీలో 187 ప్రజాసంఘాలు చైతన్యవంతంగా వున్నాయి. ఇంకోవైపు నుండి తెరాస వదిలి పెడితే ఉద్యమం పగ్గాలు అందుకోవడానికి బీజేపీ సిద్ధంగా వుంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ తెలంగాణా విభాగాలు ఏర్పడి తమ తెలంగాణా వాదాన్ని, వానిని కనీసం వినిపిస్తున్నాయి. అవకాశం వస్తే తెలంగాణా వాదులు గా ముద్ర వేసుకోవడానికి అవన్నీ తహ తహ లాడుతున్నాయి. 

ఇదంతా ఎందుకు? తెలంగాణా ప్రజల్లో ఉద్యమ బహావన బలంగా పాతుకుని వుంది కాబట్టి. ప్రజల్లో ఉద్యమం ఉన్నంత వరకూ, కేసీయారో, బీజేపీయో మరోటో వస్తూనే వుంటాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే వుంటాయి. దాన్ని ఆపే శక్తి గాదె కింది  పందికొక్కుల్లా తినమరిగిన సమెక్కుడు వాదులకు లేదు. 

ఇక పోతే కేసీయార్ పైనో, జేయేసీ పైనో ఆరోపణలు చేసిందెవరు? తెలంగాణా ఉద్యమాన్ని 'తీవ్రంగా' బలపరుస్తున్న మావోయిస్టు పార్టీ. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణా రావడానికి కేసీయార్ చేయాల్సినంత చేయడం లేదనేదే ఆ ప్రకటన సారాంశం (ఒక వేళ అది నిజందే అయినా). అంటే మరింత చిత్త శుద్ధితో మరింత తీవ్రంగా ప్రయత్నిచాలంటున్నారు వారు. దానికి సమెక్కుడు వాదులు భజంత్రీలు వాయించడం చూస్తే వారి మానసిక పరిస్థితినే అనుమానించాల్సిన అవసరం కనిపిస్తుంది.
   

Friday, January 27, 2012

ఏడొందల మంది చచ్చిపోతే రాష్ట్రం ఇవ్వాలా?


ఏడొందల మంది చచ్చిపోతే రాష్ట్రం ఇవ్వాలా అని తాజాగా ఒక సమెక్కుడు వాది ప్రశ్న. ఇంతకీ ఈ ప్రశ్న వేసిన వాడు ఇచ్చేవాడూ కాదు, చచ్చే వాడూ కాదు. వాడు రాసిన వెకిలి రాతలకు లింకు కూడా ఇవ్వబుద్ధి కావడం లేదు. తెలంగాణా నాయకులను, జనాన్ని రోజూ బ్లాగుల్లో దూరి తిడుతూ వికృతానందం  పొందే వాళ్ళలో వీడొకడు.

ఇక వీడికి సమాధానం ఇవ్వడం అవసరమా అనేది మరో ప్రశ్న.  అవసరం లేదు. కాని చర్చ ఎలాగూ వచ్చింది కాబట్టి మన వాదన చెప్పక పోతే ఎదుటివాడే కరెక్టని అమాయకులు నమ్మే అవకాశం వుంది.

ఇక చావుల విషయానికి వస్తే, ఒకే ఒక్క చావును చూపెట్టి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళెవరో కొత్తగా చెప్పాల్సిందేముంది? కాని ఇప్పుడు తెలంగాణలో ఎవరూ శవ రాజకీయాలు చేయడం లేదు. చేస్తే గీస్తే అలాంటి రాజకీయాలు సీమాంధ్రకు చెందిన జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నాడేమో.

తెలంగాణా వాదులు ఎవరినీ ఆత్మహత్యలు చేసుకోవద్దని పదే పదే  విజ్ఞప్తి చేస్తున్నారు. ఓదార్పులంటూ కొంతమంది చేసినట్టుగా glorify చేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఇవన్నీ ఈ మెక్కుడు వాదులకి కనపడవా? 

ఇక పోతే ఈ ఆత్మహత్యలన్నీ నిజం కాదని ఇంకో వాదన. హత్యలంటూ మరో వాదన. ప్రతీ ఆత్మహత్యకీ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఎంక్వైరీలున్నాయి. ఏమాత్రం నిజం కాకపోయినా, మరోటయినా తప్పుడు చిత్రీకరణలు అమోఘంగా చేసే మెక్కుడు ప్రభుత్వం వారిదే.

ఇక చివరిగా చెప్పే విషయం. మోసం చేసిన ప్రభుత్వం చేష్టలకు నిశ్చేష్టులైన, జనంలోని ఆవేశ పరులు ఉక్రోషంతో తీసుకున్న నిర్ణయాలు ఆ ఆత్మహత్యలు. వారు తెలంగాణా సాధించడం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజల ఆవేశాలకు అదో సూచిక. 

పదిమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే ప్రతిపక్షాలు కల్లోలం చేస్తాయి. ప్రభుత్వం దిగివచ్చి కమిటీలు వేసి కారణాలు వెదుకుతుంది. కమిటీలు వేసేది పదిమంది చచ్చినందుకు కాదు. దానికి కారణమైన సమస్యలోని లోతుపాతుల గురించి.

కాని వలస ప్రాతిపదికగా దశాబ్దాలుగా మెక్కుడుకి అలవాటుపడిన రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వందల ఆత్మహత్యలను గుర్తించక పోవడంలో ఆశ్చర్యం లేదు. మూడేళ్ళ పిల్ల కుటుంబ కలహాలవల్ల హత్యకు గురైతే హడావుడి చేసి బెజవాడకు పరుగులెత్తిన చంద్రబాబు, తెలంగాణలో ఇన్నివందల ఆత్మహత్యల గురించి ఒక్క మాట మాట్లాడ లేదంటే, ప్రధాన ప్రతిపక్షం తీరు ఎలా వుందో తేటతెల్లం.

కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీ... ఏదైనా సరే తెలంగాణా విషయం వచ్చే సరికి ఇవన్నీ ఒక తాను బట్టలే. అన్నిటి ధ్యేయం ఒక్కటే... తెలంగాణా ఎప్పటికీ ఏర్పడకుండా చేయడం. దానికోసం ఎన్ని కుమ్మక్కులైనా అవుతారు... ఎన్ని కుట్రలైనా చేస్తారు. కాబట్టి అప్రమత్తంగా వుండ వలసినది ప్రజలే. రానున్న అన్ని ఎలక్షన్లలో నడ్డి విరవడమే వీరికి సరైన శిక్ష. 
   


Wednesday, January 25, 2012

ఎక్కడున్నావు జేపీ?


ఆనాడు మిలియన్ మార్చి సందర్భంగా ప్రభుత్వం యొక్క విచక్షణా పూరిత, పాశవికమైన నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమకారులు ట్యాంకుబండు విగ్రహాలను కూలిస్తే, తమరు లబోదిబో మంటూ గుండెలు బాదుకుంటూ అసెంబ్లీ సాక్షిగా భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేయడం చూసాం.

మరి ఈనాడు ఎలాంటి కవ్వింపూ లేకుండా కొంతమంది అహంకారులు అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే అది మీ కళ్ళకు కనపడలేదా? లేదా అది స్పందించ తగినంత ప్రధానమైన విషయంగా కనిపించ లేదా? లేదా మీరు అంతే ఉద్వేగ పూరితంగా మాట్లాడినా కూడా నేను మిస్సయ్యానా?

Sunday, January 22, 2012

మిలియన్ మార్చి పై BBC కథనం


నిరంకుశ నియంతల పాలనను తలపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మిలియన్ మార్చిని అణచి వేసిన విధానం BBC ఎండగట్టింది. కాని వలసవాదాన్ని నరనరానా ఎక్కించుకున్న సీమాంధ్ర మీడియా రంగుటద్దాలకు మాత్రం వాస్తవాలు కనబడ లేదు. కేవలం కూలిన కాంస్య విగ్రహాలు మాత్రమే కనబడ్డాయి. ఈనాడులో మొదటి పేజీ మొత్తం నిండిన వార్తను BBC అసలు వార్తగానే పరిగణించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలంతో అష్ట దిగ్బంధనం చేసిన హైదరాబాదును ఛేధించుకొని 50000 ల మంది ట్యాంక్ బండ్ చేరుకుంటే సీమాంధ్ర మీడియాకు కనీసం పదివేలో, పదిహేను వేలమంది కూడా కనిపించ లేదట! ఇక చదవండి...

India: Arrests before Telangana 'million-man' rally

Protesters were prevented from gathering in large numbers

About 50,000 people have defied an unofficial curfew in the Telangana region of south India's Andhra Pradesh state to rally for a separate state.
Police say that 100,000 people have been detained - many in public auditoriums and stadiums - to prevent them attending the rally in Hyderabad.
Those held include the head of the Telangana Joint Action Committee and about 50 members of the state assembly. The protesters dubbed their gathering as a "million-man" rally.
But in the event few demonstrators were allowed by the authorities to congregate.

Widespread protests

Deep divisions have emerged over the Telangana issue over the past 15 months.
In December 2009, India's Congress Party-led government promised that the new state would be formed, but later said more talks were needed.

The announcement prompted widespread protests in the region.

PROPOSED TELANGANA STATE
  • Population of 35 million 
  • Comprises 10 districts of Andhra Pradesh, including city of Hyderabad 
  • Landlocked, predominantly agricultural area 
  • One of the most under-developed regions in India 
  • Fifty-year campaign for separate status 
  • More than 400 people died in 1969 crackdown 
 In the latest disturbances on Thursday, police used tear gas and batons to disperse protesting students at Osmania University in Hyderabad.

In addition, barricades and police road blocks were set up all over Telangana to prevent people from attending the "million-man rally".

The BBC's Omer Farooq in the city says that there is a tense atmosphere there and elsewhere across Telangana with schools, shops and businesses closed down.
Our correspondent says that the police security operation made it practically impossible for protesters inside and outside Hyderabad to attend the rally - all train and most bus services in Telangana were suspended.

Among those detained was Kodanda Ram, head of the Telangana Joint Action Committee, along with about 50 members of the Andhra Pradesh state assembly who support separate statehood.



The BBC's Soutik Biswas in Delhi says that the latest protests could once again re-ignite the Telangana issue and provoke further mass demonstrations.

The final decision on a new state lies with the Indian parliament. But the state assembly must also pass a resolution approving its creation.
Opponents of the move are unhappy that Hyderabad, home to many major information technology and pharmaceutical companies, could become Telangana's new capital.

(Curtesy: BBC News)

Saturday, January 21, 2012

చంద్రబాబు వరంగల్లు యాత్ర సఫలమైందా?

ఉధృతంగా జరిగిన సకల జనుల సమ్మెను ప్రభుత్వం మొండితనంతో అణచి వేయడంతో తెలంగాణా ఉద్యమం కొంత వెనక్కు తగ్గినట్టుగా అనిపించ సాగింది. ఏ ఉద్యమమైనా నిరంతరాయంగా ఒకే రకమైన ఊపుతో కొనసాగ జాలదు. ఉధృతి పెరగనైనా పెరుగుతుంది, లేదా నెమ్మదిస్తుంది. ప్రభుత్వాలు మొండి వైఖరి వహించిన నేపథ్యంలో అలా నెమ్మదించక పోతే ఆ ఉద్యమం కాస్తా యుద్ధంగా మారే ప్రమాదం వుంది. కాని ప్రస్థుత తెలంగాణా ఉద్యమానికి అంతటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య మార్గాలు ఇంకా పూర్తిగా మూసుకొని పోలేదు. 2014 ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణా ప్రజలు సంసిద్ధంగా వున్నారు. ఆ ఎన్నికల్లో సరయిన ఫలితాలు గనుక ఆశిస్తే పాలక పార్టీ ఈలోపే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వుంది.

ఈ పరిస్థితులను సరిగా అంచనా వేయలేని తెలుగుదేశం పార్టీ ఇక తెలంగాణా వాదం ముగిసి పోయినట్టేనని చంకలు గుద్దుకుంది. సహజంగా సమైక్యవాదాన్ని సమర్థించే ఈ పార్టీ తెలంగాణాలో తన బలం పెంచుకోవ డానికి ఇదే తగిన సందర్భమని భావించింది. తద్వారా ఇక్కడ తెలంగాణావాదం లేదని నిరూపించి తెలంగాణా ప్రక్రియను నిర్వీర్యం చేయడమే తెలుగుదేశం పార్టీ అసలు లక్ష్యం. 

డిసెంబరు 9 ప్రకటన తర్వాత సమైక్యవాదాన్ని చంద్రబాబు నాయుడు తలకెత్తుకోని ఇతర పార్టీల లోని సమైక్యవాద శక్తులకు నాయకత్వం వహించి NTR ట్రస్టుభవన్ కేంద్రంగా డబ్బు సంచుల కృత్రిమ ఉద్యమాలు నడిపించడం ఇదివరకే చూసి వున్నాం. చంద్రబాబు తన కుటిల నీతిని ప్రదర్శించి సమైక్యవాద శక్తులను ఏకీకృతం చేసి మరోసారి తెలంగాణా వాదాన్ని చావుదెబ్బ తీయాలనే అత్యాశతో వ్యవహరించిన తీరుకు వరంగల్లు యాత్ర అద్దం పడుతుంది. అలా సమైక్యవాద శక్తులను తనకు మాత్రమే చేతనైన లోపాయికారీ రాజకీయాలతో ఏకీకృతం చేయడంలో ఆయన సఫలీకృతం అయ్యాడు కూడా.

ఆయన వరంగల్లు పర్యటనకు కిరణ్ కుమార్ రెడ్డి కల్పించిన భద్రతా ఏర్పాట్లు, తెరవెనుక జరిగిన గూడుపుఠానీకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అయిదు వేలమంది పోలీసులు, మరో వేయి మంది సుశిక్షితులైన గ్రేహౌండ్స్, ప్రత్యేక రక్షణ దళాలు, ఇన్సాస్, ఏకే 47 లాంటి ఆధునిక తుపాకులు, మెషిన్ గన్నులు, బాష్పవాయు కానన్లతో సమకూర్చిన బందోబస్తు ఇంతవరకు ఇక్కడ జరిగిన ఏ ప్రధానమంత్రి సభలకు కూడా ఏర్పాటు జరిగి ఉండలేదు. వీటికి తోడు ఆరేడు వేల వాహనాలతో  దుడ్డుకర్రలతో సహా వచ్చిన గూండాలను చూసినప్పుడు అది ఒక రాజకీయపార్టీ నేత పర్యటన మాదిరిగా అనిపించలేదు. ఏ ఈదీ ఆమీనో, రాబర్ట్ ముగాబేనో పర్యటనకు వెళ్లినట్టు అనిపించింది. 

ఈ విధంగా ఐదువేల జనాభా కూడా లేని పాలకుర్తికి యాభైవేల మందీ మార్బలంతో చంద్రబాబు పర్యటన కొనసాగింది. ఆయన వెళ్ళే రోడ్లనిండా పోలీసులు ప్రజల్ని రోడ్లమీదికి రాకుండా విచక్షణా రహితంగా లాఠీ చార్జీలు చేసి మరీ అడ్డుకున్నారు. అయినా కూడా అడుగడుగునా ఆయనకు ఆగ్రహించిన ప్రజల చేత కోడిగుడ్లు, చెప్పుల వర్షం తప్పలేదు. ఆయన పర్యటించిన ప్రాంతం మొత్తం 144 సెక్షను విధించి ప్రజలను ఇల్లనుంది బయటకు కూడా రానివ్వలేదు. మరి 144 సెక్షను ఉన్న చోట ఆరువేల వాహనాల కాన్వాయ్ కి ఎలా అనుమతించారో ముఖ్యమంత్రికే తెలియాలి. స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వ సహాయంతో జనాన్ని, పోలీసులను వెంట తెచ్చుకొని  పాలకుర్తిలో సభ జరుపుకుని వెళ్ళాడు.  

దీన్ని పర్యటన అనడం కన్నా ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఒక మారుమూల ప్రాంతంపై తలపెట్టిన దురాక్రమణ అంతే సరిగ్గా సరిపోతుంది. ఇలా జరుపుకున్న సభను విజయవంతమైన పర్యటనగా తన మీడియా చేత తెలుగుదేశం ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కాని వాస్తవాలను ప్రజల ముందు దాచడం అంత సులభం కాదు. తమ కుట్రలు బెడిసి కొట్టాయని తెలుసుకున్న ఆ పార్టీ, తెరాస, JAC నాయకులపై తెలంగాణాకు చెందిన తెలుగుదేశం నాయకుల చేత వ్యక్తిగత దూషణలకు దిగింది. 

తెలంగాణా ఉద్యమ నాయకత్వంలో లోపాలుండ వచ్చు. కాని ప్రత్యాన్మాయం లేనంత వరకూ ప్రజలు వారినే ఆదరిస్తారు. తెలంగాణా తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి వుంటే వారే నిజాయితీగా ఉద్యమం నడిపించవచ్చు. అప్పుడు ప్రజలే ఆదరిస్తారు. అంతే గానీ ఇలా సమైక్యవాద నాయకుని పాద పూజలు చేస్తూ, అంతో ఇంతో తెలంగాణా కోసం పని చేస్తున్న వారిని దూషించడంవల్ల ఇప్పటికిప్పుడు అధినాయకుని డబ్బు మూతలు ముట్టొచ్చేమో కానీ, ప్రజల చేత శాశ్వత తిరస్కారానికి గురికాక తప్పదు. 

Friday, January 20, 2012

సమైక్యవాదుల భాగోతం


ఎలాంటి తర్కానికీ అందని నీతులు సమైక్యవాదులవి. తర్కానికి దూరంగా ఉండడానికి కారణం వారు చెప్పే దానిలో సహజ న్యాయం లోపించడమే. మచ్చుకు ఇవి చూడండి.

రెండుకోట్ల జనాభాకి ప్రాంతీయ స్వపరిపాలన కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన పొట్టి శ్రీరాములు అమరజీవి, అసమాన త్యాగశీలి. అంతకు రెట్టింపు జనాభాకోసం అదే ప్రాంతీయ స్వపరిపాలన కోసం రాష్ట్రం కావాలని అడుగుతున్న తెలంగాణా వాదులు వీరి దృష్టిలో వేర్పాటు వాదులు!

భాష పేరు చెప్పి నాడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం చేస్తే అది అసమాన మైన పోరాటం. అదే ఇంకొకరు తుళువ నాడో, బోడోలాండో కావాలంటే అది దేశ సమగ్రతకి ముప్పు!

తాము విడిపోతే మాత్రం తమ ప్రాంతంలో లేకున్నా, మూడొంతుల మంది జనం తమభాష మాట్లాడకున్నా మద్రాసు నగరం కావాలి. అదే ఇతరులు విడిపోతే మాత్రం వారి ప్రాంతంలో లేకున్నా, వారి జాతి కాక పోయినా హైదరాబాదు నగరం మాత్రం వారికి ధారాదత్తం చేయాలి. (అలాగైతే ఒప్పుకుంటారట!)

కలిసి ఉన్నంత కాలం తెలంగాణా ప్రజలంటే లోకువ, హేళన, అసహ్యం, చిన్న చూపు, ఏవగింపు. విడిపోయే పరిస్థితి వస్తే మాత్రం తెలుగుజాతి అంతా ఒక్కటే.

కలిసి ఉన్నంత కాలం తెలంగాణా ప్రజలు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే "అబ్బే, మీరు మెట్ట మీదున్నారుగా, మీకు నీళ్ళెలా వస్తాయి? నీరు పల్లమెరుగును కదా!" అనే మాటలు. విడిపోయే పరిస్థితి వచ్చే సరికి "తెలంగాణా నుండి నీరు రాదు" అని గగ్గోలు. తెలంగాణా ఏర్పడగానే గురుత్వ నియమాలు మొత్తంగా మారిపోతాయేమో!

తెలంగాణాలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన సమైక్య వాదులు తిరగలేక పోతే అది భావ స్వేచ్ఛకు విఘాతం. అదే ఆంధ్రాలో ఆంధ్రాప్రాంతం వారే ప్రత్యేకాంధ్ర వాదం చెప్పడానికి బయటికి వెళ్ళే పరిస్థితి లేక పోతే, వారిని వారి సభా ప్రాంగణంలోనే విమస గూండాలు చితగ్గొడితే మాత్రం అది ప్రజాగ్రహం!

Wednesday, January 18, 2012

విశాలాంధ్ర వాదులూ, మీకు మీరే సాటి!

చాలా కాలం తర్వాత యధాలాపంగా బ్లాగు కామెంట్లను చూస్తూ వుంటే విశాలాంధ్ర కూటమికి చెందిన ఒకాయన ఒక వ్యాసం లింకు ఇస్తూ వాచిపోయేలా జబ్బలు చరచుకోవడం కనిపించింది. సరే, ఈయన ఇంత ఇదిగా చెబుతున్నాడు గదా, ఏముందో చూద్దాం అని అక్కడకు వెళ్ళడం జరిగింది. అది తనకు తానుగా తెలంగాణా వాణ్ని అని ప్రకటించుకునే, గుంటూరు జిల్లా నుండి వచ్చి నల్లగొండ జిల్లా శివార్లలో సెటిలైన కుంటుంబం తాలూకు పెద్దమనిషిది. తీరా చదివాక, 'హత విధీ, ఈ చెత్తను ఇంధనంగా భ్రమించేనా, విశాలాంధ్ర వాదులు సమైక్యవాద  బోగీలను నడిపించాలని చూస్తున్నది?' అనుకోక తప్పలేదు.  

ఈ పెద్దమనిషి రాసిన వ్యాసం రెండోలైన్లోనే ఇతని ఆలోచనా ధోరణి బట్టబయలై పోయింది. ఏమంటాడో చూడండి.


When the Nizam of Hyderabad in 1947 started toying with the idea of becoming an independent ruler, Nehru ordered the Indian Army into Hyderabad and merged the territory into the Republic of India.


నిజాం హైదరాబాదు స్వతంత్ర దేశంగా వుండాలని ఆలోచించాడట, ప్రతిగా నెహ్రూ భారత సైన్యాన్ని పంపించి హైదరాబాదుని ఇండియాలో కలిపాడట. ఇక్కడ తెలంగాణా ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం చేసిన నిజాం వ్యతిరేక పోరాటం పై చిన్న ప్రస్తావన కూడా లేదు. ఏదో దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా వుంది ఈయన వ్రాసిన విధానం. తన పరువు సంగతి ఎలా వున్నా,  ఈయన తన రాతలతో నెహ్రూ పరువు కూడా తీసేలా వున్నాడు! అవునుమరి! దోపిడీ కాంక్షా, విస్తరణ వాదమే నరనరానా ఎక్కించుకున్న వారికి  నెహ్రూనో, పటేలో చేసిన పని అలా కాక ఇంకెలా కనబడుతుంది? 


ఈ పెద్దమనిషి పేల్చిన మరో పెద్ద జోకు ఇక్కడ చూడండి.


The Commission recommended the merger of Telugu speaking Nizam region with the Andhra state, but recommended a waiting period of 5 years before the merger, to allay some of the concerns expressed by a handful of Congress party leaders. 


SRC సమైక్యాంధ్రకు సిఫారసు చేసిందట. కాని అయిదు సంవత్సరాలు ఆగమని చెప్పిందట. ఎందుకు? గుప్పెడు కాంగ్రెస్ వాదులు వద్దన్నారు కాబట్టి. మరి ఆ తర్వాత లైన్లోనే ఈ పెద్దమనిషి ఏం వ్రాస్తాడో చూడండి.


When a resolution for merger was placed in the Hyderabad assembly, 2/3rd of the legislators from Nizam ruled Telugu region favoured an immediate merger.


ఒకవైపు వద్దన్న కాంగ్రెస్ వాదులే అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో వెనువెంటనే కలవాలని కోరుకున్నారట!


అసలు మొదటి ఎస్సార్సీ ఏం సిఫారసు చేసిందో ఇక్కడ చూడండి.



దీంట్లో ఎక్కడైనా అలా సిఫార్సు చేసినట్టు కనిపించిందా?

నిజానికి నలమోతు ఎంత దాయడానికి ప్రయత్నించినా కళ్ళకు కట్టినట్టు కనపడే వాస్తవం ఇదీ. 1961 వరకూ తెలంగాణా రాష్ట్రం హైదరాబాదు రాష్ట్రంగా కొనసాగాలని ఎస్సార్సీ స్పష్టంగా చెప్పింది. ఆతర్వాత ఏర్పడే అసెంబ్లీ మూడింట రెండువంతుల మెజారిటీతో అంగీకరిస్తేనే తెలంగాణాను విశాలాంధ్రలో కలపాలని అది స్పష్టంగా చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రవర్తించి, ముందుగానే కలయికకు అంగీకరించింది మాత్రం నలమోతు చెప్పిన ఆ గుప్పెడు కాంగ్రెస్ పెద్దమనుషులు మాత్రమే. 

ఇలా ఈ పెద్దమనిషి అబద్ధాల పరంపరను వివరించుకుంటూ పోతే, మన సమయం వృధా చేసుకోవడం తప్ప అది ఎంతకూ తరిగేది కాదు. ఇంత నిర్లజ్జగా ప్రాంతీయ పక్షపాతంతో రాతలు రాసే పెద్దమనిషి సమైక్యతా రాగాలు తీయడం ఎవరిని మెప్పించడానికి?

ఈ పెద్దమనిషి రాతలే సదరు విశాలాంధ్ర గుంపుకు సిద్ధాంత గ్రంధాలు. ఇక వీరి సంస్థ తీరు తెన్నులు అన్యులెరుగ తరమా?