Saturday, January 28, 2012

మావోయిస్టు మాటలకు సమైక్యవాదుల చప్పుళ్ళు


కేసీయారు తెలంగాణా వాదాన్ని అమ్ముకుంటున్నాడని ఎవరో నక్సలైటు నాయకుడు ప్రకటన ఇచ్చాడట. అంతే, కొన్ని సమైక్యవాద నక్కలు ఊళ పెట్టడం మొదలు పెట్టాయి.

కేసీయారు నిస్వార్థంగా తెలంగాణాకోసం పోరాడుతున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారనుకొంటే అది వీరి అవివేకం తప్ప మరోటి కాదు. కేసీయారైనా, బీజేపీ ఐనా మరో పార్టీ అయినా వారి స్వార్థ లాభాల కోసమే సమర్థిస్తున్నాయి తప్ప మరోటి కాదు. అలాగే వ్యతిరేకించే పార్టీలకూ అలాంటి స్వార్థ లాభాలే వున్నాయి. 

అసలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒక్కడైనా స్వార్థం లేని నాయకుడు అందలం ఎక్కాడా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. స్వార్థానికి ఏ నాయకుడూ అతీతుడు కాదన్నది పచ్చి నిజం. కాబట్టి ఈ స్వార్థపర నాయకుల్లోంచే ఎవరినో ఒకరిని ఎన్నుకొని బలపరచాల్సిన అవసరం ప్రజలకు వుంది.

మరి తెలంగాణా ప్రజలు ఎవరిని సపోర్టు చేయాలి? తెలంగాణా వనరులను ఆంధ్రాకు కట్టబెట్టే నాయకులకా? లేదా తెలంగాణా కోసం పోరాడే నాయకులకా? ఆ విషయంలో తెలంగాణా ప్రజలు స్పష్టంగానే వున్నారు. ఆంధ్రా నాయకుల కుట్రలన్నీ బట్ట బయలైన తర్వాత, తమ నాయకులెవరో, వ్యతిరేకులేవరో ప్రజలకు స్పష్టంగా తెలిసింది.

ఇక పొతే తెలంగాణా వాదాన్ని కేసీయార్ అమ్ముకున్నాడా లేదా అనేది ప్రశ్న. ఇపుడు తెలంగాణలో ఆయన తిరుగులేని నాయకుడు. అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటాడు? ముష్టి పోలవరం కాంట్రాక్టు కోసం అమ్ముకునే వాడైతే, అలాంటివి 'చేతి'లోని పనే గాబట్టి ఎప్పుడో ఇచ్చి చిరంజీవి లాగా దుకాణం మూయించే వారు కాంగ్రెస్ వారు! అంతే గానీ ఓ ప్రాజెక్టు కోసమో, ఇంకో పదవి కోసమో తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీకి డిపాజిట్లు కూడా రాణి పరిస్థితి తెచ్చుకునేంత తెలివి తక్కువ వారా కాంగ్రేసు వారు? 

కాంగ్రేసు వారు తెలివి తక్కువ వారే అనుకుందాం. తెలంగాణాలో తనకున్న బలం గురించి, దానివల్ల దీర్ఘ కాలిక భవిష్యత్తులో తనకూ, తన పార్టీకి ఒనగూడే ప్రయోజనాలు తెలియని వాడేం కాదు చంద్రశేఖర్ రావు. అంత చీప్ గా అమ్ముడుపోయే రకం అసలే కాదు.

ఇక పోతే, చంద్రశేఖర రావు అమ్ముడు పోదామన్నా, కాంగ్రెస్ ఆయన్ని కొందామన్నా అది జరిగే పనీ కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం ఒక్క కేసీయార్ చేతిలోనో, ఇంకొక్క కోదండరాం చేతిలోనో లేదు. తెలంగాణా జేయేసీలో 187 ప్రజాసంఘాలు చైతన్యవంతంగా వున్నాయి. ఇంకోవైపు నుండి తెరాస వదిలి పెడితే ఉద్యమం పగ్గాలు అందుకోవడానికి బీజేపీ సిద్ధంగా వుంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ తెలంగాణా విభాగాలు ఏర్పడి తమ తెలంగాణా వాదాన్ని, వానిని కనీసం వినిపిస్తున్నాయి. అవకాశం వస్తే తెలంగాణా వాదులు గా ముద్ర వేసుకోవడానికి అవన్నీ తహ తహ లాడుతున్నాయి. 

ఇదంతా ఎందుకు? తెలంగాణా ప్రజల్లో ఉద్యమ బహావన బలంగా పాతుకుని వుంది కాబట్టి. ప్రజల్లో ఉద్యమం ఉన్నంత వరకూ, కేసీయారో, బీజేపీయో మరోటో వస్తూనే వుంటాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే వుంటాయి. దాన్ని ఆపే శక్తి గాదె కింది  పందికొక్కుల్లా తినమరిగిన సమెక్కుడు వాదులకు లేదు. 

ఇక పోతే కేసీయార్ పైనో, జేయేసీ పైనో ఆరోపణలు చేసిందెవరు? తెలంగాణా ఉద్యమాన్ని 'తీవ్రంగా' బలపరుస్తున్న మావోయిస్టు పార్టీ. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణా రావడానికి కేసీయార్ చేయాల్సినంత చేయడం లేదనేదే ఆ ప్రకటన సారాంశం (ఒక వేళ అది నిజందే అయినా). అంటే మరింత చిత్త శుద్ధితో మరింత తీవ్రంగా ప్రయత్నిచాలంటున్నారు వారు. దానికి సమెక్కుడు వాదులు భజంత్రీలు వాయించడం చూస్తే వారి మానసిక పరిస్థితినే అనుమానించాల్సిన అవసరం కనిపిస్తుంది.
   

9 comments:

  1. సమైక్యవాద ఉద్యమాన్ని నడుపుతున్నది మార్క్సిజాన్ని వ్యతిరేకించే వైయుక్తికవాద వర్గంవాళ్ళు కదా. వాళ్ళకి మావోయిస్ట్ మాటల్లో లాజిక్ కనిపించిందా? నేను ఎలాగూ మావోయిస్ట్‌నే కాబట్టి వాళ్ళ మాటలు చూస్తోంటే నాకు నవ్వు వస్తోంది. కెసి‌ఆర్ తెలంగాణాకి ముఖ్యమంత్రి అవ్వడానికి తెలంగాణా ఉద్యమం నడుపుతున్నాడంటే నమ్మాలట, లగడపాటి తన రియల్ ఎస్టేట్స్ ధరలు పడిపోకుండా ఉండేందుకు సమైక్యవాద ఉద్యమం నడుపుతున్నాడంటే నమ్మకూడదట! స్వార్థపరుడు ఎక్కడున్నా అతను స్వార్థపరుడే అవుతాడు. అతను కోస్తా ఆంధ్రలో ఉంటే ఏమిటి, తెలంగాణాలో ఉంటే ఏమిటి?

    ReplyDelete
  2. ప్రవీణ్,

    అంతే కాదు, ఒక వైపు ముఖ్యమంత్రి కావాలనే ఆశతో KCR ఉద్యమం నడుపుతున్నాడంటూనే మరోవైపు ఆయన ఉద్యమాన్ని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టాడని చెప్పడానికి కూడా వెనుకాడరు. లాజిక్ వదిలేసిన తర్వాత నాలుక ఎటైనా తిప్పొచ్చు కదా.

    ReplyDelete
    Replies
    1. నిజంగానే కేసీయారు ఉద్యమాన్ని అలా తాకట్టు పెట్టినా, వీళ్ళకు బాధ దేనికో (పైగా సంతోషించాలి) కూడా అర్థం కాదు.

      Delete
  3. సమెక్కుడు వాద "సోదరులకు" ఇదే మా సందేశం.

    KCR చేసే మోసాలు, ఆయన దొరపోకడలు, ఉద్యమాన్ని అమ్ముకొనే ఎత్తుగడలు తెలియచేసినందుకు థాంక్స్. ఆయన ఓడలు, తాగుడు, చూస్తున్న వీడియోలు లాంటి ఆసక్తికరమయిన మసాలా వార్తలు అందచేసినందుకు మేము మీకు రుణ పది ఉంటాము.

    మీ సలహా ప్రకారం ఇకపై తెరాస కబంధ హస్తాల నుండి బయటకు వచ్చేస్తున్నాం. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం మున్ముందు మావోయిస్టు నాయకత్వంలో ఉద్యమిస్తాం. మాకీ కనువిప్పు కలిగించి ఉద్యమాన్ని సరయిన బాటలో మళ్లించిన మీ అందరకీ శతకోటి వందనాలు.

    ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

    Jai Telangana, red salute to Comrade Jagan, down with vishandhra and its chamchas like KCR!

    ReplyDelete
    Replies
    1. కేసీయార్ లేకపోతే తెలంగాణా ఉద్యమం అంతరించి పోతుందని ఈ పరాన్నభుక్కుల అత్యాశ. ప్రజల్లో ఉద్యమమే లేకపోతే కేసీయార్ ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా బతుకు తెరువు కోసం ఏదో ఓ పార్టీలో చేరి వుండేవాడని వీరికన్నా తెలంగాణా వాదులకు బాగానే తెలుసు.

      కేసీయార్ ఉద్యమానికి నాయకత్వం వహించినంత కాలమే ప్రజలు ఆయన వెంట ఉంటారు. లేకపోతే ఇంకో నాయకున్ని వేదుక్కుంటారు. తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఇప్పుడు నాయకులకు కొదవ లేదు.

      Delete
    2. మంచిగ చెప్పినవన్న. మనకు తెలంగాణా కావాలె, XYZ నాయకుడు ఏమయితే మనకేంది. ఈమధ్య గీ విషాంధ్ర సమితోల్లు కెసిఆర్ ఏమి సీన్మలు చూస్తున్నడో అని రంది పడతాన్రు. ఆయన జీతగాళ్ళను అడిగి తెల్సుకొని గా DVDల పేర్లు రాసుకొని మురిసిపోతున్నరు.

      Delete
  4. అసలిది మావోయిస్టులు రాసిన ఉత్తరమా లేక ఏబీఎన్ రాధాక్రిష్న రాసిన ఉత్తరమా అనేది మరో అనుమానం. ఒకప్పుడు ఈటెల రాజేందర్ హెచెంటీవీకి రాసిన ఉత్తరమంటూ ఒక ఉత్తరాన్ని మన విషాంధ మహాసభ వారు బ్లాగులో పెట్టారు, అయితే ఆఉత్తరం ఏబీఎన్ రాధాక్రిష్న రాసిన ఉత్తరమే అని అప్పటికే తేలింది.

    ReplyDelete
    Replies
    1. ఆ వుత్తరంలో వాడిన పదజాలం, తెదేపా వారు ప్రతిరోజూ తెరాసను విమర్శించడానికి వాడే పదజాలం ఒకటిగా వుండడం కాకతాళీయం కాకపోవచ్చు.

      Delete
  5. రాష్ట్రంలో మావోయిస్ట్ ఉద్యమం బాగా తగ్గింది. రాష్ట్రంలో మావోయిస్ట్‌లు మిగిలి ఉన్నారో, లేదో తెలియదు. ఈ సమయంలో మావోయిస్ట్‌ల పేరుతో ఉత్తరం వ్రాస్తే మావోయిస్ట్‌లు ఆ ఉత్తరం తాము వ్రాయలేదు అని చెప్పకపోవచ్చు అనుకుని తెలుగు దేశంవాళ్ళే మావోయిస్ట్‌ల పేరుతో ఆ ఉత్తరం వ్రాసి ఉంటారు.

    ReplyDelete