Thursday, February 2, 2012

కుంటాలపై కుట్రలు


తెలంగాణ నయాగరా కుంటాల జలపాతంపై పెద్దల కన్నుపడింది. జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారనుకుంటే పొరపాటే. పాలకులు దాని అందాలను కనుమరుగు చేసి అక్కడ ఉన్న అపారమైన ఖనిఖ సంపదను దోచుకోవడానికి రాజీపవర్ ప్రాజె క్టు వారు రెండు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా రు. దీనికి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తెన జలపాతంగా పేరొందిన ఈ జలపాతం సహజసిద్ధంగా ఏర్పడింది. ఎంతో పురాతనమైనది కూడా. ఈ జలపాతా న్ని సందర్శించడానికి రాష్ట్ర నలుమూలనుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటి చారిత్రాత్మక స్థలాన్ని అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడానికి పాలకులు పూనుకొంటున్నారు. కుంటాల జలపాతంపై విద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి దాన్ని కొల్లగొట్టడానికి చకచకా ఫైళ్ళు కదులుతున్నాయి. కేవలం ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి రాజీపవర్ ప్రాజెక్టు పేరుతో కుట్రపన్నుతున్నారు.

ఈ ప్రాంతంలోని గ్రానైట్ మిగతా ఖనిజ సంపదపై కన్నువేసిన పెట్టుబడిదారులు 1991లోనే హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతిపాదనలు వచ్చిందే తడవుగా అటవీ, రెవెన్యూ ట్రాన్స్‌కో, చిన్న నీటిపారుదల శాఖ ఐటిడిఏ, డిఆర్‌డిఏ, నెడ్‌క్యాప్ తదితర శాఖ అధికారులను ప్రభుత్వం హైడల్ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. హైడల్ ప్రాజెక్టు ఎన్‌ఓసీ చకచకా జారీ చేసి పాలకులకు తెలంగాణ పట్ల ఉన్న వివక్షను చాటుకున్నా రు. కానీ అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకొన్న గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన సోమేశ్వర ఆలయం అదేవిధంగా అందాల జలపాతం కనుమరుగవుతుందని, ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని కోల్పోతామని పవర్ ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు.

కుంటాల జలపాత పరిరక్షణ సమితి చేస్తున్న ఈ ఉద్యమానికి సంఘీభావంగా కుంటాల బచావో సమితి, కొమురంభీం ఆశయసాధన సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ వికాస్ పరిషత్ తదితర ప్రజా సంఘాలు పోరాటం చేస్తుండగా వీటికి తోడు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. దీనికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కూడా అండగా నిలిచింది. విరసం నేత వరవరరావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు శ్రీధర్‌దేశ్‌పాండే, ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ తదితరులు ఇప్పటికే కుంటాల జలపాతాన్ని సందర్శించారు. కుంటాల జలపాతాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇటీవల నిర్మల్‌లో వేలాది మంది విద్యార్థులు పవర్‌ప్లాంటుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. గిరిజన సంఘాలు తెలంగాణ ప్రజావూఫంట్ చైర్మన్ అధ్యక్షులు గద్దర్, విమలక్క, వేదకుమార్ హైదరాబాద్‌లో అరణ్య భవన్‌ను ముట్టడించారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను వేలాది మంది గిరిజనులు దిగ్బంధించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, సామాజికవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మాణాన్ని నిలిపివేయాలని కుంటాల జలపాతాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గిరిజనులు పవిత్ర స్థలంగా భావించే కుంటాల జలపాతం వద్ద జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి అక్టోబర్ 16న కుంటాల జలపాతం వద్ద కొమురం భీం వర్ధంతిని ఘనంగా జరిపారు. కుంటాల జలపాతాన్ని నాశనం చేసే హైడల్ పవర్ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగకుండా పోరాడుతామని కొమురం భీం సాక్షిగా ప్రతిన బూనారు.తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న వనరుల దోపిడీని అడ్డుకోవడానికి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సీమాంధ్ర పాలకుల కుటిల యత్నాలను అడ్డుకోవాలి.

-పరశురామ్ సోలంకి
కుంటాల జలపాత పరిరక్షణ సమితి

6 comments:

  1. WE DON'T ALLOW COAL MINING, THERMAL PROJECTS, NUCLEAR PROJECTS, HYDEL PROJECTS IN THE NAME OF ENVIRONMENT, LAND GRABBING, RIGHTS OF LAND ETC...

    BUT WE WANT 24 HRS POWER FOR HOMES AND FARMING...

    BHASKAR

    ReplyDelete
    Replies
    1. All can be allowed, but in a sane manner. You can not build a nuclear power plant at a densely populated area. You can not tamper beautiful natural water falls and habitat for a paltry 6MW power station.

      Delete
  2. I think you are unncessarily aiming your guns at the Andhra people. This govt is nobody's champion including the Andhras. This govt. is supporting the same kind of environmental destruction in the Coastal Andhra where people are agitating against it just like they are donig in Telangana. The Govt is helping the private people ravage highly fertile paddy fields of Nellore and the natural beauty of the Araku Valley. So, be it Telangana or Andhra or America, everywhere govt.s are subservient to the business interests of large private corporations. There is apparently no escape from it even if a separate Telangana is formed.

    ReplyDelete
    Replies
    1. You are right. This government is no one's champion. But it is run by certain influential groups hailing from andhra region. For some reason or other, these governments always shown bias towards andhra in their decisions is a known fact in the history of AP. For this reason, the people of andhra are in no mood to dethrone these influential people. Parties may change, but these groups remain in the vicinity of power. After losing all hopes on a unified state, now Telangana people want their own state to be ruled by their choice of leaders.

      Delete
  3. మిసన్ తెలంగాణాలో తుపాకీ లాంటి వార్తొచ్చింది చూడు: http://missiontelangana.com/prakasham-pantulu-facts/

    ReplyDelete
    Replies
    1. ప్రవీణ్,

      లింకు ఇచ్చినందుకు thanks.

      Delete