Wednesday, February 22, 2012

కృష్ణా నదీ జలాల మళ్లింపునకు మహా కుట్ర



కృష్ణా జలాలపై ఇది మరో కుట్ర కోణం! నదిపై వంతెన కట్టాలన్న ప్రజల ఆకాంక్షలో సైతం సీమాంధ్ర ప్రయోజనం చూసుకున్న పాలకుల దుర్నీతి! ఆ దుర్నీతి ఏ స్థాయిలో ఉందంటే.. బాబ్లీని మరిపిస్తూ.. శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్‌లో మరో డ్యామ్ కట్టాలనేంత! డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టడం ఏమిటన్న ఓ ఆంధ్రాప్రాంత అధికారి.. దాన్ని ఓ మతిలేని ప్రతిపాదనగా పేర్కొంటూ కొట్టిపారేశారు! కానీ.. సీమాంధ్ర నేతలు అటు నుంచి నరుక్కొచ్చారు. కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుని.. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్ వరకూ రోడ్డు వేసి.. మధ్యలో నందికొట్కూరు వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ వీయర్ కట్టాలని మరో ప్రతిపాదన తీసుకువచ్చారు. తద్వారా శ్రీశైలంలో నీళ్లు ఉన్నా లేకున్నా రాయలసీమకు మాత్రం ఎల్లప్పుడూ 50 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచుకునేలా పథకం వేశారు!


ఇప్పటికే పోతిడ్డిపాడు మొదలు.. అవుకు, గండికోట, చిత్రావతి, వెలిగోడు, బ్రహ్మంగారిమఠం, తెలుగుగంగ దాకా వందల టీఎంసీలు తరలించుకుపోతున్న సీమాంధ్ర పెద్దలు.. ఇప్పుడు మరో 50 టీఎంసీలకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్ పెట్టారు. మత్తడి నిర్మాణం జరిగితే.. అంతకు మించిన స్థాయిలోనే నీళ్లు తరలించుకుపోయే అవకాశం లేకపోలేదన్నది తెలంగాణ జల నిపుణుల వాదన!

కృష్ణా నదీ జలాలను అక్రమంగా దారి మళ్లించేందుకు ప్రభుత్వంలోని పెద్దలు మహాకుట్రకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా తెర వెనుక శక్తులు జాగ్రత్తలు తీసుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరకముందే వాటిని రాయలసీమకు తరలించడమే కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సమృద్ధిగా నీళ్లు తీసుకుంటున్నా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి హయాంలో ఈ కుట్రకు బీజం పడింది. 2007 జనవరి 1న సింగోటం లక్ష్మీనర్సింహ బ్రహ్మోత్సవాలకు వస్తూ పుట్టి మునిగిపోయిన ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఒక వంతెన కట్టాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సీమాంధ్ర పాలకులు.. వంతెన కాకుండా శ్రీశైలం డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టాలని తొలి ప్రయత్నం చేశారు.

తద్వారా నదిపై రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుంది.. పనిలోపనిగా నీటిని సీమాంధ్రకు తరలించుకుపోయేందుకూ వీలు కలుగుతుందని ఈ పథకం వేశారని విమర్శలున్నాయి. అయితే.. డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టాలన్న తొలి ప్రయత్నాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒకరు మతిలేని ప్రతిపాదనగా కొట్టిపారేశారు. మొదటి ప్రతిపాదన గురించి తెలిసిన అధికారులందరినీ బదిలీ చేసి కొత్త టీమ్ ద్వారా కుట్రను సాకారం చేసేందుకు రాయలసీమ బడానేతలు పావులు కదిపారు. ఈ ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. దీనికి ఆమోదం లభిస్తే.. తెలంగాణ,కృష్ణా డెల్టా పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తతంగానికి సంబంధించిన ఆధారాలను ‘టీ న్యూస్’ సేకరించింది.

ఈ మహా కుట్ర పూర్వాపరాలను పరిశీలిస్తే...


అసలు కధకు బీజం...
శ్రీశైలం డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టడం ద్వారా రాయలసీమకు 50 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని అప్పటి ఆత్మకూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి ప్రతాప్‌డ్డి 15-12-200న అప్పటి సీఎం వైఎస్‌కు వినతి పత్రం ఇచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ (డ్యామ్ వెనుక నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం)లో మరో డ్యామ్ కట్టడం ద్వారా శ్రీశైలానికి వచ్చే కృష్ణా జలాలను ముందుగా రాయలసీమలోని జిల్లాలకు తరలించుకోవటం ఈ ప్రతిపాదన వెనుక అసలు రహస్యం. ఈ వినతి పత్రంపై సీఎం స్పెషల్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు 26-12-200న 124/0 నెంబర్‌తో ఒక లేఖ వచ్చింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన దాస్, తగిన సిఫారసులను ఈఎన్‌సీ ఇరిగేషన్ ద్వారా పంపాలని శ్రీశైలం చీఫ్ ఇంజినీర్‌కు 2-1-2009న మెమో పంపారు.

ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో ఫైల్ పెండింగ్‌లో పడింది. మళ్లీ పెద్దలు రంగంలోకి వచ్చి, ఫైల్‌పై ఆరా తీశారు. రిట్మైంట్‌కు దగ్గర్లో ఉన్న అప్పటి శ్రీశైలం చీఫ్ ఇంజినీర్ కొన్ని సిఫారసులు చేశారు. కృష్ణా నీటిలో ఆదా అయిన వాటిని ఈ డ్యామ్ ద్వారా ఉపయోగించుకోవచ్చని, పోతిడ్డిపాడు మీద ఆధారపడిన ప్రాజెక్టులన్నింటికీ ఉపయోగపడే పద్ధతిలో దీన్ని క్యారీ ఓవర్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చని పేర్కొంటూ 21-5-2011న ఈఎన్‌సీ ఇరిగేషన్‌కు లేఖ రాశారు. ఈ రికమండేషన్ చేసిన సదరు చీఫ్ ఇంజినీర్‌కు ఈఎన్‌సీగా పదోన్నతి లభించింది. ఈ ప్రతిపాదనను ఆంధ్ర ప్రాంతానికి చెందిన అప్పటి ఈఎన్‌సీ బీఎస్‌ఎన్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తూ ‘ఒక డ్యామ్‌లో ఇంకో డ్యామ్ కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ప్రతిపాదన మతిలేని వారు (అన్‌మైండ్‌ఫుల్) చేసేది’ అని నోట్ రాసి దాస్‌కు 2-6-11నలేఖ రాశారు. ఇదే విషయాన్ని మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి దాస్ అనఫీషియల్(యూవో)నోట్ రాశారు. అలా.. కృష్ణా జలాల అక్రమ తరలింపునకు తొలి యత్నం ఆగిపోయింది.

రెండో సారి బ్రిడ్జి లాంటి బ్యారేజీ ప్రతిపాదన
డ్యామ్‌లో డ్యామ్ కట్టడం అన్న విషయంలో వివాదం తలెత్తే అవకాశముందని భావించి ఈసారి హైదరాబాద్ టు ఆత్మకూర్ రోడ్డు నిర్మాణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గతంలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రస్తావించారు. దూరాభారం తగ్గిపోతుందని చెప్పారు. ఇక్కడే మళ్లీ ‘మహాకుట్ర’కు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్ వెళ్లాలంటే కర్నూలు జిల్లా నందికొట్కూరు వద్ద కృష్ణా నది పారుతూ ఉంటుంది. అక్కడ ‘సిద్ధేశ్వర్ వీయర్ కమ్ బ్రిడ్జి’ నిర్మించడానికి అవసరమైన డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు పంపాలని కర్నూలు చీఫ్ ఇంజినీర్‌కు ప్రభుత్వం నుంచి 10-3-2011న లేఖ వెళ్లింది. సిద్ధేశ్వరం దగ్గర వీయర్ వల్ల కలిగే లాభాలను పేర్కొంటూ చీఫ్ ఇంజినీర్, ఈఎన్‌సీ కమిటీకి లేఖ రాశారు.

ఆయకట్టుకి నికర జలాలు ఇవ్వగలుగుతాం, తాగునీరు ఇవ్వచ్చు, శ్రీశైలం వరద నియంత్రణ సులభం అవుతుంది, కర్నూల్-మహబూబ్‌నగర్ మధ్య దూరం తగ్గుతుంది, బ్రిడ్జి వల్ల 50 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు, ఇదంతా కేవలం రూ.300 కోట్లతో చేసుకోవచ్చు.. అని అందులో పేర్కొన్నారు. చీఫ్ రికమండేషన్స్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ కమిటీ శ్రీశైలం అటువైపు నీటి నిల్వ సామర్ధ్యం పెద్దగా లేదని, గోరకల్లు, వెలిగోడు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కారణంగా ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చని సిఫారసు చేస్తూ 3--11న తిరిగి చీఫ్ ఇంజినీర్‌కు పంపగా, ఆయన 3-9-11న ప్రభుత్వ కార్యదర్శికి నివేదించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధం ఉంది. ఈ సిఫారసులు చేసిన కమిటీకి ఎంకే రహమాన్ (ఈఎన్‌సీ, పరిపాలన) చైర్మన్ కన్వీనర్ కాగా, పీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం (ఈఎన్‌సీ, మీడియం ఇరిగేషన్), సీ మురళీధర్ (ఈఎన్‌సీ ఇరిగేషన్), కే జలందర్ (సీఈ కర్నూలు), ఎం సాంబమూర్తి (డైక్టర్ డబ్ల్యూఅండ్‌పీ) సభ్యులుగా సంతకాలు చేశారు.

మొదటి ప్రయత్నాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈఎన్‌సీ అడ్డుకోగా, రెండో ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కమిటీలో మురళీధర్ తెలంగాణ ప్రాంత అధికారి కావడం గమనార్హం. ఈయన తెలంగాణకు చెందినప్పటికీ వ్యతిరేకించ కపోవడంపై అనుమానాలున్నాయి. సంతకం చేసిన మరో ఇద్దరు ఈఎన్‌సీలకు పదవీ విరమణ తర్వాత లబ్ధికి హామీ లభించి ఉండవచ్చనే అభివూపాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

అసలు రహస్యం...
సిద్ధేశ్వరం వద్ద బ్రిడ్జి పేరుతో వీయర్ (మత్తడి) ద్వారా సుమారు 50 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు. శ్రీశైలంలోకి నీళ్లు వెళ్లే మార్గంలోనే (నందికొట్కూరు వద్ద కృష్ణా నది బాగా సన్నగా వెళుతుంది) ఈ వీయర్ నిర్మాణం జరిగితే ఇది నిండిన తర్వాత రిజర్వాయర్‌లోకి నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలానికి అటు వైపు కేవలం గోరకల్లు, వెలిగోడు రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయన్న విషయంలోను వాస్తవం లేదు. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్లే శ్రీశైలం కుడి కాలువపై (ఆర్‌ఆర్‌బీసీ) గోరకల్లు (13.5 టీఎంసీ), అవుకు (5 టీఎంసీ), గండికోట (10 టీఎంసీ), చిత్రావతి (10 టీఎంసీ) ఉండగా, తెలుగుగంగ కాలువపై వెలిగోడు (17 టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (16.5 టీఎంసీలు), సోమశిల (7 టీఎంసీలు), కండలేరు (6 టీఎంసీలు) ఉన్నాయి. తెలుగుగంగ ద్వారా సుమారు 10 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీ ద్వారా మరో 50 టీఎంసీల వరకు అందుతున్నాయి.

ఇవన్నీ ఉండగా మళ్లీ మరో 50 టీఎంసీల పేరుతో కృష్ణా నదీ జలాలకు గండికొట్టే ప్రయత్నం జరుగుతోంది. పేరుకి పైకి 50 టీఎంసీలు అని చెబుతున్నా, వీయర్ నిర్మాణం పూర్తయితే ఇంకా ఎక్కువ నీళ్లు తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాకముందే సిద్ధేశ్వరం వద్ద ఈ వీయర్ కమ్ బ్రిడ్జి, మరోవైపు పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లిన తర్వాత తెలంగాణ, కృష్ణా డెల్టాలకు సాగునీరు అందుతుందన్నమాట. పోతిడ్డిపాడుతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా ఈ వీయర్‌లో 50 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రతిపాదనను గతంలో కార్యదర్శిగా ఉన్న దాస్ (తెలంగాణ), ఈఎన్‌సీ బీఎస్‌ఎన్ రెడ్డి (ఆంధ్రా) వ్యతిరేకించగా, వారి స్థానంలో రాయలసీమ వ్యక్తిని కార్యదర్శిగా నియమించుకుని ప్రభుత్వం రెండో ప్రతిపాదనను ముందుకు నడిపించిందన్న విమర్శలు ఉన్నాయి.


పోతిడ్డిపాడు కథ...
చెన్నైకి కృష్ణా జలాలను పంపే ఉద్దేశంతో పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలు దానం చేశాయి. కానీ దీని మధ్యలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు వెలిశాయి. సీఎంలుగా పని చేసిన సీమ నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర జల సంఘం నుంచి మరో 19 టీఎంసీల అనుమతి తెచ్చుకున్నారు. పోతిడ్డిపాడు మొత్తం సామర్థ్యం 11,500 క్యూసెక్కులుగా ఉండగా, వైఎస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇందుకోసం అంతకు ముందున్న 4స్లూయిస్‌లకు (డ్యామ్ నుంచి నీళ్లు వచ్చేందుకు) అదనంగా మరో పది స్లూయిస్‌లు నిర్మించారు.

దీనితో మొత్తం 14 స్లూయిస్‌లు అయ్యాయి. ఒక్కో స్లూయిస్ నుంచి 3.5వేల క్యూసెక్కుల నీళ్లు వెళతాయని పైకి చెప్పినప్పటికీ, కనీసం 5వేల క్యూసెక్కులు వెళుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 14 స్లూయిస్‌ల ద్వారా 70,000 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. పైకి మాత్రం 44,000లకు మాత్రమే పెంచామని ప్రభుత్వం సమర్థించుకుంది. పోతిడ్డిపాడుకు నీళ్లు వెళ్లాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 41 అడుగులకు చేరాలి. అయితే వైఎస్ వచ్చిన తర్వాత మినిమం డ్రా డౌన్ లెవల్‌ను 54కి పెంచుతూ ప్రత్యేక జీవో జారీ చేశారు.

తీరని దాహార్తి....

  • పోతిడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు లైనింగ్ చేస్తే కాల్వ సామర్ధ్యం పెరుగుతుంది. అప్పుడు 1,30,000 క్యూసెక్కులు వెళ్లే ఆస్కారం ఉంది. రోజూ 11 టీఎంసీలు కాలువ ద్వారా పంపినా 30 వరద రోజుల్లో 330 టీఎంసీలు పంపొచ్చని లెక్కలు చెబుతున్నాయి. శ్రీశైలం వరదలప్పుడు ఇది నిరూపితమైందని అధికారులంటున్నారు. 
  • ఒక టీఎంసీ సామర్ధ్యంతో వెలిగొండ ప్రాజెక్టు పేరు చెప్పి శ్రీశైలం నుంచి 1 కిలోమీటర్లు టన్నల్ ద్వారా నీళ్లు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ రిజర్వాయర్ సామర్థ్యం మాత్రం 45 టీఎంసీలతో జరుగుతుండడం విశేషం.
  • మరో వైపు పోతిడ్డిపాడుకి ముందే హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు కేటాయించుకున్నారు. 
  • పోతిడ్డిపాడు వద్ద హైడల్ పవర్ స్టేషన్ ఉంది. దానికి కేటాయించిన 5 వేల క్యూసెక్కులను అవుట్‌పుట్ ద్వారా ఆర్‌ఆర్‌బీసీకి వదులుతున్నారు.

No comments:

Post a Comment