Sunday, November 25, 2012

ద్రోహ పర్వం



ఒక వైపు తెలంగాణా ప్రజలు భగభగ మండుతుంటే వాళ్ళు హంద్రీ-నీవా విజయ యాత్రలు చేసుకుంటున్నరు  తెలంగాణకు రావలసిన నికర జలాలపై కట్టవలసిన ప్రాజెక్టులకు ఎగనామం పెట్టి, వరదనీరు వాడుకునే పేరు చెప్పుకొని ఈ ప్రాజెక్టు కట్టుకున్నరు. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు కూడా కృష్ణా జలాలు ఇవ్వకుండా, దీనికి నలబై TMCల నీళ్ళు వదిలిన్రు. తెలంగాణా నీళ్ళను దోపిడీ చేసి తమవైపుకు తిప్పుకుని దర్జాగా వాడుకునుడు వాళ్ళ దృష్టిలో ఒక విజయ యాత్ర. కాని ఆ యాత్రల పొన్నాల, సునీత, అరుణ పాల్గొనుడు తెలంగాణా రొమ్ము మీద తన్నుడుతోటి సమానం. తెలంగాణా ప్రజలారా, వీళ్ళు చేస్తున్న నమ్మక ద్రోహాలను ఎన్నటికీ మరువొద్దు.

ఒక వైపు కాంగ్రేసు విజయ యాత్ర ఇట్ల వుంటే, ఇంకో వైపునుండి చంద్రబాబు దండయాత్ర చేయ బట్టిండు. గాయిన అదికారంల ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు తోటి హాట్ లైన్ పెట్టుకొని, వాళ్ళు చెప్పినట్టు ఆడిండు, సబ్సిడీలు దండుగ అని చెప్పి పుస్తకాలు కూడా రాసిండు. ఇప్పుడేమో అప్పుడు చేసిన పనులకు విరుద్ధంగా అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నడు.  KG నుండి PG వరకు ఫ్రీగా చదువు చెప్పిస్త నంటున్నడు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తూ, రుణాల మాఫీ, ఉచిత వైద్యం, నేరుగా డబ్బులు, నిరుద్యోగ భ్రుతులు... ఒకటేమిటి, అన్నీ చేస్త నంటుండు.

2004ల సాధ్యం కాని పనులు ఇప్పుడ గూడ సాధ్యం కావని ఆయనకు తెలుసు. మరి ఆయినా గట్ల ఎందుకు చెప్తున్నడు? అధికారం కోసం. అధికారం కోసం ఎన్ని అబద్దాలైన చెప్పడం ఆయనకు పాత అలవాటే. మరి గిన్ని అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇస్తనని ఇంకొక అబద్ధం ఎందుకు చెప్తలేడు? ఇన్ని అబద్దాలతోని ఇంకొక్కటి ఎక్కువ చెప్తే ఏంది, చెప్పలేడా... అని మనకు అనిపించ వచ్చు. కాని గా మాట చెప్తే సీమాంధ్రల కథ అడ్డం తిరుగుతది అని ఆయన భయం. అందుకే చెప్పడు. మరి సీమాంధ్ర జనానికి వ్యతిరేకంగ ఒక మాట చెప్పడానికే దడుసుకునే వానికి ఊడిగం చేసుడు లోని ఔచితత్యం ఏందో తెలంగాణా లోని తెలుగు తమ్ముళ్ళు ఆలోచించు కోవాలె. లేక పొతే వాళ్ళు గూడ చంద్రబాబు లెక్క చరిత్ర హీనులు అవుతరు.

చంద్రబాబు పని ఇట్లా వుంటే మందకృష్ణ లాంటి దళిత నేతలు ఆంద్రజ్యోతి రాధాకృష్ణ బాడుగ మాటల్ని నిజం చేస్తున్నరు. వీళ్ళ మనసులు మార్చేతందుకు చంద్రబాబు అంత గొప్ప దేవదూత ఎప్పుడైండో ఎవరికీ అర్థంగాని విషయం గాదు. ఆయినా అధికారం లోనికి వస్తే, SCకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని అనలేదు, పోనీ ఇప్పుడన్నా ఇంకేదైనా ముఖ్యమైన పదవి ఇస్తానని చెప్పలేదు. మరి అందరూ ఒప్పుకున్నా ABCDలు ఆయన ఒప్పుకున్నందుకే అంతటి చంద్ర మర్యాదలా? దీని వెనుక ఉన్న బాడుగలు ఏంటివో పెరుమాండ్ల కెరుక.     

ఇంక పొతే  ఇంకొకామె రాయలసీమ గూండాలను వెంట తెచ్చుకొని మరొక ప్రస్థానం చేస్తుంది. తెలంగాణా ఏర్పడితే వీసాలు తెచ్చుకోవాలి అని ప్రచారం చేసిన మనిషి, తెలంగాణాకు వ్యతిరెంకంగా పార్లమెంటులో ప్లకార్డు పట్టుకొని పరుగెత్తిన మనిషి తెలంగాణా ఆత్మా బంధువులని విషప్రచారం చేస్తుంది. ఈ రాజన్న, చంద్రన్న అసలు రూపాలు తెలంగాణా ప్రజలు ఇంకా మరిచి పోలేదు. ఒకడు తెలంగాణా పాలిత సైంధవ పాత్ర వహిస్తే, ఇంకొకడు శకుని పాత్ర వహించిన విధానం ఇంకా తెలంగాణా ప్రజల మదులల్ల మెదులుతనే వుంది.

No comments:

Post a Comment