Sunday, November 25, 2012

తెలంగాణా సమరభేరి

సూర్యాపేటలో తెలంగాణా సమరభేరి దద్దరిల్లింది. గత కొన్ని నెలలుగా స్తబ్దంగా వున్నా తెరాస క్యాడర్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తినట్టు స్పష్టంగా కనిపించింది.

ఈ సభ ముఖ్య అజెండా... నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ, తెలంగాణా ఉద్యమానికి వెన్ను పోట్లు పొడుస్తూ, ఇంకోవైపు జగన్ పార్టీ వైపు మోరలేత్తే విధానాలను ఎండగట్టడం. అలాగే పాదయాత్రల పేరుతో దండయాత్రలు చేస్తూ తెలంగాణా ప్రజలను మభ్యపెట్టే వైకాపా, తెదేపాల ఎత్తులను చిత్తు చేయడం.

దేశపతి శ్రీనివాస్, స్వామీ గౌడ్ ల ఉపన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. యధా ప్రకారం కెసిఆర్ ఉపన్యాసం సభికులను ఉద్యోన్ముఖులుగా ఉత్సాహ పరుస్తూ, ప్రత్యర్థుల కుట్రలపై ప్రజలకు సులభ శైలిలో అవగాహన కలిగించింది. తనకే సాధ్యమైన రీతిలో ఆయన జనాన్ని ఆకట్టుకున్నారు.

ఒకాయిన చంద్రన్న రాజ్యం రావాలె అంటడు... ఇంకొకాయన రాజన్న రాజ్యం కావాలంటడు. మనకు ఏ రాజ్యం రావాలే? మనకు కావాలె తెలంగాణా రాజ్యం. తెలంగాణా రాజ్యం కావాలన్నోల్లు చేతులెత్తండి.

(అందరూ చెయ్యెత్తారు)

చంద్రబాబు విశ్వాసనీయత ఉండాలే అంటున్నడు. ఎన్నికల ముందు తెలంగాణా ఇస్తనని వాగ్దానం చేసి, తీరా అది ప్రకటించగానే అడ్డుకోవడం విశ్వసనీయతా? చంద్రబాబుకు విశ్వసనీయత అంటే అర్థం తెలువదు. సింగపూర్ లోనో, హెరిటేజ్ మాల్ లోనో కొంటే వచ్చేది కాదు విశ్వసనీయత.  

ఇలా సాగింది ఆయన ఉపన్యాసం.

ఇంకా దేశపతి శ్రీనివాస్ జగన్ ఫాలోవర్లను 'జఫా'లు గా వర్ణించడం జనాన్ని ఆకట్టుకుంది.


   

1 comment:

  1. some callers questioned on tnews live program that Tnews not available online

    please check this site to view Tnews....
    http://www.yupptv.com/t_news_live.html

    ReplyDelete