Tuesday, October 23, 2012

రాంబాబుని మించిన బాబులు



వలస వాదుల బలహీనత ఎట్ల వుంటదో రాంబాబు సినిమా తోటి బయట పడ్డది. ఇదే రాంబాబు సీనిమాల సీన్లను కట్ చేయించుడు కోసం తెలంగాణా బందు చేసినా, సకల జనుల సమ్మె చేసినా, ఇంకో మిలియన్ మార్చి చేసినా, మల్లొక సకలజనుల సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం గాని, సినిమా యాజమాన్యం గాని దిగోచ్చేవి కావు. బందులు చేస్తే, సమ్మెలు చేస్తే వాళ్ళ కడుపులే మాడుతయి, ఇదీ మన సమేక్కుడు ప్రభుత్వాలా ఆలోచన.

వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనప్పుడు మనం ప్రజాస్వామ్య యుతంగ ఎన్ని నిరసనలు తెలిపినా, అది చెవులకు సంగీతం వినిపించినట్టే వుంటది. వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్నంటే రాంబాబు మార్కు ట్రీట్ మెంటే సరైనది. ఒక్క రోజు థియేటర్లకు తాళం పడంగనే దెబ్బకు దయ్యం దిగోచ్చినట్టయింది. ఒక్కొక్కడు అడుగక ముందే క్షమాపణలు చెప్పుడు శురూ చేసిన్రు. వాళ్ళంతా వాళ్ళే సినిమాను సెన్సారు చేసుడు మొదలు వెట్టిన్రు. కుంభకర్ణుని లెక్క నిద్ర బొయ్యే రాష్ట్ర ప్రభుత్వం దిగ్గున లేచి APSFTDC తోటి కమిటీ ఏసి మరో మూడు నాలుగు కోతలు పెట్టింది.

గిదంత చూస్తుంటే ఏమనిపిస్తుంది? వీళ్ళకు మాటలతోటి కాదు, చేతల తోటి సమాదానమియ్యలె అనిపిస్త లేదూ? సంగీతానికి చింతకాయలు రాలనట్టే, మెక్కుడు మరిగిన వలసవాదులు ఉత్తగనే పోరు. తేరగ తినేటోన్ని, 'రేపన్నించి కష్టపడి పనిచెయ్యర బాబు' అంటే ఇంటడా? సెగ తగిలిస్తే గని పొయ్యిల కూసున్న పిల్లి బయటికి లేవదు. ఒక్క పూరీ జగన్నాధ్ సినిమా తోనే అయిపోలేదు. పూరీని మించిన మహమ్మద్ ఘోరీలు ఇక్కడనే ఉన్నరు. మన నెత్తిమీది కెక్కి ఊరేగు తున్నరు.


ఏ సెగ తగులకుంటే, తెలంగాణా వనరులను తినుకుంట ఇరుగ బలిసిన లగడపాటికి ఉస్మానియా యూనివర్సిటీని మూసెయ్యాల్నని అనిపిస్తది. అందుకే సెగ తగిలిస్తానే ఉండాలే. ఉస్మానియా మూయించాలే ననుకుంట అవాకులు పేలిన లగడపాటి కబ్జా ఆస్తులను ఎందుకు మూయించ కూడదు? సెగ ఎక్కువై ఒక్కొక్క బందిపోటు తెలంగాణా పొలిమేరలు దాటి పారి పోయ్యేదాంక కాక తగులుతనే ఉండాలే. మనం రూపొందించే ఉద్యమరూపాలు కూడా అట్లనే ఉండాలే. గాంధీ లాంటోడే దోపిడీ దారుల ఆధిపత్యాన్ని దెబ్బతీసే టందుకు విదేశీ బహిష్కరణ చేసిండు. ఇప్పుడు మనం స్వదేశీ దోపిడీ దారుల ఆస్తులను ముట్టడిస్తే చాలు, తట్ట బుట్ట వాళ్ళే సర్దుకుంటరు.

ఒక లాంకో హిల్స్, ఒక రామోజీ సిటీ... ఇట్లా ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకున్తున్నడో మొత్తం బయటకు తియ్యాలే. దీనికోసం Right to information act ను కూడా ఉపయోగించు కోవాలె. ఒకవైపు సమాచారం, రెండొక వైపు ప్రచారం, మూడొక వైపు ప్రత్యక్ష కార్యాచరణ... ఈ త్రిసూత్ర ప్రణాళిక అమలు పరచాలె. పొలాన్ని కబళిస్తున్న పంది కొక్కులను తరుమాల్నంటే ఊపిరాడ కుండ పొగబెట్టి నట్టు, ఈ సీమాంధ్ర దోపిడీ దారులకు కాళ్ళు చేతులు ఆడకుండా చేస్తే చాలు, తెలంగాణా దానంతట అదే ఉరుకోస్తది.



No comments:

Post a Comment