Sunday, May 29, 2011

మేక తోలు కప్పుకున్నతోడేండ్లు

ఆంద్రబాబు తన విశాలహృదయాన్ని ఉద్వేగం తోటి ఆవిష్కరించిండు. ఆంధ్రల, తెలంగాణాల తన పార్టీ ఉన్నది కాబట్టి (తెలంగాణాల ఎక్కడ ఉన్నది?) అక్కడ ఇక్కద ఉద్యమాలు చేయిస్తా నంటున్నడు. రెండు దిక్కుల తన పార్టీ ఉన్నది కాబట్టి ఒక్కదిక్కు మాట్లాడ లేనంటున్నడు.

రెండు దిక్కుల పార్టీ ఉన్నప్పుడు, ఈ సమస్యకు పరిష్కారం చెప్పుడు చాతగానప్పుడు తటస్థంగ ఉండాలె సీపీయం లెక్క. మరి ఆంద్రబాబు అట్ల ఉంటున్నడా? ఉంటలేడు. 

ఆయన కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తడు. ఆంధ్రా తెలుగుదేశం నాయకుల తోటి దొంగ ఉద్యమాలు చేయిస్తడు. డిసెంబరు పది తర్వాత చేసిన దొంగ ఉద్యమ నాయకుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోక పోవుడే దానికి సాక్ష్యం.

అంతే కాదు, తెలంగాణా నాయకులు తెలంగాణా పాలసీ గురించి ప్రకటించమని అడిగిన పాపానికి వాళ్ళను పార్టీనించి సస్పెండు చేస్తున్నడు. నాగమే దానికి సాక్ష్యం. ఆంధ్రా నాయకులు పోటీ ఉద్యమాలు నడిపిస్తే పార్టీకి ఏం గాదట! తెలంగాణా నాయకులు తెలంగాణా మీద పార్టీ స్టాండు ఏందో అడిగితె మాత్రం పార్టీకి నష్టమై పోతదట! 

సరే స్టాండు చెప్పుడు ఇష్టం లేదు. అయిన పరిస్థిని అర్థం చేసుకుందాం. మరి అప్పుడు తెలంగాణాల గాని, ఆంద్రాల గాని న్యూట్రల్ గ ఉండాలే. అటువంటప్పుడు తెలంగాణా ఫోరం పెట్టి పార్టీ జెండా తోని సభలు, పాదయాత్రలు ఎందుకు నిర్వహించాలె? స్టాండే లేనోనికి సభలెందుకు, సమావేశాలెందుకు, ఉద్యమాలెందుకు, దొంగేశాలెందుకు? తన స్టాండు ఏందో తెల్వనోడు ఎక్కడనన్న ఉద్యమాలు చేస్తడా? 

ఆంద్రాల దొంగ ఉద్యమాలు చేసినట్టు, ఇక్కడ గూడ తన చెంచాల తోటి దొంగఉద్యమం చేయిద్దమని ఆయన కోరిక. కాని అక్కడి పరిస్థితి వేరు, ఇక్కడి పరిస్థితి వేరు. ఇక్కడ నిఖార్సైన ఉద్యమం ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తున్నది. తెలంగాణా ముసుగు కప్పుకున్న సమైక్యవాదులు మేక తోలు కప్పుకున్న తొడేన్ల లెక్క వచ్చి మండల కలుస్తామంటే కుదిరే పని కాదు. తోడేండ్లు మేకలకు దూరంగా ఉండవలసిందే. ఎంత మేక తోలు కప్పుకున్నా, మేకలు వాటిని తమతోటి కలువ నియ్యవు. 

No comments:

Post a Comment