Saturday, September 28, 2013

కిరణ్ ఒక ట్రోజన్ హార్సా?


నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రంతో ఆడిన భీభత్సమైన క్రికెట్ మ్యాచ్ చూస్తే విస్తుపోవుడు విఫక్షాల వంతైంది. వరల్డ్ లో టాప్ ర్యాంక్ పేసర్ గల్లీ పోరనికి బౌలింగ్ చేస్తె వాని బ్యాటింగ్ ఎట్ల వుంటది? గట్లనే అనిపిచ్చింది కిరణ్ ఆట. గాయిన ఇదివరకు లీగు మ్యాచులన్న ఆడిండు గద? మరీ గంత అధ్వానంగ బ్యాటింగు చేసిండేంది అని అందరికి మస్తు డౌట్లు వస్తున్నయట.

ఒక్క తీర్గ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంట గీయన సాధించ గలిగేది ఏంది? అని పరేషానైపోతున్రు అపోజిషనోల్లు. ప్రెస్సోల్లేమొ, గీన కాంగ్రేస్ నుంచి బయటికొచ్చి కొత్త పార్టీ పెట్టి సీమాంధ్రల గెలువాలె నని చూస్తున్నడు... అంటరు. కాని స్వశక్తి తోని తన సొంత మండలంల గూడ గెలువలేనోడు, పార్టీ ఎక్కడికెల్ల పెట్టబొయిండు? అని చాన మంది ఆలోచన.

ప్రెస్ మీట్ల గీయన తరీక చూస్తె సీమాంధ్ర గల్లీ స్థాయి నాయకుని లెక్క మాట్లాడినట్టు కనిపిచ్చింది గని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెక్క కాదు. పైనించి దిగ్విజయ్ సింఘ్ మీద గూడ సెటైర్లు వెయ్యబట్టిండు, సీమాంధ్ర ప్రజల మెప్పు పొందెటందుకు! మరి గదే సోనియా గాంధి మీద మాట్రం ఒక్క మాట గూడ మాట్లాడలేదు. పైనించి తన పదవి ఆ మాత పుణ్యమే అని చెప్పుకుండు.

ఇంకొక దిక్కేమో జగన్ జైల్లకెల్లి బయటికొచ్చిండు. గా జగన్ని సీమాంధ్రలకు కాంగ్రేసే ఒదిలిందని అందరు జెప్పుకునే మాట! మరి కాంగ్రెస్ జగన్ని ఏజంటుగ పెట్టుకున్నప్పుడు అధిష్టానానికి విధేయుడైన కిరణ్ గాయినకే సైడియ్యాలె గద? మరి సీమాంధ్ర సెంటర్ స్టేజికి రావాలెనని ఏందుకు ప్రయతిస్తున్నడు?

గియ్యన్ని చూస్తుంటె కాంగ్రెస్ సీమాంధ్రలకు ఒక్క ఏజెంటును కాదు, ఇద్దరు ఏజెంట్లను వదులుతున్నదని అర్థమైతంది. జగన్ అప్పుడే జైల్లకెల్లి బయటికి వచ్చి ఒకవైపునుండి దున్నుతున్నడు. ఇంక కిరణ్ గూడ బయటికి వచ్చి సీమాంధ్ర హీరోలెక్క పోజు పెట్టేటందుకు సిద్ధమైతుండు. ఇంత పెట్రేగి పోయినా అధిష్టానం సప్పుడు జేస్తలేదంటె గదే నిజమని అనిపిస్తంది.

రాష్ట్రాన్ని విభజించి TRSని తెలంగాణల కలుపుకోవాలె ననేది కాంగ్రేస్ ప్లాన్ లెక్క కనపడుతంది. గప్పుడు తెలంగాణల గెలవడం నల్లేరు మీది నడక. జగన్ని, కిరణ్ణి సీమాంధ్ర మీదకు వదులాలె. జగన్ సొంత పార్టీ తోని పోటీ చేస్తడు. కిరణ్ నాయకత్వంల సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ నుంచి గాని, కొత్త పార్టీ పెట్టి గాని పోటీ చేస్తరు.

రేపు సీమాంధ్రల ప్రజలముందుకు వెళ్ళెటందుకు ముఖ్యమంత్రి నాయకత్వంల సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నరు. నలుగురు ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవడం దానికి నాంది. తర్వాత సీయం, మంత్రులు, మార్బలం కూడా రాజీనామాలు చేస్తరని అనుకోవచ్చు. లేక పోతే, కోపం చేసినట్టు నటించి అధిష్టానమే కిరణ్ణి పీక వచ్చు. గట్ల జేస్తె మరింత మైలేజీ వస్తది.

ఈవిధంగ కాంగ్రెస్ సీమాంధ్రల కిరణ్‌కి, జగన్‌కి పోటి పెట్టింది. పోటీల ఎవడు గెలిస్తె వాడే సీయం. రాజ్యం వీర భోజ్యం అన్నట్టు! మొత్తానికి కాంగ్రేస్ ఆడుతున్న ఈ గేముల చంద్రబాబుకు చిప్ప మిగిలే పరిస్థితి కండ్లవడుతంది!

No comments:

Post a Comment