Friday, January 18, 2013

కాంగ్రెస్ పురిటి నొప్పులు


కాంగ్రెస్ పార్టీ తెలంగాణా మీద నిర్ణయం తీసుకోవడానికి పురిటి నొప్పులు పడుతున్నట్టు తెలుస్తుంది. మిన్ను విరిగి మీద పడితే కాని నిర్ణయాలు తీసుకొని ఆ పార్టీకి ఇప్పుడు నిజంగానే ఆ పరిస్థితి వచ్చిందా?

కాంగ్రెస్ ప్రజాభీష్టం మేరకు కాక, తన ప్రయోజనాల ప్రాతిపదిక మీద మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందన్న విషయం జగమెరిగిన సత్యం. మరి ఆ నిర్ణయం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.

తెలంగాణా ఇవ్వకుండా దాటవేస్తే...

మరికొన్నాళ్ళు దాట వేయడానికి ప్రయత్నించవచ్చు. 2014 ఎన్నికల్లోగా తెలంగాణా ఇవ్వకపోతే అది తెలంగాణా ప్రాంతంలో తుడిచి పెట్టుకొని పోతుంది. ఆ విధంగా చేసినందుకు దానికి ఆంధ్ర ప్రాంతంలో కలిసొచ్చే దేమీ వుండదు. జగన్ ప్రభంజనంలో అక్కడ మార్పు ఉండదు.

తెలంగాణా ఇవ్వము అని కరాఖండీగా చెప్తే...

తెలంగాణా ఉద్యమం హింసాయుతం అయ్యే అవకాశం వుంది. పరిస్థితి BJP కి అనుకూలం అయ్యే అవకాశం వుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు తెలంగాణా ఇవ్వ వలసిన అనివార్య పరిస్థితులు ఎదురు కావచ్చు. అప్పుడు తెలంగాణా ఇచ్చినా ఉపయోగం వుండదు.

TRS, BJP ఒక్కటవుతాయి. తెలంగాణలో 19 ఎంపీ సీట్లు అవి క్లీన్ స్వీప్ చేస్తాయి. అనవసరం గా ప్రత్యర్ధి BJP కి సీట్లు పెంచినట్టు అవుతుంది. ఆంధ్రలో ఒరిగేది ఏమీ వుండదు. జగన్ ప్రభావం యధావిధిగా వుంటుంది. చంద్రబాబు కూడా పుంజుకునే అవకాశం వుంది. గత ఉప ఎన్నికల్లో సమైక్య వాదాన్ని ప్రచారం చేసుకున్నా కాంగ్రెస్ పెద్దగా సాధించిందేమీ లేదన్న విషయం గమనించాలి.

తెలంగాణా ఇస్తే...

TRS విలీనమయ్యే అవకాశం, తద్వారా తెలంగాణలో 19కి 19 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం (మారిన MIM రాజకీయాల వల్ల). ఆంద్ర పరిస్థితి యధావిధి.

ఈ నెలాఖరు లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇవ్వము అని చెప్పడం, దాటవేయడం కాన్నా ఆత్మహత్యా సదృశం. కాబట్టి ప్రకటన అంటూ ఇస్తే ఇవ్వదానికిఅఎ మొగ్గు చూపే అవకాశం వుంది.

హైదరాబాదు సమస్య.

తెలంగాణా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ ఆంద్ర సీట్లపై ఆశ వదులుకునే వుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రను మెప్పించడం కన్నా తెలంగాణా ప్రజలను మెప్పించడం దానికి అవసరం. లేక పొతే తెలంగాణా ఇచ్చినా పెద్దగా రాజకీయ ప్రయోజనం లభించదు. ఉద్యమం చల్లారదు. కాబట్టి తప్పని సరిగా తెలంగాణా ప్రజల ఆకాంక్షల మేరకు హైదరాబాదు, పది జిల్లాలతో కూడిన తెలంగాణా మాత్రమె ఇవ్వ వలసిన పరిస్థితి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో తెలంగాణా ప్రజలు, JACలు నిరంతరం అప్రమత్తంగా ఉండ వలసిన అవసరం వుంది. ప్రజాభీష్టం తెలంగాణా వైపు ఉన్నా, పెట్టుబడి దారుల ఆలోచనలు విరుద్ధంగా ఉండడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా పరిస్థితులు తారుమారు అయ్యే పరిస్థితి ఉంది. 

1 comment: