Sunday, January 27, 2013

ఉండవల్లి అరుపులకు కారణాలేమిటి?




ఉండవల్లి జై ఆంధ్ర ఉద్యమానికి నలభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా రాజమండ్రిలొ ఒక మీటింగు పెట్టాడు. దానికి జై ఆంధ్ర అని కాకుండా జై ఆంధ్ర ప్రదేశ్ అని పేరు పెట్టినప్పుడే దాని దివాళాఖోరు తనం అర్థమయ్యింది. ఇక ఆయన జై ఆంధ్ర ఉద్యమ వివరాలను చెప్పకుండా దాటవేసి, వేదికను తెలంగాణాను తిట్టడానికి వాడుకున్నాడు. తెలంగాణా వాదులను రజాకార్లతో పోలుస్తూ, అన్యాపదేశంగా వారికీ రజాకార్ల గతే పడుతుందని బెదిరింపులకు దిగాడు. నిజానికి, ఒకప్పుడు తెలంగాణా ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షకు  కాశీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డు పడ్డట్టే, ఇప్పుడు సీమాంధ్ర పెత్తందార్లు లగడపాటి నాయకత్వంలో అడ్డు పడుతున్న విషయం పరిశీలిస్తే ఎవరు రజాకార్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఉండవల్లి అరుణ్ కుమార్, మధ్యే వాదిగా పేరుపడ్డ వాడు. అంతో ఇంతో తర్కం ఉపయోగించి మాట్లాడే వానిగా పేరు పొందాడు. ఇదివరలో ఎప్పుడూ తెలంగాణా ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పుడప్పుడూ కరడు గట్టిన సమైక్య వాదులను మందలించిన సందర్భాలూ చూశాం. మరి ఇప్పుడు హటాత్తుగా తెలంగాణా వాదులపై విరుచుకు పడడానికి కారణమేమిటి?

ఈ విషయం తెలుసు కొవాలంటే మొదట ఉండవల్లి ఎవరో తెలుసుకోవాలి. ఆయన పెద్దగా ప్రజాబలం లేని, తెలివితేటలే పెట్టుబడిగా కలిగిన రాజకీయ వేత్త. సోనియా గాంధీ ఉపన్యాసాలు అనువదించడం ద్వారా ప్రచారం పొందాడు. సోనియా గాంధీకి వీర విధేయతతో పదవులు పొందేవాడు. సోనియా అనుఙ్ఞ లేకుండా నోరు తెరిచి ఆవులించడానికి కూడా వెనుకాడే వాడు. మరి అలాంటి వాడు ఎందుకు రాజమండ్రిలో అదీ తెలంగాణా పై కేంద్రం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇలా తన నిజ స్వభావానికి విరుద్ధంగా మూర్ఖ వాదనలకు దిగాడు?

ఇదంతా చూస్తే సోనియా అనుమతి లేకుండా ఉండవల్లి ఇలా పెట్రేగడం ఊహించలేం. కచ్చితంగా రాజమండ్రి సమావేశం సోనియా దర్శకత్వం లోనే జరిగిందని భావించ వలసి వస్తుంది. మరి జనవరి 28న నిర్ణయం తీసుకోవలసిన సమయంలో సోనియా ఇలాంటి మీటింగు పెట్టుకోమని ఎందుకు పురిగొల్పుతుంది?

షిండే సమావేశం నుండి చింతన్ శివిర్ చివరి వరకు కూడా కాంగ్రేస్ కదలికల్లో తెలంగాణా ఏర్పాటుకు అనుకూలత కనిపించింది. మధ్యలో సమైక్య వాదుల లాబీకి కూడా రవి, అజాద్ల దూషణ, తిరస్కారాలు ఎదురయ్యాయి. కాని, KVP రామచంద్ర రావు ఆధ్వర్యంలో సీమాంధ్ర లాబీ ఢిల్లీలోని పెద్ద నాయకులను కలిసిన తర్వాత పరిస్థితులు మారాయి.

KVP ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం సమైక్యంగా వుంచితే కాంగ్రేస్‌కు కలిగే ప్రయోజనాలను వివరించినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రం కలిపి వుంచితే 2014 వరకు జగన్‌ను కాంగ్రేసులో చేరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. 2014లొపు కలిస్తే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తుంది. జగన్ అవినీతి పై పెద్ద పెట్టున ప్రచారం చేసి TDP లబ్ది పొందుతుంది. కాబట్టి ఎన్నికల లోగా ఇవి రెండు కలిసే అవకాశం లేదు.

కాంగ్రెస్ వ్యూహం ఇలా కనిపిస్తుంది. ఎన్నికల వరకూ జగన్‌తో పోరాడినట్టు నటించడం. పైగా జగన్, TDPతో సహా అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలించినా, తాము సమైక్యత కోసం నిలబడ్డట్టు సీమాంధ్రలో బిల్డప్ ఇవ్వడం. ఇక తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ పంథాను వ్యతిరేకిస్తూ బయటికి వస్తారు. వారు TRSలో చేరకుండా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు చేసి వీలయినన్ని తెలంగాణా వాదంపై పోరాడే సంస్థలను కలుపుకుంటారు. వాటి సహకారంతో ఎన్నికల్లో పోటీ చేసి వీలయినన్ని సీట్లు గెలుస్తారు. ఇక TDP తాను కూడా తెలంగాణా ఏర్పాటుకు లేఖ ఇచ్చానని ప్రచారం చేసుకొని కొన్ని సీట్లు తెచ్చుకుంటుంది. BJP ముందునుంచీ తెలంగాణా వాదాన్ని వినిపించే పార్టీ కాబట్టీ అది కూడా కొన్ని సీట్లు గెలుస్తుంది.

ఇలా 2014 ఎన్నికల్లో బహుముఖ పోటీ ఏర్పడ్డం వల్ల  పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా ఒంటరిగా మారి, TRS గత ఎన్నికల మాదిరిగానే అతి తక్కువ సీట్లకు పరిమిత మవుతుంది. తెలంగాణా వాదం మరొకసారి నీరు గారుతుంది. ఇదీ స్థూలంగా KVP ప్లాన్. దానికి నాందీ వచనమే రాజమండ్రి మీటింగ్. దానికి స్క్రిప్టు  KVPది అయితే, దర్శకత్వం సోనియాది, నటుడు ఉండవల్లి.

తెలంగాణా ఏర్పడే వరకూ ఇలాంటి కుట్రలు ఎన్ని ఎదురవుతాయో చెప్పలేం. 2014 ఎన్నికల వరకూ తెలంగాణా వచ్చే అవకాశం ఎలాగూ కనిపించడం లేదు. కాబట్టి తెలంగాణా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా వుండి ఆ ఎన్నికల్లొ తెలంగాణా వాదం కొసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ అయిన TRSని మాత్రమే పూర్తి మెజారిటీతో 17 లోక్‌సభ సీట్లలో గెలిపించాలి. అదోక్కటే ప్రస్థుతానికి సీమాంధ్ర కుట్రలను ఎదుర్కొనే తరుణోపాయం.

4 comments:

  1. srikanth garu, there's also some news on rounds that TRS would eventually end up in to Congress and this is being discussed at the central level...idi gossip ayi undavachu or fact ayi undavachu, not sure.

    ReplyDelete
    Replies
    1. @telugodu,
      TRS has openly declared that it would merge in congress if telangana state is resulted. Since the only agenda of TRS is the formation of telangana, this is understandable.

      Delete
    2. srikanth garu... your writing is good.... but surprising to see that you write you in andhra slang rather than telangana slang.....

      Delete
    3. rajasekhara reddy garu,

      Slang is different from language. I write in both Telangana slang as well as Telugu language.

      Delete