Wednesday, April 27, 2011

చారిత్రక పటాలు చెప్తున్న చేదు నిజాలు

ఒకాయన ఏవో రెండు పటాలు గూగుల్ నుండి పట్టుకొచ్చి, తెలంగాణా, ఆంధ్రా భూమి పుట్టినప్పటి నుండి కలిసే ఉన్నయన్నట్టు మాట్లాడు తున్నడు. ఆయనకు సమాధానం చెప్పుదామని గూగుల్ వెతికిన. ఈ పటాలు చూసినంక తెలంగాణా, ఆంద్ర ఎన్ని రోజులు కలిసి ఉన్నయో మీరే చెప్పున్రి.


క్రీ.శ. 1

    క్రీ. శ. 200    

క్రీ. శ. 500 

క్రీ. శ. 1030 

   క్రీ. శ. 1200 

క్రీ. శ. 1560 

     
క్రీ. శ 1700         

క్రీ. శ. 1805 నుండి 1858 వరకు   

క్రీ. శ. 1860 

క్రీ. శ. 1934   

   1956 ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు.

పై పటాలు చూసి చిన్న పిల్లవాడు కూడా తెలుసుకొనేది ఏమిటంటే, తెలంగాణా, ఆంధ్రా పూర్తిగా ఎప్పుడు కూడా కలిసి ఒక దేశంగనో ఒక రాష్ట్రంగనో లేవు. ఒక వేళ ఎప్పుడన్నా కలిసి ఉన్నా, వేరే ప్రాంతాలు కూడా వాటితో కలిసి ఉన్నయి. ఉదాహరణకి కన్నడ ప్రాంతాలో, మరాఠీ ప్రాంతాలో, ఒరిస్సా ప్రాంతాలో, తమిళ ప్రాంతాలో కూడా మనతోటి కలిసి ఉన్నయి. అంతేగాని ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది ఇంతకు ముందు ఎన్నడు గూడ ఏర్పడి ఉండలేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది అని కుహనా సమైక్య వాదులు ఎన్ని కతలు చెప్పినా చరిత్ర మాత్రం అబద్ధం చెప్పదు. 

(సీమలో పుట్టి తెలంగాణా వేదనను అర్థం చేసుకుని, సంఘీభావం తెలిపిన సదరు బ్లాగరికి వందనాలు.)

No comments:

Post a Comment