Wednesday, April 20, 2011

బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

తెలంగాణాల బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

ఇవి ఒక విశాలాంధ్ర సమైక్యంగా ఉండాలెనని సుద్దులు జెప్పే పెద్దమనిషి మాటలు. ఈయన లెక్కల తెలంగాణా రైతులు బోర్ వెల్ తోవ్వుకొని మంచిగ సాగుజేసు కుంటున్నరు కాబట్టి వాళ్లకు ప్రాజెక్టులు అవసరం లేదట! తెలంగాణాల లిఫ్టు ఇర్రిగేషను ప్రాజెక్ట్లులు కడితే కరెంటు కర్సు ఎక్కువైతదట. వాళ్ళు బోర్ వెల్ బాయిలు తొవ్వుకొన్నరు కాబట్టి వాటి మీదనే బతకాలె నట. ఇది ఆ పెద్దమనిషి తీరు.

ఆంధ్రాల ప్రాజెక్టులు కట్టుకొని, కాలువలు తోవ్వుకోని ఆరాంగ సాలుకు మూడు కార్లు పండించు కోవాలె. తెలంగాణకి లిఫ్టు ఏ ఇర్రిగేషను ప్రాజెక్టులో పెట్టినా గూడ నష్టమే. అప్పో సప్పో జేస్తి బోర్ల మీద బోర్లు వేసుకోవాలే. వాటిల గూడ నీళ్ళు పడక పొతే భూమి ఏ ఆంద్ర ఫాక్టరీకో అమ్ముకొని హైదరాబాదుకు పొయ్యి రిక్షా తొక్కు కోవాలె. 

తప్పి జారి నీళ్ళు పడితె మోటార్లు పెట్టుకోవాలే. అయ్యి కాలి పోతుంటే వైరింగులు జేపిచ్చు కోవాలె. కొత్త మోటార్లు కొనుక్కోవలె. కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పొద్దు మాపు ఇల్లు సంసారం ఒదిలేసి పొలంలనే పండుకోవలె. ఇన్ని జేసిన తర్వాత, లో వోల్టేజీలు, ట్రాన్స్ఫార్మర్లు పేలి పోవుడులు. దాని తోటి పోలాలెండిపొతే ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాలె.

అదీ ఈ విశాలాంధ్ర సమైక్యవాది చెప్పే సమైక్య నీతి.

బోర్ల మీది పంపుసెట్ల సాగు కంటే లిఫ్టు ఇర్రిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా మెరుగో తెలుసుకోవల్నంటే ఈ ఏది సత్యం? టపా చదువున్రి.             

No comments:

Post a Comment