Friday, August 12, 2011

చిత్తూరుకేనా సీఎం..?!


చిత్తూరుకేనా సీఎం..?!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా...? లేక ఆయన సొంత జిల్లా చిత్తూరుకా...? ఇంకా చెప్పాలంటే ఆయన సొంతూరు కలికిరికా..? ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... చిత్తూరు జిల్లా కోసం ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఏమిటో చూద్దాం. తొలుత కలికిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తన తండ్రి నల్లారి అమర్ నాథ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ జీవో జారీ చేశారు.

అప్పటి నుంచే ఆయన తన సొంత జిల్లా, నియోజకవర్గంపై అమితమైన ప్రేమ చూపడం మొదలైందన్న విమర్శలు ఉన్నాయి. బడ్జెట్ లో కూడా తన నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధి కోసమంటూ 50కోట్ల రూపాయలను అధికారికంగా కేటాయించుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బడ్జెట్ లో తన సొంత నియోజకవర్గం కోసం అంటూ నిధులను ప్రత్యేకంగా కేటాయించుకోలేదు. ఈ ఘనతను కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కించుకున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతులకు ప్రత్యేక పథకం కింద 60కోట్లను కేటాయించాలంటూ కేంద్రానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. దీన్ని కేంద్రం గనుక అంగీకరిస్తే చిత్తూరు జిల్లా రైతాంగానికి సుమారు 200కోట్ల రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇక పాడి పరిశ్రమలో కూడా చిత్తూరు జిల్లా రైతులనే ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం విశేషం.

ఎన్నో ఏళ్ల కృషి తర్వాత మన రాష్ట్రానికి మొన్నటికి మొన్న మంజూరైన సైనిక్ స్కూల్ ను కూడా తన సొంత నియోజవకర్గానికే పంపడం తాజా ఉదాహరణ. అంతేనా ఇంకా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పీఠమెక్కాక చిత్తూరు జిల్లా మున్సిపాలిటీలను కార్పొరేషన్ల స్థాయికి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినా ఆ జాబితాలో చిత్తూరు జిల్లా పేరు తప్పని సరిగా ఉండాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ లో రెండు కొత్త పోస్టులను చేర్చారు.

అందులో ఛైర్మన్ గా ముఖ్యమంత్రి, వైస్ ఛైర్మన్ గా ఆర్ అండ్ బీ మంత్రి వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు శ్రీకాకుళం జిల్లావాసి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు ఆయన ఆశ్రిత పక్షపాతినికి నిదర్శనంగా కనబడుతాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకంటే చిత్తూరు జిల్లా అందులో మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనన్న విమర్శలు లేకపోలేదు.


Curtesy: HMTV

ఇదివరలో రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో భూములు తెగనమ్మి డబ్బులను కడపకు, ఇడుపులపాయకు, తన సొంత ఇంటికి తరలించాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చీ రాగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణా వాదులు తమ వాదం వినిపించడానికి గత చరిత్రలు తవ్వి తీసే పని లేకుండా, ప్రస్తుత నాయకులే రోజూ లైవ్ సినిమా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తూ కూడా ఇంకా సమైక్యవాదంతో  జనాన్ని నమ్మించాలని అనుకోవడం వీరికే చెల్లింది.

రాష్ట్ర ఎమ్మెల్యేలలో సీమాంధ్రులు అధికం కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక జిల్లానుంచి సీమాంధ్రుడే ముఖ్యమంత్రి అవుతాడు. తనప్రాంతాన్ని, తనజిల్లాని మాత్రమే అభివృద్ధి చేసుకుంటాడు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి తెలంగాణా వాడు ఏ అధిష్టానం దయతలిస్తెనో ముఖ్యమంత్రి అయినా కూడా వాడు తమకు కీలుబొమ్మగా వుంటే తప్ప సంవత్సరం కూడా సీమాంధ్రులు వాణ్ని కుర్చీలో కూచోనివ్వరు. కాబట్టి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకి భవిష్యత్తు లేదు.

2 comments:

  1. ముక్కు మంత్రి జిల్లా ఫీలింగ్ ని కందిత్తన్నా అద్దెచ్చా!

    ReplyDelete
  2. తెలంగాణాకి ఎంత చేసినా, మీ లాంటీ వాళ్ళ గుండెలు గోసిస్తూనే వుంటాయి.. అందుకే దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకుంటున్నారు.. తప్పేటి.. రేపొద్దున్న తెలంగాణా వచ్చేస్తే మీ ముక్కు తెలబాన్ నాయకుడు ఏ ఏరియా డెవలప్ చేస్తాడు.. కొంపదీసి బొబ్బిలి గాని డెవలప్ సేసీడు కదా...

    ReplyDelete