Sunday, April 1, 2012

ప్రజలు తెలంగాణా వాదాన్నే గెలిపిస్తరు


ఊరందరిది ఓదారి అయితే ఐలయ్యది ఇంకో దారి.

మొన్నటి ఎన్నికలు చూసి కరడు గట్టిన సమైక్యవాది కూడా నోరు మెదుపుడు బందు జేసిండు. ఇంక తెలంగాణా మీద ఆశ వదులుకొని హైదరాబాదు రాగం తీసుడు మొదలు బెట్టిండు.

ఐతే ఐలయ్యకు మాత్రం దీంట్లె తెలంగాణా వాదం కనపడ లేదట! కులం, మతం మాత్రమే కనపడ్డయట!

అందరి కుందేళ్ళకు నాలుక్కాల్లయితే, ఐలయ్య కుందేలుకు మూడే కాళ్లట!

అవును మరి! TRS మహబూబ్ నగర్ల ముస్లిముకు టికెట్ ఇస్తే గాయనకు దాంట్లె హిందూయిజం కనపడ్డదట! ఇబ్రహీమును కావాలనే TRS వాళ్ళు ఓడించిన్రట! కుట్రలు చేసి రెండువేల కంటే తక్కువ మేజారిటీ తోటి వోడించుడు ఎట్లా సాధ్యమైతదో ఐలయ్యే చెప్పాలే. 

స్థానిక JAC వాళ్ళు BJP కి వేస్తే వేసి ఉండొచ్చు. BJP అభ్యర్థి గెలిచే ఉండొచ్చు. కాని TRS పార్టీ BJP అభ్యర్థిని గెలిపించాలని చూసిందని చెప్పుడు ఎంత అన్యాయం? మరి ఏ శక్తులు ఐలయ్యని ఈ విధంగా మాట్లాడేటట్టు చేస్తున్నయి? తెలంగాణా ప్రజలు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగ వలసిన అవసరం వుంది.

ఒక వేళ 2009 ఎన్నికల్ల బరిలో నిలిచి తక్కువ మార్జిన్ల ఓడిపోయి పార్టీకి సేవ చేస్తున్న ఇబ్రహీంకు కాక ఇంకో హిందువుకు KCR టికట్ ఇచ్చి వుంటే, KCR ముస్లిం ద్వేషి అని ఈ ఐలయ్యే గొంతు చించుకునే వాడు కాదా? దానికి ఆంధ్రా మీడియా, ఆంధ్రా పార్టీలు వంత పాడే వాళ్ళు కాదా?

TRS ఒక ఫక్తు రాజకీయ పార్టీ. అది తన బలం పెంచుకోవాలని మాత్రమె చూస్తది. అట్లనే BJP కూడా. అదీ తెలంగాణా వాదం అడ్డం పెట్టుకొని తన బలం పెంచుకోవాలనే చూస్తది. తెలంగాణా ప్రజలు కూడా అంతే. తెలంగాణా వాదాన్ని బలపరచే పార్టీలనే గెలిపిస్తరు. ఇది అందరు అర్థం చేసుకుంటే మంచిది.


No comments:

Post a Comment