Friday, July 8, 2011

ఎవరు అండమాన్‌కు పోయేది?

డబ్బు మదం నరనరాన ప్రవహిస్తున్న సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు ఇష్టం వచ్చినట్టు పేలుతుంటరు. తెలంగాణా ప్రజలని, ఉద్యమాన్ని అవహేళన చేస్తుంటరు. ఇవి కొంతమంది సమైక్యాంధ్ర అంటూ నీతులు చెప్పే కుహనా సమైక్యవాద మేతావులకు పట్టవు, వారి చెవులకు వినపడవు. కాని ఎప్పుడో ఎక్కడో ఒక తెలంగాణా నాయకుడు ఏదోఒక మాట అనంగనే అదే పట్టుకొని దాశాబ్దాల పాటు విమర్షిస్తుంటరు. ఇలాంటి మేధావులు మేధావుల ముసుగుల దోపిడీదారులను సమర్థించే చెంచాలు మాత్రమే కాని నిస్పక్షపాత వ్యాఖ్యాతలు కారని ముందు గుర్తించవలసి ఉంది.

తాజాగా TG వెంకటేష్ అనే పెద్దమనిషి ఇలాంటి ప్రేలాపనలే మొదలు పెట్టిండు. తెలంగాణా వాదులని,  తెలంగాణా వాదం ప్రచారం చేసే మీడియాని అండమాన్‌ పంపించాలట! మూడున్నర కోట్ల మందిని అండమాన్‌కి పంపించగలడా ఈ పెద్దమనిషి? పైగా ఈయన రాష్ట్రమంత్రి కూడా. ప్రత్యేక రాష్ట్రం అడగడమే ఇతని దృష్టిలో నేరమైతే, అప్పుడే పొట్టి శ్రీరాములు వగైరా నాయకుల్ని అండమాన్‌లో తోసేస్తే, మాకు ఇప్పుడు ఈ సమస్యే అసలు ఉండేది కాదుగా?

చంచల్ గూడాలోనో, తీహార్‌లోనో ఉండాల్సిన వాళ్ళు పదవులు వెలగబెడుతుంటే ఇలాంటి మాటలు కాకపోతే ఇంకేమొస్తయి? టీజీ, నువ్వూ, నీతోటి రాజకీయ బ్రోకర్లు అధికారాన్నడ్డం పెట్టుకుని బొక్కింది, కబ్జాచేసింది అంతా బయటకు తీసే రోజు దగ్గర్లోనే ఉంది. అప్పుడు చూద్దాం, మీరంతా తీహార్‌కు పోతారో, అండమాన్‌కు పోతారో. ఇప్పుడు నువ్వు వెలగబెడుతున్న సీమాంధ్ర ప్రభుత్వం ఇంకెన్నో రోజులు సాగదని ముందు తెలుసుకో.


No comments:

Post a Comment