Thursday, October 31, 2013

పోలీస్ కమిటీకి తప్పుడు లెక్కలు

విజయకుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న పోలీస్ కమిటీకి సదరు విభాగం వారు భారీ ఎత్తున తప్పుడు లెక్కలు ఇస్తున్నట్టు వార్త. ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్, డీజీపీ ఆఫీస్ మదలైన రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో పని చేస్తున్న సిబ్బందిలో 80% వరకు ఆంధ్రా ఉద్యోగులు ఉండగా దాన్ని తగ్గించి 60%, 40% గా చూపెడున్నట్టు సమాచారం అందింది.

ప్రాంతీయ పక్షపాతంతో మొదటినుండి తెలంగాణా ప్రాంతానికి ద్రోహం చేస్తున్నవారు తప్పుడు లెక్కల సహాయంతో రాష్ట్ర విభజనలో వీలైనంత లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇది ఒక్క పోలీస్ విభాగానికే పరిమితం కాబోవడం లేదు.  అన్ని కార్యాలయాలలోనూ ఆంద్ర ప్రాంతానికి చెందిన అధికారులను, ఏవోలనే ముందస్తుగా నియమించుకొవడం ద్వారా ఇటువంటి తప్పుడు లెక్కలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది.

అయినా కరడు గట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం, దానికి పనిచేసే అధికారుల కార్యాచరణ ఇంతకన్నా అద్భుతంగా వుంటుందని ఊహించలేం. వీళ్ళు ఏం చేసినా రేపు తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఉద్యోగి సర్వీస్ రికార్డులు పునస్సమీక్షించడం జరుగుతుంది. అప్పుడైనా వీరు చేసే ఘోరాలు బయట పడక మానవు. మరి ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేయడం అంటారా? మోసాలు చేసే వాడికి మరో రకంగా ప్రవర్తించడం రాదుగా? అందుకని!

No comments:

Post a Comment