Tuesday, May 22, 2012

పరకాలలో బిజెపి, టీఅర్ఎస్ ల పోటీ ఎటు దారి తీస్తుంది?




ఇప్పటి వరకు తెలంగాణా పోరాటం విషయంలో ఏకైక పోటీదారుగా వున్న టీఅర్ఎస్‌కు ఇప్పుడు బిజేపీ రూపంలో పోటీ ఎదురైంది.

గతంలో తాము కూడా తెలంగాణాకోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణా ప్రాంత తిడిపి, కాంగ్రెసు పార్టీ నాయకులు అనేక మార్లు ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా తమ తమ సీమాంధ్ర నాయకులపై గల భక్తిని చాటుకుంటూ, యధాశక్తి ఉద్యమానికి ద్రోహం చేసిన కారణంగా, ప్రజలకు వారిపై నమ్మకం పూర్తిగా సమసి పోయింది. అటువంటి తరుణంలో టీఅర్ఎస్ పార్టీ ఎన్నికల పోరాటాలలో దిగ్విజయంగా గెలుస్తూ వస్తుంది.

కాని ఎన్నికల్లో జయకేతనాలు ఎగరేసిన ప్రతిసారీ, ఉద్యమం పట్ల నిర్లిప్తత వహించి పార్టీ అభివృద్ధి పట్ల మాత్రమే దృష్టి సారించడం తీఅర్ఎస్ పార్టీకి మొదటినుండీ వున్న అవలక్షణం. అదే విధానాన్ని మరోసారి కొనసాగిస్తూ తన మార్కు రాజకీయాలలో తలమునకలై వున్న కేసీఆర్‌కు, మహబూబ్‌నగర్ ఓటమి ఒక హెచ్చరికగా మారింది.

ఆ ఓటమి నుండి కోలుకోక ముందే పరకాల రూపంలో మరో ఎన్నిక వచ్చి పడింది. ఈ ఎన్నికలో కూడా బిజెపి పోటీ చేస్తానని ప్రకటించడంతో కెసియార్ గంగవెర్రులెత్తాడు. బిజెపీపై, దానితో పాటు జెయేసీ పై కూడా దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టాడు.

కాని ఇక్కడ కేసియార్ కొన్ని నిజాలు తెలుసుకోవడం మంచిది. ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రతిసారీ ఆయన అది తన గొప్పదనమో లేక తన పార్టీ బలుపో అని భావించడం మాని వేయాలి. అది తన ఉద్యమ నిబద్ధతకు ప్రజలిచ్చిన గుర్తింపుగా భావించి మరింత నిబద్ధతతో ఉద్యమ నిర్మాణానికి పునరంకితం కావాలి. కాని గత పదేళ్ళ టీఆరెస్ చరిత్ర చూసిన వారికి మాత్రం ఎప్పుడూ అలా జరిగినట్టు కనిపించదు.

తమ తెలంగాణా వ్యతిరేక ప్రవ్రృత్తిని చాటుకున్న TDP కాంగ్రెస్‌లను మట్టి కరిపించిన తెలంగాణా ప్రజలు, తెలంగాణా ఉద్యమాన్ని పక్కకు పెట్టి పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలితే, TRSకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పగలరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మహబూబ్‌నగర్ ఎన్నిక.

కాబట్టి ఇప్పటికైనా KCR బిజెపి పైనా, JAC పైనా అలగడం మానివేసి, ఉద్యమం మీద దృష్టి సారించాల్సిన అవసరం వుంది. ఉద్యమంతొ ఎంత మమేకం చెందితే, అన్ని సీట్లు వాటంతట అవే వస్తాయి. ఈ విషయం ఆయన ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

5 comments:

  1. నిజమే .
    కే సి ఆర్ లో కించిత్తు మార్పు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.
    కే సి ఆర్ తెలంగాణా ఉద్యమాన్ని తన ఎత్తుగడలతో,
    అద్భుతమైన ఉపన్యాసాలతో ఎంత ఉన్నత శిఖరాలకు తీసుకేళ్ళారో
    ... తన ఒంటెత్తు పోకడలతో, అహం తో, నిర్లక్ష్యం తో
    ఉద్యమానికి అంతే అన్యాయం కూడా చేసారు... చేస్తున్నారు.
    మామూలు పార్టీల నేతలు (రెండుకాళ్ల బాబు, మేకవన్నె పులి జగన్ ) తమ ఏసీ భవంతులను వదిలి
    ఎండనక వాననక ప్రతి రోజూ ప్రజల్లో తిరుగుతూ
    హోరెత్తిస్తుంటే కే సి ఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూచోడం దుర్మార్గం.
    కనీసం ఎన్నికల సమయమో కూడా నాలుగు ఊళ్ళల్లో పాదయాత్ర చేసే ఓపికలేదు.
    మోత్కుపల్లి నర్సింలు తిట్టే తిట్లు నిజం చేసుకునేలా ప్రవిఅర్తించడం చాలా బాధాకరం.
    ఎవరు చెప్పాలి ఈ నరమానవుడికి

    ReplyDelete
  2. Telangana MuddhubiddaMay 22, 2012 at 9:58 PM

    Anna.. naadhi kuda same feeling. BJP vachhi manchi pani chesindhi. edina oka bayamu untene koddigaa inka ekkuva kastapadathaadu. lekapothe antha naa istamu ani intlone bajjuntunnadu. Naakithe ikkada kuda BJP geluvalane undhi. Ikada BJP gelisthe next election varakalla chudu etla orukuthaaro... appudu telusthadi telangana vaallu okka votlu veyyadame kaadhu pani cheyyakapothe chamadalu teesthaarani.

    ReplyDelete
    Replies
    1. Thanks brother.

      Even Gandhi needed Bose and Ambedkar to correct himself from time to time. Yes, there needs to be competition even between T parties. And it is a good sign too, that parties are competing for T cause. But only thing that needs to pay attention is... the T votes should not split to make an anti-telangana party win.

      Delete
  3. @ఉద్యమాన్ని పక్కకు పెట్టి పార్టీ కార్యకలాపాల్లో మునిగి తేలితే, TRSకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పగలరు.........well said

    ReplyDelete