Monday, November 18, 2013

ఏం కతరా బై!

గాళ్ళ కత ఏందో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

యాభై మూడుల వాళ్ళు పోతం పోతం అంటే ఎల్లి పొండ్రి అని సాగనంపిన్రు తమిళ తంబిలు. ఉండున్రి మాతోనే అని ఒక్క మాటన్న అనలేదు!

యాభై ఆర్ల కలుస్తం కలుస్తం అంటే ఒద్దు మొర్రో అన్నరు తెలంగానోల్లు. అయినా కేంద్రాన్ని, హైదరాబాదు రాష్ట్రంల వున్న మరాటా, కన్నడులను అడ్డం పెట్టుకొని పైరవీలు చేసి కలిసి పోయిన్రు.

కలిసిన తెల్లారి నుండి ఒక్కటే గోల, మీరొద్దు బై మీరొద్దు బై అనుకుంట ...

అప్పటికన్నా మంచిగుంటే బాగుండే, కాని ఆ ఎవ్వారాలు చూసినంక కేంద్రమే విభజన చెయ్యాల్నని నిర్ణయించే!

ఇగసూడు ...

భద్రాచలం వాళ్ళు, మునగాల వాళ్ళు మేం వాల్లతోని కలవం మొర్రో అని ఒక్కతీర్గ మొత్తుకుంటున్నరు!

కనీసం కర్నూలోల్లు, అనంతపురపోల్లు కూడ వాల్లొద్దు, మీరే ముద్దు అన వట్టిన్రు!

మనుషులన్న తర్వాత నలుగురు కలిసె తట్టుండాలె... సూస్తే పారి పోయేటట్టు గాదు!

ఒకడు రాజ్యాంగం మార్వాలె నంటడు. ఒకడు ఆర్టికల్ 3 మార్వాలె నంటడు. ఇంకోడు నక్సలైట్లంటడు. మరోడు దేశ సమగ్రత అంటడు. గిట్ల ఆకుకు పోకకు అందని మాటలు మాట్లాడుతరు కాబట్టే ఎవ్వడు దగ్గరికి రాడు.

 చెప్పే అబద్ధాలు ఇనలేక జనం నవ్వుతున్నా సిగ్గు రాదు!

నీళ్ళు వృధాగా సముద్రంల కలుస్తయంటరు... అదే నోటితోని నీళ్ళు లేక కరువొస్త దంటరు.

తెలంగాణాను అభివృద్ధి చేసిన మంటరు... బొగ్గు మీదైతే ప్రాజెక్టులు మాదగ్గరున్నై, మీకు 50% కూడా కరెంటు రాదంటరు!!

ఒక్క ఉద్యోగం గూడ అన్యాయంగా తీసుకోలే దంటరు, విభజన వల్ల లక్ష మంది రోడ్డున పడుత రంటరు!!!

అయ్యా మీ అబద్ధాలు మీవోల్లే ఇప్పుడు నమ్ముదు బంద్  చేసిన్రు, ఇంకా మమ్ములనేం నమ్మించ చూస్తరు? ఇప్పుడన్నా జరంత నేల  మీద నడువున్రి... కనీసం మీవోల్లన్న నమ్ముతరు!


No comments:

Post a Comment