వోల్వో బస్సుల మాహారాష్ట్రకు పొయ్యి ఏర్ బస్సుల తిరిగి వచ్చిండు చంద్ర బాబు.
తెలంగాణాల ఈయన పరపతి ఇసుమంత కూడా పెరగ లేదు. ఇప్పటికీ తెలంగాణాల చూపెట్టుతందుకు ముఖం లేదు. ఎలాగోలా బాబ్లీ పేరు చెప్పి తెలంగాణాను ఇంకోసారి మోసం చెయ్యడానికి బాగనే ప్రయత్నం చేసిండు. కాని ఈయన పన్నాగాలు తెలంగాణాల పారలేదు.
ఇంకా ఈయన సాధించింది.
ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరుపుదాం అన్నా వినకుండా అరెస్టు చేస్తరని తెలిసి కూడా బాబ్లీకి వెళ్ళడం. అక్కడికి వెళ్లి తన్నులు తిని తెలుగువాడి పరువుని గొదావరిల కలపడం.
తిరిగి వచ్చి తెలుగు తమ్ముళ్ళ చేత మహా రాష్ట్ర లారీలు, బస్సులు తగల బెట్టించడం.
మహారాష్ట్ర దురభిమాని 'బాల్ థాకరే' ఏదో అన్నడని ఆయన దిష్టి బొమ్మ తగుల బెట్టించి తాను కూడా 'ఆంద్ర దురభిమాని' గా చాటు కోవడం.
ఇంతా చేసిన తర్వాత ఇప్పుడు బాబ్లీ ఆగుతుందా? మళ్ళీ చర్చలు జరప వలసిందే. కేసు కోర్టుల తెల వలసిందే.
పైనించి ఈయన మాహారాష్ట్ర వాళ్ళను రెచ్చగొట్టి వచ్చిండు. బాబ్లీ పైన వాళ్ళ పట్టుదలలను పెంచిండు. ఇప్పుడు మహారాష్ట్రల అధికార పక్షం, ప్రతి పక్షం అంత ఒక్కటై బాబ్లీని రక్షించు కుంతందుకు తయ్యారయ్యిండ్రు.
ఈయనకు ఇదంత జరుగుతదని తెలువదా?
ఎందుకు తెలువదు? బాగా తెలుసు. అరెస్టయిన గంటల లోపే ఫ్లేక్సీలు గూడ రడీ అయినాయి అంటేనే తెలుస్తది ఈయన ఎంత ప్లాను మీద ఉన్నడో!
మరి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతది అని తెలిసి గూడ ఎందుకు ఈవిధంగ చేసిండు?
ఈయనకు తెలంగాణా మీద ఎప్పుడూ ప్రేమ లేదు.
ఏ శ్రీరాం సాగరు కొరకైతే బాబ్లీ సమస్య ఎత్తుకున్నడో ఆ శ్రీరాం సాగరు కాలువలు తొవ్వేటందుకు ఈయన ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలే. శ్రీశైలం ఎడమ కాలువ తోవ్వడానికి గూడ ప్రయత్నం చెయ్యలే. ప్రతిపక్ష నాయకుని హోదాల కూడా పట్టించుకోలే.
రాజోలిబండ గేట్లు ఇరగ్గొట్టి ఈయన హయాంల రాయలసీమకు నీళ్ళు కొనబోయ్యి, మహబూబ్ నగర్ని ఎడారిగ మారిస్తె ఈయన తెలంగాణా కన్ను గుడ్డి పోయింది.
పోతిరెడ్డి పాడు అక్రమంగ కడుతుంటే ఒక్క సారి గూడ ఖండిస్తూ చిన్న స్టేట్ మెంట్ గూడ ఇయ్యలే.
పోలవరం ప్రాజెక్టు కింద లక్షలాది తెలంగాణా బిడ్డలు మునిగి పోతుంటె ఈయనకు అదేమి పట్టదు.
ఇలాంటి మనిషి తెలంగాణాను ఉద్ధరిస్తడు అనుకునేటందుకు తెలంగాణా ప్రజలు ఎడ్డోళ్ళు కారు. గుడ్దోల్లు అంతకంటె కారు.
ఇన్ని చెప్పే అవసరం లేదు. డిసెంబరు 9న ప్రకటన వచ్చినంక, సైంధవుని లెక్క ఈయన ఎట్ల అడ్డం బడ్డడో తెలంగాణా బిడ్డ లెవ్వరు ఇంకా మరిచి పోలే.
ఈయన నక్క ఎత్తులు, జిత్తుల ఆంధ్రల పారుతయేమో కాని తెలంగాణాల కాదు.
Thursday, July 22, 2010
Sunday, March 21, 2010
భయం
మధ్యానం మూడు గంటల సమయం. ఇరానీ హోటలు ఖాలీగ ఉన్నది. వెంకటేశ్ ని రెండున్నరకే రమ్మని చెప్పిన. ఇంకా రాలేదు. ఇప్పటికే రెండు చాయలు తాగుడయింది. ఇంకా తాగితె వాంతి కొచ్చే టట్టుంది. ఎందుకొస్త లేడు వెంకటేశ్ గింత సేపైనా? ఇంక లాభం లేదని బయటికొచ్చి నిలబడ్డ.
వెంకటేశ్ చెప్పిన టైముకు నిముషం గూడ లేటు చెయ్యడు. గియ్యా లేంది? గిట్ల యాది మరిచిండు?
వారం రోజుల నుంచి చూస్తున్న. వెంకటేశ్ అదో తీరుగ ఉండ బట్టిండు. ఎటో అలోచిస్తడు. ఏది చెప్పినా సరిగ్గా ఇనడు.
ఏందిరా వారి, ఎంకటేసు, ఎందుకురా గిట్లుంటున్నవ్. ఏమైందిర?
అడుగనే అడిగిన నిన్న నిన్న సాయంత్రం మొకం బట్టుకొని.
నాకేంగాలే, బాగనే ఉన్న.
సూస్తె తెలుస్త లేదా ఎట్లున్నవో? అద్దంల మొకం జూసుకో, తెలుస్తది. ఏమైతుందిర నీకు?
నాకేమైతలేదన్న, అయ్యేదంతా తెలంగాణకే. గా ఎమ్మెల్యేలు చూడు. గింత లొల్లి జరుగు తుంటే కూడ రాజీనామాలు చేస్త లేరైరి. మొన్న యూనివర్సిటీల కొచ్చి ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడినరో చూస్తివి గద? ఇప్పుడు ఒక్క డన్న కాన పడుతున్నాడె?
నాకు ఒళ్ళంతా జల్లున ఒనికినట్టయింది. గీ పోరడు గూడ ఏదైనా అఘాయిత్యం చేస్తడా ఏమి?
అరె వెంకటేసు. గయ్యన్ని మన కెందుకుర? రాజకీయ నాయకులు లక్ష చెప్పుతరు, చూస్త లేమా? గట్లనే గిది. ఎట్లయ్యేది గట్లనే అయితది. మనం ఆప్తె ఆగదు, నడువమంటే నడువదు.
అన్నా! మీరంతా గిట్ల మాట్లాడ బట్టే తెలంగాణా మొత్తం గీ పరిస్తితి కొచ్చింది. మీరంతా చూస్తానే ఉండున్రి, రేపు తెలంగాణా మొత్తం సాపు సాపు చెయ్యకుంటే చూడున్రి.
గీని మాటలు చూస్త ఉంటె నాకు భయం ఎక్కువ గాబట్టింది. గీ ఆవేశం ఎక్కడికి దారి తీస్తదో?
అరే వెంకటేసు, తెలంగాణా ఒచ్చేది ఖాయంరా. గిప్పుడు తెలంగాణల ఐదు సంవత్సరాల పోరడు గూడ తెలంగాణ కావాలె అంటుండు. నువ్వేం భయపడకు. తెలంగాణా తప్ప కుండ వస్తది. మనం చూస్తం. దేనికైనా ఓపిక పట్టాలె.
ఇంకా ఓపికేందన్నా? ఇన్నాళ్ళు పోరాటం చేసినం. చిదంబరం ఒప్పుకొని స్టేట్ మెంట్ గూడ ఇచ్చిండు. గిప్పుడు అంత మొదటి కొచ్చె.
ఒస్తెమాయే లేర. ఇంకొక యాడాది బడుతది. అంతేగా? శ్రీకృష్ణ కమిటీ ఏసిన్రు గా? ఇప్పటి దాంక ఏ కమిటీ ఏసినా గూడ తెలంగాణకి అన్యాయం చెయ్యలే. గట్లనే ఈ కమిటీ గూడ తెలంగాణకే ఫేవర్ జేస్తది.
ఎక్కడున్న వన్న నువ్వు? గీ కమిటీల తోని తెలంగాణ ఒస్తదను కున్నవా? ఫజలలీ ఏం జెప్పిండు? తెలంగాణ సపరేటుగా ఉండాలే అన్నాడు. ఏమైంది? తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్ ల కలిపేసిన్రు. గట్లనే గీ కమిటీ చెప్పంగనే తెలంగాణ ఒస్త దనుకోవడమే తప్పు. పోరాటం చేస్తేనే తెలంగాణ వస్తది.
ఏం జెప్పాలెనో అర్థం గాలేదు నాకు. నా మనసుల మెదులు తున్న ఆలోచన వాని కెట్ల చెప్పుదు? చెప్పి వానికి లేని పోని ఆలోచనలు మనసుల చొప్పిద్దునా? ఎటూ సమజ్ ఆయిత లేకుండె నాకు.
సరే గని గిప్పుడు గాదు, రేపు మధ్యానం రెండున్నరకు మొగల్ దర్బారు కాడికి రా, మాట్లాడుదం. వెంకటేశ్ ఆవేశంగ ఏదో మాట్లాడుకుంట వెళ్లి పోయిండు.
ఆలోచిస్తుంటే అప్పుడే నాలుగయింది. ఏడి, పోరడు ఇంకా రాక పోయె?
గప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఇయ్యాల గన్ పార్కు దగ్గర ర్యాలి ఉన్నది. ఒక దిక్కు గుండె దబ దబ కొట్టు కోవట్టింది. నాకు తెల్వ కుంటనే అడుగులు గన్ పార్కు దిక్కు పడ సాగినై.
ఎదురుగ పెద్ద గుంపు. ఎవరో మాట్లాడు తున్నారు. చుట్టూ అందరు గుమి గూడి ఉన్నరు. దగ్గరి కెళ్ళి చూసిన. వెంకటేసు ఆవేశంగా మాట్లాడు తున్నడు. కండ్లు ఆవేశం తోని మెరుస్తున్నై.
... మనం తెలంగాణ వచ్చే దాంక కొట్లాడాలే. ఒదిలి పెట్టేది లేదు. మనం ఏమాత్రం అజాగ్రత్త చేసినా తెలంగాణ రాదు. గట్లని ఎవ్వరు గూడ ఆత్మహత్యలు చేసు కోవద్దు. ధైర్యంగ పోరాడాలె...
ఇంక తర్వాత చెప్పేది నేను వినలే. ఇప్పుడు నా మనసు గాలిల తేలుతుంది. వెంకటేసుకి నేను చెప్పే పని లేదు. వాడే నలుగురికి చెప్పేటోడైండు.
Subscribe to:
Posts (Atom)